బీపీ ఎక్కువైతే ఏకంగా ఇన్ని ప్రమాదాలు ఉంటాయని తెలుసా?

Publish Date:Jan 12, 2024

Advertisement

అధిక రక్తపోటు అంటే హైపర్‌టెన్షన్ అనేది నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేసే తీవ్రమైన వ్యాధి. రక్తపోటు సాధారణ పరిమితిని మించిపోయినప్పుడు  శరీర అవయవాలను  ప్రభావితం చేస్తుంది. అధిక రక్తపోటు రోగులకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. సాధారణ అధికరక్తపోటు ఉన్నవారికి గుండెపోటు సమస్య పొంచి ఉంటుందని అంటారు. అయితే కేవలం గుండె మాత్రమే కాకుండా మరిన్ని విషయాల మీద బీపీ ప్రభావం ఉంటుంది.  బీపీ ఎక్కువైతే శరీరంలో ఏ ఏ అవయవాల మీద దారుణమైన ప్రభావం ఉంటుందో తెలుసుకుంటే వాటి గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.

గుండె సంబంధ సమస్యలు..

రక్తపోటు పెరగడం  గుండెకు అస్సలు మంచిది కాదు, గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, స్ట్రోక్,  హార్ట్ ఫెయిల్యూర్‌తో సహా హైపర్‌టెన్షన్ గుండెకు పెద్ద ప్రమాదాన్ని కలిగిస్తుంది.  రక్తపోటు పెరిగినప్పుడు   గుండె వేగం పెరుగుతుంది. ఈ సమయంలో శరీరంలోని మిగిలిన భాగాలకు  రక్తం ప్రవహించడం కష్టం అవుతుంది. ఇలాంటి పరిస్థితిలో హార్ట్ అటాక్ సమస్య వస్తుంది.

కరోనరీ ఆర్టరీ..

కరోనరీ ఆర్టరీ  అనేది గుండె సంబంధిత సమస్య. అధిక రక్తపోటు కారణంగా ధమనులు ఇరుకుగా మారి దెబ్బతింటాయి.  దీని కారణంగా  గుండె నుండి రక్తాన్ని సరఫరా చేయడంలో ఇబ్బంది పడతాయి. ఇలాంటి  పరిస్థితిలో గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది.

కంటి సమస్యలు..

హైపర్‌టెన్షన్ కంటిలో రక్తస్రావాన్ని ప్రభావితం చేయడం ద్వారా రెటినోపతి,  గ్లాకోమా వంటి కంటి సమస్యలను కలిగిస్తుంది. గ్లాకోమా అనేది కంటిలోపల రక్తపోటు పెరగడం వల్ల వచ్చే కంటి వ్యాధి. గ్లాకోమాకు హైపర్‌టెన్షన్ ఒక ముఖ్యమైన ప్రమాద కారకంగా వైద్యులు చెబుతున్నారు.

మానసిక సమస్యలు..

రక్తపోటు వల్ల మొదట గుండెకు ముప్పు కలిగినా గుండె తర్వాత ఇది  మెదడుకు  పొంచి ఉంటుంది. హైపర్‌టెన్షన్ మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.  స్ట్రోక్ వచ్చే అవకాశాలను పెంచుతుంది. అధిక రక్తపోటు కారణంగా జ్ఞాపకశక్తి కోల్పోవచ్చు. మెదడుకు రక్తం,  ఆక్సిజన్ సక్రమంగా ప్రసరణ కావడం  అవసరం.కానీ అధిక రక్తపోటు  ఈ ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది. దీనివల్ల మెదడుకు తగినంత ఆక్సిజన్ అందదు. ఫలితంగా  తీవ్రమైన మానసిక  సమస్యలు  తలెత్తుతాయి.

మెటబాలిక్ సిండ్రోమ్..

అధిక రక్తపోటు  మెటబాలిక్ సిండ్రోమ్‌ సమస్యను కలిగిస్తుంది. ఇది మధుమేహం, ఊబకాయం,  కొలెస్ట్రాల్ సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యలన్నింటినీ నివారించడానికి, రక్తపోటుకు  సకాలంలో చికిత్స తీసుకోవడం  చాలా ముఖ్యం.

                                      *నిశ్శబ్ద.

By
en-us Political News

  
పిల్లలు ఫోన్ వాడితే కళ్ళు పాడవుతాయా? కంటి అలసట, స్క్రీన్ టైమ్ ప్రభావం, ఐ ఎక్సర్‌సైజులు మరియు కంటి ఆరోగ్యంపై డా. కాసు ప్రసాద్ రెడ్డి ఇచ్చిన ముఖ్యమైన సూచనలు తెలుసుకోండి.
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఆహారంలో రకరకాల కూరగాయలు ఉండేలా చూసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం అని వైద్యులు చెబుతారు...
ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు లేదా  ఖాళీ సమయంలో..  చాలామంది  చిప్స్, నామ్కీన్, బిస్కెట్లు , ఇతర జంక్ ఫుడ్‌ను తింటుంటారు...
భారతీయుల ప్రధాన ఆహారం అన్నం.  మరీ ముఖ్యంగా దక్షిణ భారతీయులకు రోజులో కనీసం రెండు పూటల అయినా అన్నం ఉండాల్సిందే.. ఒకవేళ మధ్యాహ్న  భోజనంలో అయినా,  రాత్రి భోజనంలో అయినా చపాతీ లాంటివి తిన్నా....
వినికిడి లోపం అంటే ఒక వ్యక్తి అకస్మాత్తుగా శబ్దాలను వినలేకపోవడం అని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. చాలా సందర్భాలలో వినికిడి సమస్యలు మెల్లిగా  మొదలవుతాయి. మొదట్లో దీని లక్షణాలు  చాలా సాధారణంగా అనిపిస్తాయి...
ఈ రోజుల్లో వయసుతో నిమిత్తం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య నరాల బలహీనత మరియు విపరీతమైన నీరసం. షుగర్, బీపీ, అధిక బరువు, పోషకాహార లోపం లేదా దీర్ఘకాలికంగా వాడే కొన్ని మందుల....
ఎసిడిటీ నేటి కాలంలో చాలా మందిలో కామన్ గా మారిన సమస్య.  చిన్న వయసు వారి నుండి పెద్దల వరకు అందరికీ గ్యాస్, ఎసిడిటీ పెద్ద సమస్యగా మారుతోంది. మసాలా పదార్థాలు ఎక్కువగా తినడం,  రాత్రి  ఆలస్యంగా..
ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి చాలా మంది ఎన్నెన్నో చిట్కాలు పాటిస్తుంటారు. చర్మాన్ని ప్రకాశవంతం చేసుకోవడానికి..
ఇంట్లో కాఫీ, టీలు సాధారణంగా స్టీల్ లేదా పింగాణీ కప్పులలో తాగుతారు. కానీ బయటకు వెళ్లినప్పుడు చాలామంది  దుకాణాల దగ్గర కాఫీ..
ఎక్కిళ్లు ఏ వయసు వారికైనా వచ్చే ఒక సాధారణ సమస్య. ఎక్కిళ్లు సాధారణంగా కొన్ని నిమిషాల్లో వాటంతట అవే ఆగిపోతాయి, కానీ కొన్నిసార్లు అవి తగ్గకుండా చాలా అసౌకర్యాన్ని కలిగిస్తాయి...
మన చుట్టూ ఉండే ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఔషధాలలో జామ ఆకులు ఒకటి. ఎలాంటి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే లభించే ఈ జామ ఆకులతో కషాయం....
ఈ రోజుల్లో ఎయిర్ కండిషనర్లు (ఏసీలు) విలాస వస్తువు లా కాకుండా ఒక అవసరంగా మారాయి. ఇంట్లో, ఆఫీసులో, లేదా కారులో అయినా,  పగలు రాత్రి తేడా లేకుండా ఏసీల చల్లని గాలిలో సమయం గడుపుతారు...
నేటి కాలంలో నిమ్మరసం ఎంతో ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటి . శరీరాన్ని చల్లబరచడం నుండి డీహైడ్రేషన్‌ను నివారించడం వరకు నిమ్మరసం ప్రయోజనాలు..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.