జగన్నాటకంలో మడతడిపోయిన ఆర్జీవీ!

Publish Date:Jun 25, 2023

Advertisement

ఆర్జీవీ.. పేరు ఏదైనా కొత్తగా సినీ పరిశమ్రకి వచ్చే దర్శకులకు ఆయనో ఐకాన్. కెమెరాతో ఎన్ని ట్రిక్కులు చేయొచ్చో కెమెరా మెన్లకు సైతం పాఠాలు చెప్పేంత నేర్పరి. మూసబోయిన వెండితెరని మలుపులు తిప్పగల మేధావి. సినిమా అంటే ఇలానే ఉండాలని లిఖించిన చరిత్ర పుస్తకాన్ని చెడామడా నలిపేసి విసిరేసి, చింపేసి.. మరో కొత్త చరిత్రను రాసుకున్న నిపుణుడు. ఇదంతా నిజమే. కానీ.. ఒకప్పుడు. గతమెంతో ఘనకీర్తి ఉన్న ఈ స్వయంకృత మేధావి ఇప్పుడు ఆర్బీఐ బ్యాన్ చేసిన రూ.1000 నోటుతో సమానమైపోయాడు. ఆ రూ.1000 నోటును రిజర్వ్ బ్యాంక్ చెల్లకుండా చేస్తే.. వర్మ అతి తెలివే అతన్ని పనికిరాకుండా చేసింది. అప్పట్లో వరస సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఈడ్చి కొడుతుంటే ఏం చేయాలో పాలుపోక.. దెయ్యాలు, భూతాలను చూపించి కొన్నాళ్ళుబతికి బట్టకట్టేశాడు. ఆ తర్వాత వాటికీ ప్రేక్షకులు భయపడకపోవడంతో టెర్రరిస్ట్ అటాక్స్ మీద సినిమా ప్లాన్ చేశాడు. అక్కడే బీజం పడింది రాజకీయ నాయకులతో సహవాసం.

అసలే కోతి ఆపైన కళ్ళు తాగిన చందంగా పొలిటికల్ పార్టీలతో సంబంధం ఉన్న వాళ్ళు కొందరు నిర్మాతలుగా మారి వర్మని బుక్ చేసుకోవడం మొదలు పెట్టారు. సాధారణంగా సినిమాను ప్రేక్షకులు చూస్తేనే దర్శకులకు డిమాండ్.. కానీ వర్మ లాంటి వాళ్లకి సినిమా రిజల్ట్ తో పనేముంది. ఆ మాటకొస్తే వర్మ తీసే సినిమా నిర్మాతలే డబ్బు కోసం సినిమాలు తీయరు. పొలిటికల్ పార్టీలకి వీడియో అడ్వర్టైజ్ మెంట్ కోసం ఖర్చు పెట్టినట్లే.. వర్మ సినిమాకి ఖర్చు పెట్టేస్తారు. ఎలాగూ ఇది ఎన్నికల ఖర్చులోకి లెక్క కూడా రాదు. అలా గత 2019 ఎన్నికలకు ముందు వచ్చినవే లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు. ఈ సినిమాల సమయంలో ఏదో ఒక ఊపు ఊపేస్తాయని చాలామంది భ్రమ పడ్డారు. కానీ, ఫలితం శూన్యం. పోర్న్ స్టార్స్ తో సినిమా చేస్తేనే చాలా చూశాంలే ఆర్జీవీ పక్కకి సర్దుకోమన్న ప్రేక్షకులు.. అందరికీ తెలిసిన బాగోతాన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఇదే నిజం అంటే ప్రేక్షకులు నమ్మేస్తారని ఆశపడ్డ వారు బొక్కబోర్లా పడ్డారు. దీంతో తొలి రోజే థియేటర్లలో బొమ్మ బొరుసయ్యింది.

 బొమ్మ ఆడకపోయినా అప్పుడు ఆ ఎన్నికలలో ఆశించిన వారే గెలిచారు. దీంతో వర్మ సినిమానే సెంటిమెంట్ అనుకుంటున్నారో.. లేక అప్పుడు ఆ సినిమానే కళాఖండం అని భ్రమ పడుతున్నారో ఇప్పుడు మళ్ళీ ఈ ఎన్నికల కోసం తగుదునమ్మా అంటూ మరో సినిమాను తెచ్చారు. అదే 'వ్యూహం'. తాజాగా వచ్చిన ఈ టీజర్ లో హీరో జగన్మోహన్ రెడ్డి, విలన్ చంద్రబాబు. ఇవే పాత్రల పేర్లు. రాజశేఖరరెడ్డి మరణంతో మొదలయ్యే సినిమా జగన్ సీఎం కావడంతో ముగుస్తుంది. వైఎస్ఆర్ మరణం నుండి జగన్ సీఎం అయ్యే వరకు జరిగే కథనే ఇందులో చూపించారని వర్మ అండ్ కో చెప్పుకుంటున్నారు. కానీ, ఇందులో చంద్రబాబు విలన్ ఎక్కడ అయ్యారో టీజర్ చూసిన ఎవరికీ అర్ధం కాదు. ఎందుకంటే ఆ మొత్తం ఎపిసోడ్ అప్పటి కాంగ్రెస్ పెద్దలు, జగన్ మధ్య జరిగినదే. ఇది అప్పటికే కాస్త మూతి మీద వెంట్రుకలొచ్చినా అందరికీ తెలుసు. కానీ, ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు లేవు కదా. బహుశా అందుకేనేమో ఈ సినిమాలో కూడా చంద్రబాబునే విలన్ ని చేసినట్లున్నాడు.

 ఒక్కసారి వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా కథకు వెళ్తే సినిమా మొత్తం వైసీపీ నేత లక్ష్మీ పార్వతి అల్లిన కథే కనిపిస్తుంది. ఎన్టీఆర్ హయాంలో జరిగినది తెలిసిన వాళ్ళు ఆ సినిమా చూసి ముక్కున వేలేసుకున్నారు. అప్పటి చరిత్ర విన్న వాళ్ళు సైతం ఇదేదో తేడాగా ఉందే అనుకున్నారు. కానీ, ఇప్పుడు వర్మ వ్యూహం కథ మొత్తం గత 13 క్రితం నుండి నాలుగేళ్ళ క్రితం వరకు జరిగిందే. ఆ తొమ్మిదేళ్లలో ఏం జరిగిందో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇంకా కళ్ళ ముందే కనిపిస్తుంది. అందుకే టీజర్ లో చంద్రబాబు పాత్రను చూడగానే ఇది వైసీపీ ఎన్నికల ప్రచార సినిమా అని ప్రేక్షకులు ఫిక్సయిపోయారు. దీనికి తోడు సరిగ్గా ఐదు రోజుల క్రితమే వర్మ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఇక చెప్పేదేముంది.. ఇది 'వ్యూహం' కాదు జగన్నాటకమని!

By
en-us Political News

  
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.