అనుకున్నదొకటి.. అయినది మరొకటి!

Publish Date:Apr 14, 2025

Advertisement

అదేమిటో కానీ  తెలంగాణ ప్రభుత్వం  ఏం చేసినా,  ఏ నిర్ణయం తీసుకున్నా బూమరాంగ్ అవుతోంది. గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చి  ముఖానికి తాకుతోంది. ఏ నిర్ణయం తీసుకున్నా..ఏ ప్రాజెక్ట్, ఏ పథకం ప్రారంభించినా వివాదాలు, విమర్శలు వెంట వస్తున్నాయి. ఇది ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి అనుభవరాహిత్యానికి, ప్రభుత్వ అసమర్ధ పనితీరుకు అద్దం పడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
మరో వంక  హైడ్రా మొదలు రేవంత్  రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రతి ప్రాజెక్టూ విమర్శల సుడిగుండంలో చిక్కి అప్రతిష్ట పాలవుతోందనీ, ప్రజల్లోకి వెళ్ళ లేక పోతున్నామనీ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. వీటన్నిటికీ మించి  సర్వోన్నత న్యాయస్థానం, సూమోటోగా  విచారణ చేపట్టిన  హెచ్‌సీయూ భూముల వివాదం  రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్నే కాకుండా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని  అప్రతిష్ట పాలుచేసిందని అంటున్నారు.

ప్రాజెక్టుల పరిస్థితే కాదు, పథకాల పరిస్థితి కూడా   అలానే ఉందని అంటున్నారు. అందుకే, ఇంటా బయట విమర్శలు ఎదుర్కోవలసి వస్తోందని, కాంగ్రెస్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  అవును, అమలు చేయని గ్యారెంటీల విషయంలోనే కాదు.. అమలు చేసిన హామీల విషయంలోనూ విమర్శలు తప్పడం లేదు. అందుకే  రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏది తలపెట్టినా అనుకున్నదొకటి అయినది మరొకటి అన్నట్లుగానే  కథ అడ్డం తిరుగుతోందని అంటున్నారు. 

ఆఫ్కోర్స్  గత 15-16 మాసాలలో కాంగ్రెస్  ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు, 420 హామీలలో, అమలుచేసిన వాటికంటే అమలు చేయని గ్యారెంటీలు, హమీలే ఎక్కువ.  చెప్పింది కొండంత చేసింది గోరంత అని జనం పెదవి విరుస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి 15 మాసాలకు పైగానే అయినా  ఉచిత బస్సు, గ్యాస్ సబ్సిడీ వంటి ఏవో కొన్ని హామీలు మినహా  నిరుద్యోగ భృతి వంటి కీలక హామీల ఊసే లేదు. అలాగే మహిళలకు ఇచ్చిన హమీలదీ అదే కథ.  ప్రతి మహిళకు నెలకు రూ.2500 ఇస్తామన్న హామీ, ఆడ పిల్లలకు స్కూటీలు,  గత ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పేరిట ఇచ్చిన లక్ష రూపాయల పెళ్లి కానుకకు అదనంగా  తులం బంగారం ఇస్తామని ఇచ్చిన మహాలక్ష్మి హామీ, ఇందిరమ్మ ఇళ్లు వంటి  హామీల విషయంలో ప్రభుత్వం నూటికి నూరు శాతం చేతులు ఎత్తేసిందని అంటున్నారు. అలాగే రైతులకు ఇచ్చిన రుణ మాఫీ, రైతు బంధు హామీల అమలు అరకొరగానే వుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 

నిజానికి ప్రజల్లో కాదు అధికార  పార్టీ  నాయకులు, కార్యకర్తలల్లోనూ అసంతృప్తి  దాగడం లేదు. బయట పడుతూనే వుంది. ఎవరి దాకానో ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అంతగా సంతృప్తిగా లేరనే విషయం ఆయన మాటల్లో తొంగి చూస్తూనే వుంది. ఒకరిద్దరు మంత్రులు అయితే  రేవంత్ రెడ్డి ప్రభుత్వం కంటే, కేసీఆర్  ప్రభుత్వమే బాగుందని, ప్రజలు అంటున్నారని  తమ మాటను జనం నోటితో వినిపిస్తున్నారు. ఇక కాంగ్రెస్ అధిష్టానం సంగతి అయితే  చెప్పనే అక్కర లేదు. మింగలేక కక్క లేక అన్నట్లుగా ఉందని అంటున్నారు. 
అయితే  ఈ అసంతృప్తికి  కాంగ్రెస్ నాయకులకు  చేసింది చెప్పుకోవడం చేత కాకాకపోవడమే కారణమని కొందరు కాంగ్రెస్ నాయకులు  పరువు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.  కానీ  అది నిజం కాదు.  నిజానికి  ప్రచారం మోతాదు మించిందనీ, అందుకే ప్రభుత్వం,పార్టీ అప్రతిషతపాలు అవుతోందనే  అభిప్రాయం కూడా  పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోందని  అంటున్నారు.    

అదలా ఉంటే, తాజా  సెన్సేషన్  సన్న బియ్యం విషయమే తీసుకుంటే.. ఇతర విషయాలు ఎలా ఉన్నా సన్న బియ్యం చక్కని సూపర్ ఫైన్ సంక్షేమ పథకం. రాజకీయంగా  వెల్  పాలిషిడ్ ఆలోచన. రాజకీయంగా  ప్రయోజనం చేకూర్చే చక్కని పథకం. అయితే, అతి సర్వత్ర వజ్రయేత్  అనే మాట మరిచి  పథకం అమలు కంటే ప్రచారానికి ఎక్కువ ప్రాధన్యత ఇవ్వడం వలన  కథ అడ్డం తిరిగిందని అంటున్నారు. అందుకే  అనుకున్నదొకటి.. అయినదిమరొకటీ అన్నటుగా ప్రభుత్వం విమర్శలను ఎదుర్కోవలసి వస్తోందని అంటున్నారు.  పథకం ప్రారంభంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు లబ్దిదారుల ఇళ్ళకు వెళ్లి సన్న బియ్యం భోజనం చేయడం వరకు ఓకే.  కానీ, అలికి అన్నం పెట్టడం  ఊరికి ఉపకారం అన్నట్లు సాగుతున్న ప్రచారం ప్రమాదకరంగా మారుతోందని పార్టీ నాయకులే అంటున్నారు.

ఆఫ్కోర్స్  ఒక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే కాదు.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అయినా.. మరో ప్రభుత్వం అయినా,  ప్రతి ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా రాజకీయ లబ్దిని ఆశిస్తాయి. అలా ఆశించడం తప్పు కూడా కాదు. కానీ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో  ఉంచుకుని సన్న బియ్యమే సర్వస్వం అన్న రీతిలో పార్టీ నాయకులకు ఫత్వాలు జారీ చేసి మరీ  ప్రచారం సాగించడం వలన ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందని, అంటున్నారు.

మరో వంక రాష్ట్ర ప్రభుత్వం.. ముఖ్యంగా పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ కుమార్  రెడ్డి, సన్న బియ్యం క్రెడిట్ మొత్తం తమ సొంత ఖాతాలో వేసుకునేందుకు అసత్యాలు, ప్రచారం చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. నిజానికి  కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న ఉచిత బియ్యం పథకంలో భాగంగానే  రాష్ట్రంలో రేవంత్  ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని తీసుకొచ్చిందనీ, పేద ప్రజలకు పంపిణీ చేసే ప్రతి కిలో బియ్యాయినికి కేంద్ర ప్రభుత్వం రూ.37 ఇస్తున్నదని, మొత్తంగా చూస్తే సంవత్సరానికి రూ. 10 నుంచి రూ. 12 వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తోందనీ కేంద్ర మంత్రి  బండి సంజయ్  మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. అంతే కాదు, కేంద్ర నిధులు వద్దను కుంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని సవాలు విసిరారు. 

మరో వంక  బీజీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామాల్లో లబ్దిదారుల ఇంటింటికీ వెళ్లి మరీ వాస్తవాలను వివరించి  సన్న బియ్యం ప్రచారానికి కౌంటర్ గా  ‘మోడీ బియ్యం’  ప్రచారాన్ని ప్రారంబించారు. దీంతో ఇప్పడు గ్రామాల్లో సన్న బియ్యం వర్సస్ మోదీ బియ్యం ప్రచారం జోరందుకుంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ లబ్ధిని ఆశించి  ప్రారంభించిన సన్న బియ్యం పథకం కూడా బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు.

By
en-us Political News

  
అనీల్ కుమార్ యాదవ్.. పరిచయం అక్కర్లేని పేరు. జగన్ హయాంలో ఓళ్లూపై తెలియకుండా మాట్లాడి, తొడకొట్టి సవాళ్లు విసిరి పాపులర్ అయ్యారు. ప్రత్యర్థులపై నోరెట్టుకుని పడిపోవడమే రాజకీయం అన్నట్లుగా అప్పట్లో ఆయన వ్యవహార శైలి ఉండేది. ఆ తీరు కారణంగానే జగన్ కు దగ్గరయ్యారనీ చెబుతుంటారు. సరే అది పక్కన పెడితే వైసీపీ ఘోర పరాజయం తరువాత అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడా కనిపించలేదు. వినిపించలేదు. మౌనంగా మాయమైపోయారు.
జగన్ మీడియా అసత్య కథనాలపై దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  తన అనుచరులు, టీడీపీ కార్యకర్తలతో కలిసి ఏలూరు జిల్లా మీడియా కార్యాలయంలో వద్ద  నిరసన చేపట్టారు. టీడీపీ కార్యకర్తలతో కలిసి  ఆఫీస్‌ ముందు టెంట్ వేసుకోని నిరసన వ్యక్తం చేశారు. బాధితుల రక్త తర్పణం’ అంటూ జగన్ మీడియా కథనాన్ని ప్రచురించింది. బాధితుడి పక్షాన వార్త ప్రచురించినందుకు  వాస్తవాలు తెలుసుకోకుండా ఏ విధంగా రాస్తారంటూ  రిపోర్టర్‌పై చింతమనేని ఫైర్‌య్యారు. దాసరి బాబురావు అనే బాధితుడు బ్లేడుతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాధితుడి అండగా చింతమనేని బాధితుల రక్త తర్పణం’ అంటూ జగన్ మీడియా కథనాన్ని ప్రచురించింది
బూరగడ్డ అనిల్ అనంతపురం జైలులోనే ఈ నెల 30 వరకూ ఉంచాలని మొబైల్ కోర్టు న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. అలాగే ఈ నెల 30 వరకూ బోరుగడ్డ అనిల్ ను రాజమండ్రి తరలించకుండా అనంతపురం జిల్లా జైలులోనే రిటైన్ చేయాలని ఆదేశించారు. ఇంతకూ ఏం జరిగిందంటే.. బూరగడ్డ అనిల్ ను రాజమహేంద్రవరం జైలు నుంచి పీటీ వారంట్ పై అనంతపురం తీసుకు వచ్చారు.
జమ్మూ కశ్మీర్ పహల్‌గామ్ ఉగ్ర దాడికి వ్యతిరేకంగా ట్యాంక్‌బండ్ వద్ద కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నేతల నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఉగ్రవాదానికి, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ధ మృతులను స్మరిస్తూ నివాళులు అర్పించారు. ఉగ్రవాదానికి, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ధ అమరులను స్మరిస్తూ నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ పెహల్గం ఉగ్రదాడిని సభ్య సమాజం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ దాడి సిగ్గుమాలిన చర్యగా సమాజం చూస్తోందన్నారు
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు పోలీసులు కస్టడిలోకి తీసుకున్నారు. కోర్టు ఇచ్చిన కస్టడీ ఉత్తర్వులను సెంట్రల్ జైలు అధికారులకు అందించి.. కస్టడీకి తీసుకున్నారు. రెండు రోజుల కస్టడీ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి ప్రత్యేక వాహనంలో గోరంట్ల మాధవ్‌ను తీసుకుని ఎస్కార్ట్ సిబ్బంది గుంటూరుకు బయలుదేరి వెళ్లారు. రిమాండ్‌ ఖైదీగా ఉన్న గోరంట్లను ఇవాళ, రేపు గుంటూరు పోలీసులు కస్టడీ తీసుకున్నారు.
ఏ దేశ మేగినా, ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం, అన్నారు తెలుగు కవి రాయప్రోలు సుబ్బారావు. కానీ, దేశానికి ముగ్గురు ప్రధానులను ఇచ్చిన, నెహ్రూ గాంధీల కుటుంబం నాలుగో తరం నేత రాహుల్ గాంధీ, అందుకు పూర్తి విరుద్ధంగా ఏదేశం వెళ్ళినా, భారత దేశాన్ని అవమానించడం, అవహేళన చేయడం అలవాటుగా చేసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.
జమ్మూ కశ్మీర్‌  పహల్‌గామ్ ఉగ్ర దాడి బాధితులను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా పరామర్శించారు. తమ ఆప్తులను కోల్పోయిన వారు ఆ ఘటలను అమిత్‌షాతో పంచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. విహారయాత్రకు వస్తే తమ వారు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారంటూ వారు రోదించారు. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. బాధితులను ఓదార్చలేక అమిత్‌షా సైతం మౌనంగా ఉండిపోయారు. అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాంలో ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నివాళులర్పించారు. బుధవారం శ్రీనగర్‌లోని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్దకు హెలికాప్టర్ లో చేరుకున్న అమిత్ షా మృతదేహాల వద్ద పుష్ప గుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. కాల్పుల ఘటన జరిగిన తీరును అమిత్ షా వారిని అడిగి తెలుసుకొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి కేటాయించబోయే రాజ్యసభ స్థానం నుంచి.. పార్లమెంటులో అడుగుపెట్టబోయే అదృష్టవంతుడెవరో దాదాపుగా తేలిపోయిందంటున్నారు. వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఎంపీ సీటుని.. బీజేపీకి వదిలేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారన్న ప్రచారం జరుగుతోంది.
మొన్నటిదాకా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి ఏకగ్రీవం అయిపోతారనుకున్నారు. అక్కడ వాళ్లకున్న బలం అలాంటిది. కానీ.. ఎప్పుడైతే బీజేపీ తమ అభ్యర్థిని బరిలోకి దించిందో.. అప్పుడు ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో.. ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలిపి మొత్తంగా 112 మంది ఓటర్లు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును ఏపీ సీఐడీ బేగంపేటలోని ఆయన నివాసంలో అరెస్టు చేసి విజయవాడకు తరలించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సస్సెన్షన్ లో ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు జగన్‌ హయాంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పని చేశారు.
జమ్మూకాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం లో మంగళవారం (ఏప్రిల్ 22) జరిగిన దాడిలో ఇద్దరు తెలుగువారు మరణించారు. వారిలో ఒకరు నెల్లూరు జిల్లా కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ కాగా మరొకరు విశాఖ వాసి అయిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళిగా గుర్తించారు.
జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడింది తామేనని ప్రకటించడం ద్వారా ది రెసిస్టెన్స్ ఫోర్స్ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ప్రకటించడంతో ఆ సంస్థ మరో మారు వార్తలలోకి ఎక్కింది. పహల్గాం ఉగ్ర దాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. హిందూ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు ఈ దాడికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
విశాఖ ఐటీ హిల్ లో టీసీఎస్ కి ఎక‌రా 99 పైస‌ల‌కే ఇవ్వ‌డం క‌రెక్టేన‌ని.. క‌ళ్లు మూసుకుని చెప్పొచ్చు. కానీ కొంద‌రూ వైపీపీయులు దీన్నో భూత‌ద్దంలో పెట్టి చూపెడుతూ త‌ప్పు ప‌డుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.