బియ్యం ఎవరివి? పేరు ఎవరిది ?

Publish Date:Apr 7, 2025

Advertisement

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆదివారం (ఏప్రిల్ 6) ఓ పేదోడి ఇట్లో నేలపై కుర్చుని సహపంక్తి భోజనం చేశారు.ముఖ్యమంత్రితో పాటుగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మరి కొందరు ప్రజా ప్రతినిధులు కూడా ఇంచక్కా కాళ్ళు మడిచి నేలపై కూర్చునే, భోజనం చేశారు. నిజానికి, ముఖ్యమంత్రి ఒక్కరే కాదు,మంత్రులు,అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు, గత వారం  పది రోజులుగా, ఇలా పేదల ఇళ్లలోనే చేతులు కడుగుతున్నారు. అంటే, పేదల ఇళ్ళలో,  నేల భోజనమే చేస్తున్నారు. రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డున్న కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన నాటి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు పేదలతో కలిసి, సన్న బియ్యం విందుల్లో పాల్గొంటున్నారు.

అవును, వారం పదిరోజుల క్రితం  ఉగాది పండగను పురస్కరించుకుని  కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించింది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి సొంత నియోజక వర్గం హుజూర్‌నగర్ లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  పేదల సంక్షేమమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని  స్పష్టం చేశారు. ఇక అక్కడి నుంచి, మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్ధిదారుల ఇళ్ళకు వెళ్లి ప్రభుత్వం పంపిణీ చేసిన సన్నబియ్యం  అన్నం  వండించుకు తింటున్నారు. ఫోటోలు  దిగుతున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో  పోస్ట్ చేస్తున్నారు.  ప్రకటనల సంగతి అయితే చెప్పనే అక్కర లేదు.

అయితే సన్న బియ్యం పంపిణీకి ఇంత ప్రచారం  అవసరమా? అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, చారణా కోడికి బారణా మసాలా  అన్నట్లు కూసింత చేసి కొండంత ప్రచారం చేసుకుంటోందని ఆరోపిస్తున్నాయి. నిజమే విపక్షాల ఆరోపణను పూర్తిగా కొట్టివేయడం కుదరదు. ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తూ  రాజకీయ ప్రచారం చేసుకోవడం అన్నది  అది ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా, గత కేసీఆర్ సర‘కార్’ అయినా సరి కాదు. అలా చేయడం ఆత్మ వంచన, కాదంటే ప్రజలను మోసం చేయడమే అవుతుంది.  

అవును దానే దానే పే లిఖా హై ఖానేవాలే కా నామ్  అనేది లోకోక్తి. అంటే, భగవంతుని సృష్టిలోని ప్రతి గింజ పైనా  తినే వాడి పేరు రాసే ఉంటుందని  అర్ధం.  కానీ  ఇప్పడు రాజకీయ పార్టీలు ప్రతి గింజ పైనా తమ పేరు రాసుకునే వికారాలకు పోతున్నాయి.  అందుకే ఇప్పడు రాష్ట్రంలో సన్న బియ్యం వివాదంగా మారింది. పేదల కడుపులు ప్రచార వేదికలు అవుతున్నాయి. ఓ వంక రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ దానే దానే పే లిఖా హై రేవంత్  కా నామ్  అంటూ సన్న బియ్యం క్రెడిట్  మొత్తం తమ ఖాతాలో వేసుకుంటే, రాష్ట్ర బీజేపీ నాయకులు, దానే దానే పే లిఖా హై మోదీ కా నామ్ అంటూ క్రెడిట్ మొత్తం కేంద్రం ఖాతాలో అంటే కమలం ఖాతాలో వేసుకుంటున్నారు.

నిజానికి  ఇప్పడు కొత్తగా ఉగాది నుంచి పేదలకు పంపిణీ చేస్తున్న సన్న బియ్యం పథకంలో కానీ, ఇంతవరకు పంపిణీ చేసిన దొడ్డు బియ్యం పథకంలో కానీ  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెంటికీ వాటా వుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ  ఒక పైసా అటు ఒక పైసా ఇటుగా  ఖర్చును భరిస్తున్నాయి. ఆ వివరాలలోకి వెళ్ళవలసిన అవసం లేదు.  అయితే  కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వాలు ఖర్చు చేసేది చేస్తున్నది ప్రజల సొమ్మే కానీ, పార్టీల సొమ్ము కాదు. పజలు కట్టిన పన్నులతోనే ప్రభుత్వాలు పథకాలను అమలు చేస్తాయి. 

నిజానికి  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందే  సంక్షేమ పథకాల అమలుకు  తను తన జేబులోంచి రూపాయి కూడా తీయనని కుండ బద్దలు కొట్టినంత స్పష్టంగా చెప్పారు. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు అమలు చేయడం సాధ్యం కాదని చెప్పే సందర్భంలో  రేవంత్ రెడ్డి ప్రజలు మోస పోవాలని కోరుకుంటున్నారు. మేము (రాజకీయ పార్టీలు) మోసం చేస్తున్నాం  అంటూ ఎలాంటి దాపరికం లేకుండా కెమెరా సాక్షిగా  తమ అమూల్య అభిప్రాయాన్ని  స్పష్టంగా చెప్పారు. ముందు ముందు అవసరం అయితే చూసుకోవడానికి వీలుగా రికార్డు చేసి మరీ వినిపించారు. సో ..సన్న బియ్యం, దొడ్డుబియ్యం..  బియ్యం ఏదైనా, ఏ గింజ పైన అయినా, ప్రజల పేరే గానీ, పార్టీల పేరు ఉండదు. సో.. బియ్యం ఎవరివి ? పేరు ఎవరిదీ ? అనే చర్చ.. ఎవరు చేసినా  అది ఆత్మ వంచనే అవుతుంది. మోసమే అవుతుంది.

By
en-us Political News

  
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.