పవన్ కల్యాణ్ కు కోర్టులో ఊరట.. ఆ పోస్టులు తొలగించాలని ఆదేశించిన న్యాయస్థానం

Publish Date:Jun 18, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత   పవన్ కల్యాణ్‌కు కోర్టులో  ఉపశమనం లభించింది. గత కొన్ని రోజులుగా ఆయనపై  సోషల్ మీడియాలో వస్తున్న భూ ఆక్రమణల ఆరోపణలకు అడ్డుకట్ట వేస్తూ బెంగళూరు సివిల్ కోర్టు  మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేని, ధృవీకరించని ఆరోపణలను ఆన్‌లైన్ వేదికలపై వ్యాప్తి చేయకుండా నిరోధించేందుకు కోర్టు  జాన్ డో’ నిరోధక ఉత్తర్వులను జారీ చేసింది.  

 వివాదం వివరాల్లోకి వెడితే..   తెలంగాణ  రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న కోడి చెరువు భూములను పవన్ కల్యాణ్ అక్రమంగా ఆక్రమించారని, స్థానిక భూ రికార్డులను కూడా తారుమారు చేశారంటూ ఆన్‌లైన్ వేదికల్లో   ప్రచారం జరిగింది. వైసీపీ,  తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) అధినేత్రి కల్వకుంట్ల  కవిత చేసిన ఆరోపణల ఆధారంగా ఈ ప్రచారం ఊపందుకుంది. సదరు భూమి చెరువు పూర్తి నీటి మట్టం  పరిధిలోకి వస్తుందని వారు ఆరోపించారు. అయితే..  ఈ తప్పుడు ప్రచారం వల్ల తన ప్రతిష్టకు భంగం కలుగుతోందని పవన్ కల్యాణ్   కోర్టును ఆశ్రయించారు. కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి ముందే ఐటీ నిబంధనల ప్రకారం డాక్యుమెంటరీ ఆధారాలతో కూడిన అధికారిక ఫిర్యాదులను ప్రముఖ టెక్ దిగ్గజాలకు పంపినట్లు వారు కోర్టుకు వివరించారు.

ఈ కేసును కూలంకషంగా పరిశీలించిన బెంగళూరు సివిల్ కోర్టు..  పవన్ కల్యాణ్ వ్యక్తిగత, రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఎలాంటి ఆధారాలు లేని కథనాలను ప్రసారం చేయడాన్ని తప్పుబట్టింది. పవన్ కల్యాణ్‌పై నిరాధారమైన భూ ఆక్రమణ ఆరోపణలు చేసిన దాదాపు 12 లింకులను   కోర్టు తన ఉత్తర్వులలో ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఈ నిర్దిష్ట లింకులతో పాటు పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా  కంటెంట్‌ను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.

న్యాయస్థానం ఈ విషయంలో కేవలం మీడియా సంస్థలకే కాకుండా గ్లోబల్ టెక్ దిగ్గజాలకు ఆదేశాలు జారీ చేసింది. ఎక్స్,  గూగుల్,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు తమ వేదికలపై ఉన్నఆ 12 వివాదాస్పద లింకులను,  పవన్ కల్యాణ్ పరువుకు భంగం కలిగించే అన్ని రకాల పోస్టులను, వీడియోలను తక్షణమే బ్లాక్ చేయాలని ఆదేశించింది. ఈ మధ్యంతర  ఉత్తర్వులు వచ్చే నెల 24 వరకు అమల్లో ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది. 

By
en-us Political News

  
బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్‌లో రెండు, విశాఖపట్నం తీరంలో రెండు చొప్పున మొత్తం నాలుగు బీచ్ షాక్స్ బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనివల్ల పర్యాటక రంగానికి కొత్త ఊపు రావడమే కాకుండా, స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని విశ్వసిస్తోంది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) మరియు మ్యూచువల్ ఫండ్స్ (SIP)లలో నెలకు ₹12,500 చొప్పున 30 ఏళ్లు పెట్టుబడి పెడితే ఏ పథకం ద్వారా ఎంత ఎక్కువ లాభం వస్తుందో, ద్రవ్యోల్బణం ప్రభావం ఎలా ఉంటుందో పూర్తి గణాంకాలతో తెలుసుకోండి.
సరికొత్త 2027 పోర్షే టైకాన్ (Porsche Taycan) ఈవీ అప్‌డేట్స్ వచ్చేశాయి. టెస్లా తరహా NACS ఛార్జింగ్ పోర్ట్, డ్రైవింగ్ కిక్ ఇచ్చే 8 స్పీడ్ వర్చువల్ E Shift గేర్లు, 105 kWh భారీ బ్యాటరీ మరియు AI వాయిస్ కంట్రోల్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ కారు అదరగొడుతోంది. ధర, పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
విండోస్ మరియు లైనక్స్ సిస్టమ్స్‌లో మైక్రోసాఫ్ట్ 2011 సెక్యూర్ బూట్ కీస్ గడువు ముగుస్తోంది. జూన్ 2026 డెడ్‌లైన్ లోపు మీ కంప్యూటర్ మదర్‌బోర్డ్ సెక్యూరిటీని ఎలా అప్‌డేట్ చేసుకోవాలో ఇక్కడ క్లియర్ గైడ్ చూడండి.
అమెరికా గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు యూఎస్‌సీఐఎస్ బిగ్ షాక్ ఇచ్చింది. జూలై వీసా బులెటిన్‌లో ఎంప్లాయ్‌మెంట్ ఆధారిత EB-2, EB-3 కేటగిరీల కోసం కఠినమైన ఫైనల్ యాక్షన్ డేట్స్ నిబంధనలను తీసుకువచ్చింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వేదాంత అల్యూమినియం (VAML) షేర్లు డీమెర్జర్ మరియు మార్కెట్ లిస్టింగ్ తర్వాత తొలిసారిగా లాభాల బాట పట్టాయి. కోటక్, సిటీ వంటి దిగ్గజ బ్రోకరేజ్ సంస్థలు ఈ కొత్త స్టాక్‌పై భారీ టార్గెట్లతో కొనుగోలు పిలుపునిచ్చాయి. పూర్తి వివరాలు మరియు భవిష్యత్తు అంచనాలు ఇక్కడ చూడండి.
ఢిల్లీకి చెందిన ప్రముఖ డయాగ్నోస్టిక్ కన్జ్యూమబుల్స్ తయారీ సంస్థ ఏవియెన్స్ బయోమెడికల్స్ ఐపీఓ జూన్ 18న ప్రారంభమైంది. జూన్ 22 వరకు సబ్‌స్క్రిప్షన్ పొందేందుకు అవకాశం ఉంది. ఈ ఐపీఓ పూర్తి వివరాలు, రిస్క్ ఫ్యాక్టర్ల గురించి ఇక్కడ తెలుసుకోండి.
విదేశీ ప్రయాణానికి ప్లాన్ చేస్తున్నారా? మీ క్రెడిట్ స్కోర్ వీసా అప్రూవల్‌ను ఎలా ప్రభావితం చేస్తుందో, ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎలాంటి ఆర్థిక పత్రాలను పరిశీలిస్తారో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
మొదటిసారి ఆదాయపు పన్ను రిటర్నులు (ITR AY 2026-27) దాఖలు చేస్తున్నారా? కొత్త ట్యాక్స్ నిబంధనల వల్ల కొత్త ఫైలర్లు చేస్తున్న 4 ప్రధాన తప్పులు మరియు ఐటీ నోటీసుల బారిన పడకుండా ఉండటానికి నిపుణులు చెప్తున్న జాగ్రత్తలు ఇక్కడ తెలుసుకోండి.
సిట్రోయెన్ తన సరికొత్త ఇసి3ఎక్స్ (eC3X) ఎలక్ట్రిక్ కారును కేవలం రూ.6.89 లక్షల ప్రారంభ ధరతో భారత మార్కెట్లో విడుదల చేసింది. బ్యాటరీ అద్దె విధానం (BaaS మోడల్), 320 కిలోమీటర్ల మైలేజ్, పూర్తి ఫీచర్లు మరియు ధర వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
భారత క్రికెట్‌లోకి దూసుకొచ్చిన కొత్త పేస్ సంచలనం గర్నూర్ బ్రార్. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన తొలి రెండు వన్డేల్లోనే 6 వికెట్లు పడగొట్టి, జస్ప్రీత్ బుమ్రా సరసన నిలిచిన ఈ 6 4 పంజాబ్ ఎక్స్‌ప్రెస్ సంచలన రికార్డులు, అతని ఆసక్తికర క్రికెట్ ప్రయాణం మీకోసం.
భారత క్రికెట్ చరిత్రలో అరుదైన రోజు. జూన్ 17న భారత పురుషుల, మహిళల మరియు ఇండియా ఏ జట్లు వేర్వేరు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించి ట్రిపుల్ విక్టరీతో సరికొత్త రికార్డు సృష్టించాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
8వ పే కమిషన్ (8th Pay Commission) ఆన్‌లైన్ డేటా సమర్పణకు జూన్ 30, 2026 చివరి తేదీగా నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమ వివరాలను ఎలా సబ్మిట్ చేయాలో, తుది సిఫార్సులు ఎప్పుడు వస్తాయో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.