Publish Date:Apr 30, 2025
సిబ్బందు నిర్లక్ష్యానికి తోడైన ఈదురు గాలులు
అప్పటికప్పుడు నిర్మించిన గోడకు మేకులు కొట్టి పెండాల్స్ తాళ్లు కట్టిన సిబ్బంది
గాలి ఒత్తిడికి పెండా ల్స్ తో పాటు గోడ కూలినట్టు అనుమానం
కర్ణుడి చావుకు కారణాలు ఎన్నో అన్నట్టు సింహాచలంలో గోడకూలి ఏడుగురు భక్తుల మరణానికీ అన్నే కారణాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఇంజనీరింగ్ సిబ్బంది నిర్లక్ష్యం కాగా, వారి నిర్లక్ష్యానికి రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షం తోడైనట్లు కనిపిస్తున్నది.
ఏటా అక్షయ తృతీయ రోజు మాత్రమే నిజ రూపంలో అప్పన్న స్వామి దర్శనం ఇస్తారు. దీంతో అప్పన్న స్వామి నిజరూప దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు రావడం కద్దు. అయితే గతంలో ఈ ఉత్సవం విశాఖ, ఉత్తరాంధ్ర, ఒడిస్సా ప్రాంత భక్తులకు మాత్రమే పరిమితం అయ్యేది. కానీ దశాబ్ద కాలంగా ఇది ఒక విఐపి ఉత్సవంగా మారింది. గతంలో కేవలం సాధారణ భక్తులు మాత్రమే దర్శనానికి రావడంతో సులభంగా ఎలాంటి అవాంతరాలూ లేకుండా ఈ కార్యక్రమం సజావుగా సాగిపోయేది. అయితే గత దశాబ్ద కాలంగా ఇది వీఐపీల ఉత్సవంగా మారడంతో ప్రోటోకాల్ కోసం అధికారులు, దర్శనాల కోసం ప్రజాప్రతినిధులు ఒత్తిడి పెరిగిపోవడంతో పరిస్థితి మారిపోయింది. సాధారణ భక్తుల కంటే వీఐపీలు, స్వామీజీలు, న్యాయమూర్తులు ప్రజాప్రతినిధుల దర్శనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈసారి కూడా అదే ప్రక్రియ జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే అది కూడా ప్రమాదంలో భక్తుల మరణానికి దారి తీసింది. అదేలాగంటే..
సాధారణంగా సింహాచలం దర్శనానికి సాధారణ భక్తులు బస్టాండ్ నుంచి క్యూ లైన్ లోకి వెళ్తారు. వీఐపీలు ప్రోటోకాల్ అవకాశం ఉన్న భక్తులు రాజగోపురం నుంచి వెళ్తారు. అయితే చందనోత్సవం సందర్భంగా 300 రూపాయల టికెట్ క్యూ లైన్ కోసం బస్టాండ్ నుంచి ఏర్పాట్లు చేశారు. అక్కడ క్యూ లైన్ ను విభజించడానికి తాత్కాలికంగా ఫ్లైయాష్ తోగోడ నిర్మాణం జరిగింది. అక్కడ నుంచి కొంత దూరంలో ఎప్పుడూ ఉండే బారికేట్లు ఉన్నాయి. వాటి వరకు క్యూ కొనసాగేలా పునాదులు అవసరం లేకుండా గోడ నిర్మాణం జరిగింది. అదే సమయంలో గోడకి అవతలి వైపు చలువ పందిర్లతో బాటు పెండాల్స్ వేశారు. ఆ పెండాల్స్ గట్టిగా ఉండడానికి తాళ్లను దూరంగా భూమిలో ఐరన్ కొయ్య పెట్టి తాళ్లు కట్టాలి. కానీ స్యామియానా పెండాల్స్ సిబ్బంది తాత్కాలికంగా కట్టిన గోడకు మేకులతో తాళ్లు కట్టినట్టు తెలుస్తోంది. నిన్న రాత్రి ఉరుములు మెరుపులు , ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దాదాపు రెండు గంటల పాటు వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఈ భారీ వర్షానికి పెండాల్స్ ఈదురు గాలికి ఊడి పడడంతో తాత్కాలిక గోడ కూడా ఒరిగిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. దీన్నిబట్టి తాత్కాలిక నిర్మాణం అయినప్పటికీ నాణ్యత పరంగా ఏ మాత్రం జాగ్రత్తలు జాగ్రత్తలు తీసుకోకపోవడం, షామియానా సిబ్బంది అలక్ష్యం తోడై గోడ కుప్పకూలి ఏడుగురు ప్రాణాలు బలి తీసుకున్నట్టు తెలుస్తోంది దీనిపై ఇప్పటికే ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇది ఏ ప్రభుత్వ శాఖపైనా పడకుండా ఎవరికి వాళ్లు తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/reasons-for-simhachalam-mishap-25-197239.html
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.