రాప్తాడులో పరిటాల వర్సెస్ తోపుదుర్తి పొలిటికల్ వార్

Publish Date:May 5, 2025

Advertisement

 

ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాప్తాడు రాజకీయాలు ఎంతో ఆసక్తి రేపుతూ ఉంటాయ్. ఇది.. ఆంధ్రా మొత్తం తెలిసిన ముచ్చటే. ఎందుకంటే.. అన్ని చోట్లా వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా సాగే రాజకీయం.. రాప్తాడుకొచ్చేసరికి మరోలా మారిపోతుంది. ఇక్కడ.. పరిటాల వర్సెస్ తోపుదుర్తి వర్గాల మధ్య పొలిటికల్ వార్ పీక్‌ స్టేజీలో ఉంది. తెలుగుదేశం నుంచి పరిటాల సునీత ఓటమెరుగని నేతగా కొనసాగుతున్నారు. 2009, 2014, 2014 ఎన్నికల్లో.. పరిటాల సునీత 3 సార్లు ప్రకాశ్ రెడ్డిపై గెలుపొందారు. కానీ.. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలవడంతో.. తోపుదుర్తి బ్రదర్స్ లోకల్ పాలిటిక్స్‌ని శాసించారనే ప్రచారం ఉంది. ఐదేళ్ల పాటు వాళ్లు ఏం చెబితే అది జరిగిందనే టాక్ ఉంది. కానీ.. ఇది ఎంతో కాలం కొనసాగలేదు. 2024 ఎన్నికల్లో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. రాష్ట్రమంతా వైసీపీకి ఎదురుదెబ్బలు తగిలినా.. రాప్తాడులో ఆ పార్టీ ఓటమిని ప్రత్యేకంగా చూస్తున్నారు జనాలు. ఇందుకు.. ఓ ఇంటర్వ్యూలో తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే కారణం. రాప్తాడులో పరిటాల కుటుంబం గెలిస్తే.. మీసం తీసేస్తానని సవాల్ విసిరారు.

 ఫలితాల తర్వాత తోపుదుర్తి మాట మార్చడంతో.. సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. ఆ తర్వాత.. కొద్దిరోజుల పాటు రాజకీయంగా సైలెంట్‌గా ఉన్నాయ్ రెండు వర్గాలు. కానీ.. రామగిరి ఎంపీపీ ఎన్నిక సమయంలో తలెత్తిన వివాదం.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.గత నెలలో రామగిరి ఎంపీపీ ఎన్నిక సమయంలో తలెత్తిన వివాదం.. చినికి, చినికి గాలివానలా మారింది. అప్పుడు.. సొంత పార్టీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారని టీడీపీ ఆరోపించగా.. వైసీపీ నేతలు మాత్రం తమ పార్టీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేసేందుకు తెలుగుదేశం ప్రయత్నిస్తోందని పరిటాల సునీతపై ఆరోపణలు గుప్పించారు. అది చాలక.. ఎంపీటీసీలను పక్క రాష్ట్రంలో దాచి.. సరిగ్గా ఎన్నిక జరిగే సమయానికి తీసుకురాలేక.. మరో రోజుకి వాయిదా వేయించారు. ఆ తర్వాతి రోజు కూడా వారిని హాజరుపరచలేకపోయారు. ఇక్కడే.. అసలు కథ మొదలైంది. అదే రోజు.. పెనుగొండ ఎమ్మార్వో ఆఫీస్ కేంద్రంగా ఓ రభస జరిగింది. పోలీసులను బూతులు తిట్టారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి. ఇక.. అక్కడి నుంచి తోపుదుర్తి వర్సెస్ పరిటాల కాకుండా.. తోపుదుర్తి వర్సెస్ పోలీసుల్లా మారిపోయింది వ్యవహారం. ఎక్కడికి వెళ్లినా.. పోలీసుల్ని తిట్టడం ప్రకాశ్ రెడ్డికి అలవాటైపోయిందని పోలీస్ సంఘాలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయ్. ఇదే సమయంలో రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య హత్య తీవ్ర సంచలనం రేపింది. 

ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్ రావడం, జగన్ తిరిగి వెళ్లే సమయంలో.. హెలికాప్టర్ భాగాలు దెబ్బతినడంతో మొదలైంది అసలైన రాజకీయం. పోలీసులు సరైన భద్రత కల్పించలేకపోవడం వల్లే.. హెలికాప్టర్ దెబ్బతిందని వైసీపీ నేతలు ఆరోపించారు. అయితే.. వైసీపీ కార్యకర్తలను కావాలనే ప్రకాశ్ రెడ్డి రెచ్చగొట్టారని.. టీడీపీ నేతలు, పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన జరిగిన నెల రోజుల తర్వాత.. పోలీసులు అరెస్టులు చేసేందుకు సిద్ధమయ్యారు.ఈ హెలికాప్టర్ ఘటన కేసులో.. మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి అనుచరులపై కేసులు నమోదయ్యాయ్. ఇప్పుడు వారందరినీ అరెస్ట్ చేసే పనిలో పడ్డారు పోలీసులు. సుమారు 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి రిమాండ్‌కు తరలించేందుకు కోర్టులో హాజరుపరచగా.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్నారనే వార్తలు రావడంతో.. ఆయన హైదరాబాద్‌లో చక్కర్లు కొడుతున్న వీడియోని ఆయనే సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాంతో.. ప్రకాశ్ రెడ్డి అరెస్టులో ఎందుకు అలసత్వం వహిస్తున్నారంటూ.. సత్యసాయి జిల్లా పోలీసులపై డీజీపీ కార్యాలయం సీరియస్ అయ్యిందట. దాంతో.. ఆయన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు అగమేఘాలపై హైదరాబాద్, బెంగళూరు, విజయవాడకు ప్రత్యేక బృందాలు వెళ్లాయట.

 కానీ.. ప్రకాశ్ రెడ్డి మాత్రం హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసి.. బెయిల్ కోసం ఎదురుచూస్తున్నారట. మొదట బెయిల్ కోసం కాకుండా.. తనపై నమోదైన కేసు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ వేశారట. అది విచారణకు వచ్చేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో.. బెయిల్ పిటిషన్ కూడా వేశారట. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ప్రకాశ్ రెడ్డి.. జనాన్ని కంట్రోల్ చేసే వీడియో ఒకటి వైరల్ అయింది. ఈ వీడియో ఆధారంగానూ.. హైకోర్టులో బెయిల్ పిటిషన్ అప్లై చేశారనే చర్చ సాగుతోంది. మరోవైపు.. తోపుదుర్తికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కూడా హైకోర్టుకు విన్నవించారట. ఆయన్ని విచారిస్తేనే.. మరిన్ని వాస్తవాలు బయటకొస్తాయని.. కోర్టును కోరుతున్నారట. దాంతో.. తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిలో అరెస్ట్ టెన్షన్ మొదలైంది. కోర్టు గనక పోలీసులకు అనుకూలంగా ఆదేశాలిస్తే.. తన అరెస్ట్ ఖాయమనే ఆందోళనలో ఉన్నారు. మరి.. ఈ విషయంలో కోర్టు ఎలా స్పందిస్తుంది.? తోపుదుర్తి గనక అరెస్ట్‌ అయితే.. రాప్తాడు రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది.. ఆసక్తిగా మారింది.

By
en-us Political News

  
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
ప్రజాస్వామ్య విలువలతో కూడిన పాలనకు, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలాంటి అరమరికలూ లేకుండా మిత్రధర్మాన్ని తప్పకుండా నడపిన వాజ్ పేయి స్ఫూర్తిగా ముందుకు సాగాలన్న సంకేతాన్ని ఈ విగ్రహావిష్కరణ ద్వారా చంద్రబాబు ఇచ్చారని అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.