వైసీపీలో పాక పీకేసిన రాపాక!

Publish Date:Oct 14, 2024

Advertisement

గతంలో మాయలు, మంత్రాలు, గజకర్ణ, గోకర్ణ, టక్కుటమార విద్యల్లాంటివి వుండేవి అంటూ వుంటారు. కానీ ఇప్పుడు ఆ విద్యలు తెలిసినవాళ్లు ఎవరూ కనిపించడం లేదు. ఒకవేళ అక్కడడక్కడా ఒక్కళ్ళో, ఇద్దరో వున్నా, కొంతమంది రాజకీయ నాయకులను చూసి, వాళ్ళముందు తాము ఎందుకూ పనికిరామని తెలుసుకుని, తమకు వచ్చిన విద్యలు కూడా మరచిపోయి వుంటారు. అలాంటి కొంతమంది రాజకీయ నాయకులలో రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ని కూడా చేర్చవచ్చేమోననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

2019లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీ నుంచి రాజోలు నియోజకవర్గం నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి, రెండు చోట్లా ఓడిపోయారు. అన్ని స్థానాలకు పోటీ చేసినప్పటికీ ఒక్క రాజోలులో తప్ప జనసేన పార్టీకి ఏ నియోజకవర్గంలోనూ విజయం దక్కలేదు. అలా జనసేన తరఫున ఏపీ అసెంబ్లీలో ‘ఏక్‌నిరంజన్’గా రాపాక గుర్తింపు తెచ్చుకున్నారు. అసెంబ్లీలో జనసేన గళం వినిపించడానికి ఒక్క రాపాక అయినా మిగిలారని జనసేన వర్గాలు భావించాయి. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొంతకాలం రాముడు మంచి బాలుడిలా బుద్ధిగా వున్న రాపాక, ఆ తర్వాత పవన్ కళ్యాణ్’కి తన విశ్వరూపం చూపించారు. మెల్లగా వైసీపీకి అనుకూలంగా మాట్లాడ్డం ప్రారంభించి, ఆ తర్వాత స్వరం పెంచారు. చివరికి జనసేన మీదే విమర్శలు చేసి వైసీపీలో పాక వేశారు. వైసీపీలో చేరిన ఉత్సాహంలో వున్న రాపాక అప్పట్లో జనసేన పార్టీ ఎప్పటికీ గెలిచే పార్టీ కాదని, ఏదో తాను ఒక్కడిని గాలివాటంగా గెలిచాను తప్ప, భవిష్యత్తులో జనసేనకు ఒక్క స్థానంలో కూడా విజయం సాధించదు అని కరాఖండీగా చెప్పేశారు. అలాంటి రాపాక మొన్నటి ఎన్నికలలో అమలాపురం పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన పార్టీతోపాటు తాను  కూడా విజయవంతంగా ఓడిపోయారు. 

వైసీపీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీలో గత నాలుగు నెలలుగా ఉగ్గబట్టుకుని వున్న రాపాక ఇప్పుడు మెల్లగా తన ఒరిజినల్ స్ట్రేటజీ బయటకి తీశారు. వైసీపీని విమర్శిస్తూ ప్రకటన చేశారు. తనకు వైసీపీ ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదని, తనను రాజోలు అసెంబ్లీ స్థానం నుంచి అమలాపురం పార్లమెంట్ స్థానానికి వద్దు మొర్రో అన్నా వినకుండా పంపించారని, పార్టీలో తన మాటకు విలువ లేదు కాబట్టి తాను వైసీపీకి రాజీనామా చేయబోతున్నానని ప్రకటించారు. ఇంతవరకు బాగానే వుందిగానీ, రాపాకని టక్కుటమార విద్యలు తెలిసిన వాళ్ళతో ఎందుకు పోల్చినట్టా అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం.

ఏ జనసేన పార్టీ అయితే తనను ఎమ్మెల్యేగా గెలిపించిందో, ఆ జనసేన పార్టీ నమ్మకాన్ని పోగొట్టుకుని వైసీపీలో చేరిన రాపాక ఇప్పుడు ఎంతమాత్రం సిగ్గుపడకుండా, మొహమాటపడకుండా జనసేనలో చేరడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మకిలిపురంలో ఆదివారం నాడు జనసేన పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పిలవని పేరంటానికి వచ్చినట్టు రాపాక వరప్రసాద్ వచ్చేశారు. అక్కడకి వచ్చిన రాపాకని చూసి అందరూ షాకైపోయారు. రాపాక మెల్లగా అక్కడే వున్న రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్‌ని కలసి మాట్లాడి వెళ్ళిపోయారు. అంటే, మళ్ళీ జనసేనలో చేరడానికి పవన్ కళ్యాణ్‌తో రాయబారం చేయాల్సిన బాధ్యతని దేవవరప్రసాద్‌కి అప్పగించారని జనసేనలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ నమ్మకం మీద తీవ్రమైన దెబ్బ కొట్టిన రాపాకను ఎట్టిపరిస్థితుల్లోనూ తిరిగి పార్టీలోకి చేర్చుకోకూడదని జనసేన నాయకులు, కార్యకర్తలు ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు. మరి జనసేన అధినేత రాపాకకి నో చెబుతారో... జనసేనలో మరోసారి పాక వేసుకోమని ఎంకరేజ్ చేస్తారో చూడాలి.

By
en-us Political News

  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.