Publish Date:Nov 26, 2024
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పని అయిపోయింది. ఇప్పట్లో ఆ పార్టీకి ఎటువంటి అవకాశాలూ దక్కే పరిస్థితి లేదు. ఇటు మండలిలో, అటు రాజ్యసభలో తమకు తెలుగుదేశం కూటమి కంటే బలం ఉందని తన భుజాలు తాను చరుచుకుని సంతృప్తిపడే అవకాశం కూడా లేదు. ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ పార్టీని, మరీ ముఖ్యంగా ఆ పార్టీ అధినేత జగన్ ను నమ్మే పరిస్థితులు ఇసుమంతైనా కనిపించడం లేదు.
ఇప్పటికే వైసీపీ రాజ్యసభ సభ్యులు ముగ్గురు పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికీ కూడా రాజీనామా చేసేశారు. దీంతో రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా ప్రకటించేసింది. ఏ విధంగా చూసినా ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు జరిగే ఉప ఎన్నికలో వైపీపీ అభ్యర్థులను నిలబెట్టే అవకాశాలు లేవు. ఎందుకంటే నిలబెట్టినా గెలిచే పరిస్థితి లేదు. దీంతో ఇప్పుడు ఆ మూడు స్థానాలలో కూడా కూటమి అభ్యర్థులే ఎన్నికౌతారు. అయితే తెలుగుదేశం కూటమిలో రాజ్యసభకు వెళ్లేది ఎవరన్నదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్యలు వైసీపీ పార్టీకీ, రాజ్యసభ సభ్యత్వాలకూ కూడా రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. రాజీనామా చేసిన ముగ్గురిలో మోపిదేవి వెంకటరమణ, బీదమస్తాన్ రావులు తెలుగుదేశం గూటికి చేరారు. అయితే ఆర్. కృష్ణయ్య మాత్రం ఏ పార్టీలోనూ చేరలేదు.. సరికదా, బీజీలకు రాజ్యాధికారం కోసం సొంతంగా పార్టీ ప్రారంభిస్తానంటూ ప్రకటనలు చేస్తున్నారు. ఆయన ధోరణి వేరు. ఆయనను ఒక సీరియస్ పొలిటీషియన్ గా ఎవరూ పరిగణించే పరిస్థితి లేదు. చేరతానన్నా ఏ పార్టీ కూడా ఆయనకు రెడ్ కార్పెట్ వేసి వెల్ కమ్ చెప్పే అవకాశమూ లేదు. అన్నిటికీ మించి ఆయన తెలంగాణకు చెందిన వ్యక్తి కావడంతో ఆయనకు తెలుగుదేశం కూటమి మరో చాన్స్ ఇచ్చే అవకాశం ఇసుమంతైనా లేదు. ఆయనను పక్కన పెడితే... ఖాళీ అయిన మూడు స్థానాలలో రెండింటిని.. తాజా మాజీలు, అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తరువాత వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం గూటికి చేరిన వారికే దక్కే అవకాశాలు ఉన్నాయి. అంటే తెలుగుదేశం మోపిదేవి వెంకటరమణ, బీదమస్తాన్ రావులనే తమ పార్టీ తరఫున రాజ్యసభకు పంపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు.
తెలుగుదేశం కూటమి వర్గాల నుంచీ అదే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక ఖాళీ అయిన మూడో స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారన్నదే ఆసక్తికరంగా మారింది. ఈ స్థానం కోసం కూటమి పార్టీలలో పోటీ తీవ్రంగా ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. ఈ స్థానం కోసం బీజేపీ, జనసేనలు గట్టిగా పట్టుబడుతున్నారని కూటమి వర్గాల్లో కూడా ప్రచారం అవుతోంది. కూటమి పార్టీల ఐక్యతకు భంగం వాటిల్లకుండా చంద్రబాబు ఈ విషయంలో ఏం చేస్తారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rajyasabha-by-poll-25-189042.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.