భారత స్వాతంత్ర్య పోరాటానికి ఉగ్గు పోసింది ఈ ఉద్యమమే!

Publish Date:Aug 8, 2023

Advertisement

భారతదేశం ఈరోజు ఎంత స్వేచ్చగా ఉందో మాటల్లో వర్ణించలేనిది. బ్రిటీష్ పాలకుల చేతుల్లో నలిగిన భారతదేశం ఎలా ఉండేదో ఆ కాలంలో జీవించి, ఆనాటి పరిస్థితులు అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తాయి. నాటి పౌరులు తమ పరిస్థితులకు అక్షరరూపం ఇచ్చినా, నాటి పరిస్థితులకు దృశ్యరూపం ఇస్తూ సినిమాలు, డాక్యుమెంటరీలు రూపొందించినా అదంతా ఖచ్చితంగా నాటి భారతం అనుభవించిన క్షోభ కంటే తక్కువే.  తెల్లదొరల పాలన నుండి భారతదేశానికి  విముక్తి తీసుకురావడంలో ఎన్నో పోరాటాలు జరిగాయి. ఎందరో తమ ప్రాణాలు  త్యాగం చేశారు. ఈ భారతదేశ పోరాటాల్లో ప్రథమంగా చెప్పుకోగలిగింది క్విట్ ఇండియా ఉద్యమం. భారత స్వాతంత్య్రమే ధ్యేయంగా సాగిన  ఈ ఉద్యమం 81ఏళ్ళ కిందట ఇదే నెలలో, ఇదే తేదీన ఊపిరిపోసుకుంది. అంటే క్విట్ ఇండియా ఉద్యమం పురుడుపోసుకుని ఈ ఏడాది ఆగష్టు 8వ తేదీకి 81ఏళ్ళు. ఈ సందర్భంగా ఈ ఉద్యమ విశేషాలు, ఈ ఉద్యమం సాగిన తీరు తదితర వివరాలు తెలుసుకుంటే..

 1942సంవత్సరం, ఆగష్టు 8వ తేదీన క్విట్ ఇండియా ఉద్యమం మొదలైంది.  ఈ ఉద్యమానికి అప్పటి బొంబాయిలోని ఆగస్టు క్రాంతి మైదానం కేంద్రకమైంది(ఇదే ఇప్పటి ముంబై). భారత జాతీయ కాంగ్రేస్ ఆధ్వర్యంలో ఈ ఉద్యమం ప్రారంభించబడింది.  ఈ ఉద్యమాన్ని క్విట్ ఇండియా ఉద్యమం అనే కాకుండా ఆగస్టు ఉద్యమం అని కూడా అంటారు.  ఈ ఉద్యమంలోనే జాతిపిత గాంధీజీ  "డూ ఆర్ డై" నినాదాన్ని ఇచ్చారు. 'సాధించు లేదా మరణించు' అనే ఈ నినాదంతో  గాంధీజీ మార్గనిర్దేశకత్వంలో శాలనోల్లంఘన యాత్ర సాగింది.  భారతీయుల నిరసనను అడ్డుకోవడానికి బ్రిటీష్ ప్రభుత్వం ఆపరేషన్ జీరో అవర్ ప్రారంభించింది. ఎంతో మంది కాంగ్రేస్ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేయించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కాంగ్రేస్ కార్యాలయాలపై దాడులు చేయించింది. నివేదికల ప్రకారం దాదాపు లక్షమంది అరెస్ట్ చేయబడ్డారు. వీరందరూ చాలాకాలం పాటు ఖైదు చేయబడ్డారు. సుమారు 1000మంది మరణించారు. ఈ ఉద్యమంలో 2500మందికి పైగా గాయపడ్డారు.   ఉద్యమంలో కీలక సభ్యులైన గాంధీజీ, జవహార్ లాల్ నెహ్రూలను కూడా జైలులో పెట్టారు. ఇలా ఈ ఉద్యమాన్ని అణిచివేశారు. అయితే దీని తరువాత స్వాతంత్ర్యపోరాట ప్రక్రియను వేగవంతం చేయడంలో ఈ క్విట్ ఇండియా  ఉద్యమం చాలా కీలక పాత్ర పోషించింది. బ్రిటీషువారికి భారతదేశం మీద ఉన్న పట్టును బలహీనపరచడంలోనూ, వలసవాదవిదానాల పైన తీసుకోవలసిన నిర్ణయాలను, చేసుకోవలసిన మార్పుచేర్పుల అవసరాన్ని ఇది తేలతెల్లం చేసింది.

1945లో రెండవ ప్రపంచ యుద్దం ముగిసిన తరువాత రాజకీయంగా డీకోలనైజేషన్ ప్రక్రియను వేగవంతం చేశాయి. క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో భారతదేశ యోధుల పోరాటం మరింత ఊపందుకుంది.క్విట్ ఇండియా ఉద్యమం బ్రిటిష్ వారు భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్లే మార్పులు తక్షణమే తీసుకురాలేదు. అయినప్పటికీ, ఇది భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ఈ ఉద్యమం స్వాతంత్య్రానికి అనుకూలంగా భారతీయ ప్రజాభిప్రాయాన్ని పెంచడానికి దోహదపడింది.  భారతీయ ప్రజలు తమ స్వేచ్ఛను సాధించడానికి నిశ్చయించుకున్నారని బ్రిటీష్ వారికి బలంగా నొక్కి వక్కాణించింది. ఈ ఉద్యమంలోనే  భారతదేశ స్వాతంత్ర్యంలో కీలక పాత్ర పోషించే కొత్త తరం నాయకులు ఆవిర్భవించారు. జాతీయ ఐక్యతా భావాన్ని కూడా ఈ ఉద్యమం ద్వారా పెంపొందించగలిగారు.

మహిళలు కూడా..

క్విట్ ఇండియా ఉద్యమంలో ఎందరో  మహిళలు కీలక పాత్ర పోషించారు. అపారమైన ధైర్యాన్ని,  నాయకత్వాన్ని ప్రదర్శించారు. అహింసా యుద్దమనే కారణం ఈ  ఉద్యమంలో ఎంతో మంది మహిళలు చురుకుగా పాల్గొనడానేలా చేసింది.  సరోజినీ నాయుడు, సంగం లక్ష్మీబాయి, దుర్గాభాయ్ దేశ్ ముఖ్ లాంటి మహా వీర వనితల స్పూర్తితో, వారి నాయకత్వం కింద ఎందరో మహిళలు ఈ ఉద్యమంలో అపర చంఢికలై  కదం తొక్కారు. ఈ ఉద్యమలోనే విద్య, సంస్కృతి ప్రాధాన్యతను దేశం యావత్తు గుర్తించింది. ఈ కాలంలో దేశంలో ఎన్నో చోట్ల విద్యాసంస్థలు, సాంస్కృతిక కేంద్రాలు స్థాపించబడ్డాయి.

ఇలా క్విట్ ఇండియా ఉద్యమం భారతదేశ స్వాతంత్ర్య పోరాటం ఊపందుకోవడానికి గొప్ప ఉత్ప్రేరకంగా పనిచేసింది.  అలాగే విద్య,సంస్కృతి ప్రాధాన్యతను గుర్తించేలా చేసింది.  మొత్తం దేశ పౌరులను ఏకం చేసింది.

                                                           *నిశ్శబ్ద.

By
en-us Political News

  
పిల్లలు జీవితంలోని ప్రతి దశలో  ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా నిలబడాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. నేటికాలంలో మంచి పేరెంటింగ్ అంటే కేవలం మంచి విద్యను అందించడం లేదా..
వేసవికాలం అనగానే మండే ఎండలు గుర్తుకు వస్తాయి.  ప్రతి ఏడాది ఈ ఎండల ప్రభావం పెరుగుతూనే ఉంటోంది. ఈ కారణంగానే చాలామంది ఇళ్లలో ఏసీలు పెట్టించుకుంటారు.  అయితే ఏసీ పెట్టించుకునే అంత స్తోమత లేనివారు కనీసం కూలర్ అయినా...
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది..
నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు...
మీ జుట్టు మీ అందానికి ఒక కిరీటం వంటిది. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, కాలుష్యం మరియు రసాయనాల వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటోంది. మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా మరియు ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం...
ప్రేమించిన వారిని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా? మీ జీవితం మరియు మీ భాగస్వామి భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోండి...
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు...
పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అయినా.. వారు చదువులు పూర్తయ్యి,  పెళ్ళి చేసుకుని, వారు కూడా పిల్లలను కన్నా సరే.. తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలు ఎంతవాళ్లైనా ఇంకా చిన్న పిల్లలు గానే అనిపిస్తూ ఉంటుంది...
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి...
భారతీయుల ఇళ్లలో చాలా వరకు కరివేపాకు మొక్క పెంచుతూ ఉంటారు. ఇంటి బయట ఏ మాత్రం కాస్త స్థలం ఉన్నా సరే.. మొదటగా కరివేపాకు మొక్కనే పెంచుతూ ఉంటారు. కరివేపాకు మొక్క ఎదుగుదలకు కూడా భారతీయ...
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే..
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది....
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.