Publish Date:Mar 28, 2026
ప్రధాని నరేంద్ర మోడీ తన కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించాలని భావిస్తున్నారా? మంత్రుల శాఖల్లో భారీ ఎత్తున మార్పులతో పాటు.. కొందరికి ఉద్వాసన, మరొ కొందరికి చోటు కల్పించనున్నారా? అంటే ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో ఔననే వినిపిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ క్యాబినెట్ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ కసరత్తు ఆరంభించినట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలుస్తోంది. కాగా మోడీ తన కేబినెట్ విస్తరణలో శాఖల మార్పు ఉండే మంత్రులలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రులకు మరింత ప్రాధాన్యత ఉన్న శాఖలను అప్పగించాలని మోడీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. కాగా వచ్చే నెలలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు చెబుతున్నారు. మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏపీకి చెందిన మంత్రులు పెమ్మసాని, కింజారపు రామ్మోహన్ నాయుడుల శాఖలను మార్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. అలాగే తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శాఖను సైతం మారుస్తారని చెబుతున్నారు.
ప్రస్తుతం కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ కు ప్రమోషన్ ఖాయమంటున్నారు. ఆయనకు స్వతంతర హోదా కల్పించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇక పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడికి శాఖ మార్చి అంతకంటే ప్రాధాన్యత ఉన్న గ్రామీణాభివృద్ధి శాఖను కేటాయించే యోచనలో ప్రధాని మోడీ ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ఏపీ నుంచి అదనంగా మరో ఇద్దరికి కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉందని అంటున్నారు. కొత్తగా కేబినెట్ లో చోటు దక్కించుకునే వారిలో రాజమహేంద్రవరం ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, అలాగే లోక్ సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి తనయుడు, అమలాపురం ఎంపీ హరీష్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.
ఇక ఇప్పటికే . బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం దాదాపు ఖరారైందని చెబుతున్నారు. ఆయన ఇటీవలే రాజ్యసభకు ఎంపికైన సంగతి తెలిసిందే. అదలా ఉంచితే కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొందరు సిట్టింగ్ మంత్రులకు ఉద్వాసన తప్పదని కూడా తెలుస్తోంది. అలా ఉద్వాసన పలికిన మంత్రులకు పార్టీ పదవులు అప్పగించాలని మోడీ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/promotion-for-pemmasani-and---kinjarapu-portfolio-change-39-216347.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.