మెగా స్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరమయ్యారు. కానీ రాజకీయాలు మాత్రం ఆయనక దూరం కాలేదు. ఈ విషయాన్ని చిరంజీవే గతంలో స్వయంగా ట్వీట్ చేశారు. ఆయన గతంలో నటించిన గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ కోసమే.. లేదా ఉభయతారకంగా కలిసి వస్తుందనో కానీ ఆయన ఆ సినిమా విడుదలకు ముందు ఆ సినీమా పోస్టర్ తో కూడిన ఓ ఆడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు అంటూ ఆయన చేసిన ట్వీట్ అప్పట్లో సంచలనం సృష్టించింది.
అది ఆ సినిమాలో ఆయన డైలాగ్ అయితేనేం.. అక్కడ నుంచి ప్రతి సందర్భంలోనూ చిరంజీవి రాజకీయాలకు కేంద్ర బిందువుగానే ఉన్నారు. కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాల వరకూ ఆయన ఫేమ్ ను పాపులారిటీని రాజకీయాల కోసవ వాడుకునేందుకు అన్ని పార్టీలూ తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అయితే చిరంజీవి మాత్రం తామరాకు మీద నీటి బొట్టు చందంగా అందరికీ సమదూరంలో ఉంటున్నట్లుగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే గత ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత నుంచీ ఆయన ఒకింత బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారంటూ పరిశీలకులు విశ్లేషించారు. ఇక ఇప్పుడు తాజాగా ఆయన గతంలో తాను ప్రారంభించి కాంగ్రెస్ లో విలీనం చేసిన ప్రజారాజ్యం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో తాను ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీయే ఇప్పుడు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనగా రూపాంతరం చెందిందని చెప్పారు. దీంతో పవన్ కల్యాణ్ నోట జనసేన నినాదం రావడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది.
తాజాగా లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం (ఫిబ్రవరి 9)జరిగింది. ఆ ఈవెంట్ కు చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆయన జై జనసేన అంటూ నినదించారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రజారాజ్యం ప్రస్తావన చేశారు. అందుకు కారణం లేకపోలేదు. ఆ కార్యక్రమంలో చిరంజీవి ప్రసంగం ప్రారంభించగానే ప్రేక్షకులు పెద్ద ఎత్తున జై జనసేన నినాదాలు చేశారు. దీంతో ఆయన కూడా వారితో గొంతు కలిపారు. జై జనసేన అని నినాదం చేయడమే కాకుండా.. తాను ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీయే జనసేనగా రూపాంతరం చెందిందని భాష్యం చెప్పారు. చిరు చేసిన ఈ వ్యాఖ్యల పట్ల మెగాభిమాల్లో ఆనందం వ్యక్తం అవుతుంటే.. రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఇక నుంచి చిరు ప్రత్యక్షంగా జనసేన కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మరో వైపు ఆయన బీజేపీవైపు కూడా మొగ్గు చూపుతున్నారని ఇటీవలి పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. జనసేన ఇప్పటికే బీజేపీ మిత్రపక్షంగా ఉంది. దీంతో ముందుముందు చిరంజీవి సెంట్రిక్ గా బీజేపీ, జనసేనల రాజకీయ కార్యకలాపాలు ఉంటాయని అంటున్నారు. మొత్తం మీద చిరంజీవి నోట జై జనసేన నినాదం రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/prajarajyam-became-janasena-39-192622.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది