మానసిక సమస్యలకు ఎవరూ అతీతులు కాదు.. ?

Publish Date:Feb 8, 2021

Advertisement

ఇటీవలి కాలంలో చాలామందిలో స్చిజోఫ్రీనియా గురించి విటున్నాము నాగ్ నాధ్  గారు  ఆశలు ఇది ఏరకమైన అనారోగ్యం కిందకు వస్తుంది ? ఇది ఒకరకమైన మానసిక వైకల్యంగా చెప్పొచ్చు.. ప్రపంచ జనాభాలో ఎంతమంది  స్చిజోఫ్రీనియాతో బాధపడుతున్నారు ? ప్రపంచ జనాభాలో 11 % మంది  ప్రజలు వివిద రకాల మానసిక సమస్యలతో బాధపడుతున్నారు.  అమెరికాలో 3.5 మిలియన్ ప్రజలు  స్చిజోఫ్రీనియాతో బాధపడుతున్నారని మానసిక వైద్యులు నాగ్ నాథ్ అన్నారు. స్చిజోఫ్రీనియా  సమాస్య ఉన్నవాళ్లు  ఎలా ప్రవర్తిస్తుంటారు? ఇది ఇప్పటికిప్పుడు వచ్చిన సమస్య కాదు  కొన్ని ఏళ్లుగా ఉండి  ఉండవచ్చు అన్నారు నాగ్ నాధ్. వీళ్ళు వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటారని , ఆలోచనలు సవ్యంగా ఉండవని, అందరిలా కాకుండా సమాజానికి విరుద్ధంగా  ప్రవార్థిస్తూ ఉంటారు.  దీనిని  ఏరకమైన డిజార్డర్ గా పేర్కొంటారు ? దీనిని సైకోటిక్ డిజార్డర్ గా  చెప్తారు . ఇలాంటి సైకోటిక్ డిజార్డర్ తో బాధపడేవాళ్లను ఎలా గుర్తించాలి ? వీళ్ళు మామూలుగానే ఉంటారని అయితే సైవోటిక్ డిజార్డర్ తో ఉన్నవారు  ఆ సమయంలో వాస్తవాలను గుర్తించరని నాగ్ నాధ్ చెప్పుకొచ్చారు.

అసలు స్చిజోఫ్రీనియా ను గుర్తించవచ్చ? అసలు  ఏ ఏ వయస్సుల వారిని ఈ సమస్య . వేధిస్తుంది ? దీనిని గుర్తించడం సులభమే అని అన్నారు . 16  నుంచి 25  సంవత్సరాల  మధ్య వయస్సు ఉన్నవారు  దీని బారిన పడుతున్నారని అన్నారు. స్చిజోఫ్రీనియా  వారసత్వంగా వస్తుందా ? కుటుంబంలో ఎవరికైనా ఉండవచ్చు . అప్పుడే దీనిని గుర్తిస్తే  సమస్య నుంచి బయటపడచ్చు. అసలు స్చిజోఫ్రీనియా  ఎవరికీ ఎక్కువగా వస్తుంది అంటే స్త్రీలలోనా,  పురుషులలోనా ? స్త్రీలకంటే పురుషులలో 1 5 % అని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారని  అన్నారు మానసిక నిపుణులు  నాగ్ నాధ్ . చిన్నపిల్లల్లో స్చిజోఫ్రీనియా  వస్తుందా ? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అంచనా ప్రకారం  40,000   మంది పిల్లలో ఒకరికి మాత్రమే వస్తుందని, ఈసమస్య 13  సంవత్త్సరాల ముందు రావచ్చని, ఇంకా పూర్తి పరిశోధన అంశాలు రావాల్సి ఉందన్నారు  నాగ్ నాధ్  గారు.  అసలు స్చిజఫ్రీనియా ఎన్నిరకాలు ఉండచ్చు ? ఇందులో ఐదు రకాల  స్చిజోఫ్రీనియా ఉందని అంతార్జాతీయ  మానసిక విభాగం చేసిన అధ్యయనంలో పేర్కొన్నారు . వీటిలక్షణాలను బట్టి వేరు వేరు గా విభజిం చారని నాగ్ నాధ్   పేర్కొన్నారు .

అవి వివరిస్తారా ? 1) పరో నోయిడ్  స్చిజోఫ్రీనియా  2) డిసోర్గనైజ్డ్ స్చిజోఫ్రీనియా  3) కాటాటోనిక్ స్చిజోఫ్రీనియా  4) అండిఫరియేట్డ్  స్చిజోఫ్రీనియా  5) రెసిడ్యూయల్  స్చిజోఫ్రీనియా గా వైద్యులు  నిర్ధారించారని  ఆయన అన్నారు . ఇందులో మొదటి దశకగా  చెప్పబడే  పారనోయిడ్  స్చిజోఫ్రీనియా  గురించి దాని లక్షణాలు చెపుతారా ? వీళ్ళు చాలా సహజంగా ఉంటారు .వీళ్ళ ప్రవార్తన ఎప్పుడు భ్రమలో ఉంటారు, హలొ సినేషన్స్  ఉంటాయి . ఇలానే వాళ్ళు ఏ ఏ రంగాల వాళ్ళు ఉంటారు ? సామాన్యులు , నుంచి ప్రముఖులు , ముఖ్యంగా రాజకీయ నాయకులు  ఉంటారు,  నటీనటులు కూడా ఉండచ్చు, వీళ్లు అపర మేధావులు, పలుకుబడి కలిగి ఉంటారు, ఉపాధ్యాయులు కూడా ఈకోవకే చెందుతారు. అటు సామజిక అవగాహన ఇటు విషయం పరిజ్ఞ్యానంలోను  తమను మించినవారు లేరని తాము సమాజంలో అత్యత ప్రభావవంతంగా  పని చేస్తారని  ఇటీవలి  పరిణామాలు నిరూపిస్తున్నాయని అందుకు ఉదాహరణగా మదన పల్లి ఘటన ఈ కోవలోకి చెందిందని అన్నారు . డిసోర్గనైజ్డ్  స్చిజోఫ్రీనియా లో వాళ్ళ ప్రవర్తన మాటలు ఒకదానికొకటి సంబంధం ఉండదని , అసలు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదని అర్ధం చేసుకోడం కష్టమే అని అన్నారు. అయితే అన్ని తమకు తెలుసుఅని  భావోద్వేగాలను నియంత్రించుకోలేరని సందర్బోచితంగా  వ్యవహరించరని.. రోజువారీ కార్యక్రమాలలో  చాలా పోషక విలువలు ఉన్న ఆహరం తీసుకుంటారని భిన్నమైన ఆలోచనలతో  తీవ్ర ఇబ్బందులు పడుతుంటారని నాగ్ నాధ్  వివరించారు. కేటా టానిక్  స్చిజాఫ్నేరియా లో చెప్పిందే చెప్పడం వీళ్ళ లక్షణమని అన్నారు. అన్ని చోట్లకు వెళ్తుంటారు,  నేను అన్నిటికీ చాలా అతీతుడిని , అనుకుంటూ ఉంటారు.. నేను పూజిస్తే చాలు అందరు  నాశనం అయిపోతారు, నాకు అతీతమైన శక్తులు  ఉన్నాయని భ్రమలో ఉంటారు . వారి పై   వారికీ శ్రద్ధ ఉండదు . రోజు వారీ కార్యక్రమాలు  పూర్తి చేయరు . అవసరం లేని పనులమీద తిరుగుతూ ఉంటారు .

అన్డి ఫరెంటియేటెడ్ స్చిజోఫ్రీనియాలో మూడు రకాల లక్షణాలు  ఉంటాయి . భ్రమ , భ్రాంతిలో జీవిస్తూ ఉంటారు. అర్ధం పర్ధం లేని మాటలు మాట్లాడడం వీళ్ళ  క్వాలిఫికేషన్ , ఆలోచనలు అస్తవ్యస్తం , స్థిరమైన జీవితం ఉండదు, తమని అందరు మోసం చేస్తన్నారని , అందరు తప్పు చేస్తూ,  నన్ను మాత్రమే తప్పు చేస్తున్నావని నిందిస్తారని అనుకుంటారు . కొన్ని సందర్భాల్లో వీరికి  మొండి తనం ఎక్కువే అని ,నేను ఎవరు చెప్పినా వినను నాకు అన్నీ తెలుసు అనుకుంటూ తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అంటూ వితండ వాదానికి దిగుతారు , ఇంక పరాకాష్టగా ఆత్మాహత్యకు సైతం వెనకడుగువేయరు ,లేదా వాడిని చంపేస్తాను ,నరికేస్తాను అన్న ఉద్రేకంతో ఊగిపోతూ ఉంటారని నాగ్ నాధ్  విశ్లేషించారు . ఇకచివరిది 5 వది  రెసిడ్యుల్ వీరు గతం గురించి జరిగిన సంఘటనలను పదేపదే గుర్తు చేసుకోవడం అదే పనిగా ఒంటరిగా ఉండటానికి ప్రయత్నం చేస్తారని తనను ఇంట్లో అందరూ నిర్లక్ష్యం చేస్తున్నారన్న భావన కలిగినప్పుడు ఈ రకంగా ప్రవర్తిస్తారు అని అందులో భాగంగానే అన్నం తినకుండా ఉండడం, అలగడం, అరవడం చేస్తుంటారని నాగ్  నాధ్  అన్నారు. పైన పేర్కొన్న కొన్ని అంశాలను చూసినప్పుడు మదన పల్లి ఘటన అందరూ ఈ రకమైన మానసిక సమస్యతోనే బాధపడుతున్నారని తేల్చి చెప్పారు.  

By
en-us Political News

  
రక్తంలో క్లాట్స్ ఏర్పడకుండా ఉండేందుకు, రక్త ప్రసరణను మెరుగుపరచేందుకు, బరువు నియంత్రణకు తోడ్పడే వంటింటి సహజ చిట్కాలను ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు..
నేటికాలంలో ఉపవాసం కేవలం దేవుడు, సంప్రదాయం, మతానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు..  ఫిట్‌నెస్ ప్రపంచంలో కూడా ఉపవాసం  బాగా ప్రాచుర్యం పొందింది. 16:8 డైట్ వంటి పద్ధతుల నుండి రోజుకు ఒకసారి..
మెనోపాజ్ (Menopause) వచ్చిన తర్వాత మళ్లీ బ్లీడింగ్ రావడం సాధారణ విషయం కాదు. చాలా మంది మహిళలు దీనిని చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు...
టీ లో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో బ్లాక్ టీ మాత్రమే కాకుండా.. గ్రీన్ టీ తో పాటు కుంకుమ పువ్వు టీ, కార్శీరీ ఖవ్వా టీ, జాస్మిన్ టీ.. ఇలా చాలా రకాలు ఉన్నాయి...
శరీరం ఆరోగ్యంగా ఉండటానికి అన్ని విటమిన్లు , ఖనిజాలు సరైన మోతాదులో అవసరం. శరీరానికి అత్యంత ముఖ్యమైన విటమిన్లలో  విటమిన్ బి12 ఒకటి, ఇది ఎర్ర రక్త కణాల ఏర్పాటులో, సరైన నాడీ పనితీరులో..
థైరాయిడ్ సమస్యలు ప్రస్తుతం చాలా మందిలో కనిపిస్తున్న సాధారణ ఆరోగ్య సమస్యల్లో ఒకటి. అయితే, థైరాయిడ్ రావడానికి మన ఆహారపు అలవాట్లు కూడా ఒక కారణమా..
భారతీయుల భోజనంలో అన్నం చాలా ప్రధానమైనది. అన్నం తినడం వల్ల వచ్చే సాటిసిఫాక్షన్ వేరే ఏ విధంగా రాదని చాలామంది అంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో మూడు పూటలా అన్నం తినాలన్నా చక్కగా తినేస్తారు. కానీ ప్రస్తుతం డయాబెటిస్, అధిక బరువు వంటి సమస్యలతో అన్నం అంటే దూరం జరిగే వారు చాలామంది ఉన్నారు. ..
బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి? స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు, TIA హెచ్చరికలు, గోల్డెన్ పీరియడ్‌లో చికిత్స, నివారణ మార్గాలను ప్రముఖ న్యూరాలజిస్ట్ డా. అనిరుధ్ దేశ్‌ముఖ్ ఈ వీడియోలో వివరించారు...
పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటుంది. అలాగే కాల్షియం,  ప్రోటీన్ కూడా ఉంటుంది.  భారతీయులు భోజనం చివర పెరుగుతో తింటే తప్ప వారికి తృప్తి ఉండదు. వేసవి కాలంలో పెరుగును ఇష్టంగా తింటారు.
శరీరంలో వేడి, పాదాల్లో మంట, కళ్లలో మంట, నోటి పూత, గ్యాస్, అసిడిటీ ఎందుకు వస్తాయి? పిత్త దోషం లక్షణాలు, కారణాలు, ఆహారం, ఆయుర్వేద చిట్కాలను డా. చి. మధుసూదన్ శర్మ ఈ వీడియోలో వివరించారు.
పురుషుల ఆరోగ్యం విషయంలో చాలామంది నిర్లక్ష్యం చేసే సమస్యల్లో క్యాన్సర్ ఒకటి. ప్రారంభ దశలోనే గుర్తిస్తే చాలా రకాల క్యాన్సర్లను విజయవంతంగా చికిత్స చేయవచ్చు...
భారతదేశంలో టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక అలవాటుగా , రోజును మొదలుపెట్టడానికి మంచి ఎనర్జీ డ్రింక్ గా కూడా భావిస్తారు. ఉదయం లేవగానే టీ తాగడం, పనిలో బ్రేక్  సమయంలో టీ తాగడం..
మనం తినే ఆహారాన్ని ఎంత ఎక్కువగా ఉడికిస్తే అంత మంచిదని చాలామంది భావిస్తుంటారు. కానీ అధికంగా ఉడికించడం వల్ల కొన్ని పోషకాలు తగ్గిపోయే అవకాశం ఉంటుందని ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్,
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.