Publish Date:May 23, 2023
ఖమ్మం పాలిటిక్స్ రసకందాయంలో పడింది. బిఆర్ఎస్ నుంచి సస్పెండ్ కు గురైన పొంగులేటి , మంత్రి పువ్వాడ అజయ్ మధ్య మాటలయుద్దం తారాస్థాయికి చేరుకుంటుంది. పొంగులేటి ఓ బచ్చా అని పువ్వాడ వాఖ్యానించారు.
పొంగులేటి డబ్బులు చూసుకొని విర్రవీగుతున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక బీఆర్ఎస్ లో ఉంటూనే తన సొంత పార్టీ నేతలనే ఓడించాలని ఆయన కుట్ర చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు.
పొంగులేటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని బిఆర్ఎస్ సస్పెండ్ చేసింది. ఆయనతో పాటు జూపల్లిని కూడా సస్పెండ్ చేసింది బిఆర్ఎస్ . కెసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న పొంగులేటి నోటికి తాళం వేయాలని బిఆర్ఎస్ నాయకత్వం నిర్ణయించింది. పొంగులేటికి కౌంటర్ ఇచ్చేందుకు పువ్వాడ సిద్దమయ్యారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఓ సిద్ధాంతం, విలువ లేని నేత అన్న పువ్వాడ పొంగులేటి తనకు తాను అతిగా ఊహించుకుంటున్నారని విమర్శించారు. ఏపార్టీలోకి వెళ్ళాలనేది తేల్చుకోలేని దుస్థితిలో పొంగులేటి ఉన్నారన్నారు. ఇక పేదలను పీడించుకొని తిన్న దోపిడీదారులే ఆయన పంచన చేరారని, ఖమ్మం రాజకీయాల్లో పొంగులేటి ఒక బచ్చా అని పువ్వాడ ధ్వజమెత్తారు.
పువ్వాడ కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
ఖమ్మం జిల్లాలో కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి అజయ్ కుమార్పై మరోసారి తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.పువ్వాడపై బచ్చాగాడిని పెట్టినా గెలిపిస్తానని పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఖమ్మం జిల్లాలో తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ponguleti-versus-puvvada-25-155806.html
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్మెన్లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.