Publish Date:Apr 16, 2024
గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. జిల్లాలో ఒక్క స్థానం మినహా మిగిలిన అన్ని అసెంబ్లీ స్థానాలలోనూ కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. ఆ తరువాత ఇటీవల బీఆర్ఎస్ తరఫున జిల్లా నుంచి గెలిచిన ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
అయితే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బ్రహ్మాండంగా పెర్మార్మ్ చేసిన క్రెడిట్ అంతా పొంగులేటికే చెందుతుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆయన ఖమ్మం జిల్లా మొత్తం కాంగ్రెస్ స్వీప్ ఖాయమనీ, ఆ బాధ్యత తాను తీసుకుంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు మరో నెల రోజులలో జరగనున్న లోక్ సభ ఎన్నికలలో రాష్ట్రంలో వందకు వంద శాతం కాంగ్రెస్ గెలుచుకుంటుందన్న ధీమా ఇన్న సీటు ఏదైనా ఉందంటే అది ఖమ్మం లోక్ సభ నియోజకవర్గమే. ఆ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. జిల్లా నుంచి రేవంత్ కేబినెట్ లో ముగ్గురు మంత్రులు ఉన్నారు. దీంతో ఖమ్మం లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద బండి నడకే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. దీంతో ఖమ్మం స్థానం సీటు విషయంలో కాంగ్రెస్ లో విపరీతమైన పోటీ ఏర్పడింది.
ప్రస్తుతం ఖమ్మం ఎంపీ టికెట్ రేసు కాంగ్రెస్ లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. అయితే అధిష్ఠానం కూడా ఖమ్మం టికెట్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నది. పోటీలో ఉన్న సీనియర్ నేతలను ఒక్కరొక్కరినే ఫిల్టర్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ప్రధానంగా ఈ టికెట్ కోసం పోటీ పడుతున్న వారిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని , మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేర్లు మాత్రమే మిగిలాయి. రాష్ట్ర కాంగ్రెస్ లో ఇద్దరూ కీలక నేతలే. ఈ నేపథ్యంలోనే ఖమ్మం సీటు విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఇప్పటి వరకూ ఏ నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. అయితే విశ్వసనీయంగా అందుతున్నే సమాచారం మేరకు మల్లు నందిని, పొంగులేటి ప్రసాద్ రెడ్డిలలో హైకమాండ్ పొంగులేటి ప్రసాద్ రెడ్డి వైపే మొగ్గు చూపుతోంది.
కాంగ్రెస్ అంతర్గతంగా నిర్వహించిన సర్వేలలో పొంగులేటి ప్రసాద్ రెడ్డికే ఎక్కువ మద్దతు ఉందని తేలడం ఇందుకు ఒక కారణంగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇక అన్నిటి కంటే ప్రధాన కారణం ఏమిటంటే.. అసెంబ్లీ ఎన్నికలలో జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని ముందుగానే ప్రకటించి ఆ బాధ్యత తీసుకున్న పొంగులేటికి క్రెడిట్ ఇవ్వడం సమంజసమని కాంగ్రెస్ హైకమాండ్ భావించడమేనని చెబుతున్నారు. కాంగ్రెస్ వర్గాల సమాచారం ప్రకారం ఖమ్మం టికెట్ మంత్రి పొగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఖరారైపోయిందనీ, ఇహనో, ఇప్పుడో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ponguleti-prasadreddy-confirm-khammam-congress-loksabha-ticket-25-173930.html
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.