చిరును వదలని రాజకీయ బొమ్మాళి

Publish Date:Sep 21, 2022

Advertisement

అవును .. నిజం చిరును రాజకీయం వదలనంటోంది.  అవునండోయ్ .. నిజమే నండోయ్ తాను రాజకీయాలకు దూరమైనా.. రాజకీయాలు తన నుంచి ఇంకా దూరం కాలేదంటూ చిరంజీవి ఇటీవల చేసిన ఆడియో ట్వీట్,  గాడ్ ఫాదర్ సినిమా డైలాగే అయినా, నిజమేనండోయ్. చిరంజీవి రాజకీయాలకు దూరమైనా, రాజకీయాలు ఆయన్ని వదలడం లేదన్నది మాత్రం ‘రియల్’ గానూ నిజమేనండోయ్.  

ఆయన రాజకీయాలను వదిలేసి చాలాకాలమే అయింది. 2014 వరకు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగిన చిరంజీవి, ఆ తర్వాత ఇంకొంత కాలం, రాజ్యసభ సభ గడువు ముగిసే వరకు రాజకీయాల్లో ఉండీ ఉండన్బట్లు ఉన్నా, ఆ తర్వాత, రాజేకీయలకు పూర్తిగా గుడ్ బై చెప్పేశారు. సినిమాల్లో బిజీ అయి పోయారు. తమ్ముడు పవన్ కళ్యాణ్’ రాజకీయాల్లో కిందా మీద అవుతున్నా, మరో బ్రదర్ నాగబాబు, ఎన్నికల్లో పోటీ చేసినా, చిరంజేవై మాత్రం, అసలు ఆ దిక్కు కేసి .. ఒక్క  స్టెప్ కూడా వేయలేదు. కనీసం ఒక్కసారి పేస్ టర్నింగ్ ‘ ఇచ్చి ఒక్క లుక్కైనా వేయలేదు. 

అయినా .. .అయన పేరు తరచూ రాజకీయ చర్చల్లో ప్రస్తావనకు వస్తూనే ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రేవంత్ రెడ్డికి అప్పగించిన సమయంలోనే, రాహుల్ గాంధీ ఏపీ పార్టీ అధ్యక్ష పదవి చిరంజీవికి ఇచ్చే ఆలోచన చేశారు. చిరంజీవితో మాట్లాడే బాధ్యతను అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా ఉన్న ఉమెన్ చాంద్ కి అప్పగించారు.  ఆవసరమైతే    తానే స్వయంగా చిరంజీవితో మాట్లాడతానని అన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే, చిరంజీవి పూర్తిగా సినిమాలకే పరిమితం అవుతున్నారని అమరావతిలో-హైదరాబాద్’లో పార్టీ సమావేశాలు నిర్వహించినా దూరందూరంగానే ఉన్నారు. అప్పట్లోనే చిరంజేవి కాంగ్రెస్ పార్టీలో  ఉన్నట్లా, లేనట్లా అన్న చర్చ కూడా జరిగింది. ఆ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సినిమా టికెట్’ రేట్లను తగ్గించి సినిమా హీరోలు, నిర్మాతలను తన చుట్టూ తిప్పుకున్న సమయంలో, చిరంజీవికి స్పెషల్ స్టేటస్ ఇచ్చి ప్రత్యేకంగా ప్యాలెస్కు పిలిచి చర్చలు జరిపారు. ఓ చిరు సన్మానం కూడా చేశారు. అప్పుడు మళ్ళీ చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ, రాజ్యసభ టికెట్ అంటూ, ‘ఇదిగో తోక, అదిగో పులి’ వార్తలు షికారు చేశాయి. చివరాఖరుకు మెగా స్టార్, అబ్బే అలాంటిదేమీ లేదని సంజాయషీ లాంటింది ఇచ్చుకునేందుకు చాలా చాలా శ్రమ తీసుకోవలసి వచ్చింది. 

అలాగే, ఈ మధ్యనే అల్లూరి సీతరామరాజు 125వ జయంతి సందర్భంగా, భీమవరంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నఅల్లూరి విగ్రహవిష్కరణ సభలో చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిపిచారు. ప్రధాని మోడీ ఎదురెళ్ళి మరీ చిరంజీవిని వేదిక మీదకు ఆహ్వానించారు. హగ్గులు, అలింగానాల ద్వారా ప్రధాని మోడీ స్వయంగా  ఇద్దరి మధ్య, ‘సంథింగ్, సంథింగ్’ ఎదో ఉందనే సంకేతాలను పంపించారు. అదే వేదిక మీదున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చివరకు మంత్రి రోజా, కంటే కూడా చిరంజీవికి మోడీ కొంచెం చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో చిరంజీవిని బీజేపీ దువ్వుతోందనే ప్రచారం జరిగింది. ఈ నేపధ్యంలోనే మెగా బ్రదర్  నాగబాబు, ఆ వేదిక మీద ఒక్క చిరంజీవి మినహా మిగిలిన అందరూ అద్భుతంగా నటించారని, ఓ కాంట్రవర్షల్ కామెడీ కామెంట్ కూడా చేశారు. బట్ ఇక్కడ అది అప్రస్తుతం అనుకోండి.

సో .. చిరంజీవి, గాడ్ ఫాదర్ చితం ప్రమోషన్ కు రిలీజ్ చేసిన, డైలాగులో చెప్పినట్లుగా,  తాను రాజకీయాలకు దూరమైనా.. రాజకీయాలు ఆయన నుంచి దూరం కావడం లేదన్నది... నిజంగానే నిజం.అయిత ఇక్కడితో కథ కంచికి చేరలేదు. అసలు  అసలు ట్విస్ట్ ఇక్కడే ..ఉంది. ఇంచుమించుగా ఓ 25 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరుగతున్న ఎన్నికల్లో, చిరంజీవికి ఓటు హక్కు ఉంది. అవును, అవును కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో లేదో ఆయనకు తెలుసో లేదో కానీ, కోవూరు నుంచి పీసీసీ ప్రతినిధిగా చిరంజీవి పేరుతో ఉన్న ఐడీకార్డును కాంగ్రెస్ పార్టీ  విడుదల చేసింది. పోనీ అదేదో ఆకతాయలు పననుకుందామా అంటే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పరిశీలకుడిగా ఉన్న మధుసూదన్ మిస్త్రీ సంతకం కూడా  స్పష్టంగా కనిపిస్తోంది. త్వరలో జరగబోయే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా ఈ ఐడీ కార్డు కాంగ్రెస్ పార్టీ  జారీ చేసింది. దీంతో, చిరంజీవి రాజకీయాలకు దూరమైనా .. రాజకీయాలు ఆయన నుంచి దూరం కావడం లేదని మరో మారు పక్కగా, కన్ఫర్మ్ అయింది ... అంతే మరి మామూలు గజ్జీ, తామర అయితే ఏ  జాలింలోషన్’తోనో నయం అవుతాయి.. ఇది రాజకీయ గజ్జీ,అంటుకుంటే అంతే.. ఇక వదలనే వదలదు. గోకుతూనే ఉంటుంది.

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.