Publish Date:Jul 18, 2022
దొంగనో, ఖూనీకోరునో పట్టుకుంటే పోలీసులు వారికి అర్ధమయ్యే తిట్ల భాషలోనే మాట్లాడుతూ కొడుతూ సమాచారం సేకరించడం ఆనవాయితీ. కానీ బీహార్ బక్సార్ పోలీసులకు పెద్ద సమస్యే వచ్చిపడింది. వాళ్లు ఒక కేసుకి సంబంధించి జర్మన్ షెపార్డ్ కుక్కను పట్టుకున్నారు. కానీ వీళ్ల ఆదేశాలు దానికి అర్ధం గాక వెర్రిగా చూస్తూండిపోయింది. సంగతేమిటంటే దానికి ఇంగ్లీషులో ఆదేశాలు వినడం అలవాటయి మరే భాషలో చెప్పినా అర్ధంకాదు. దానికీ ఇంగ్లీషు వ్యామోహమే అని తలలు పట్టుకున్నారు బక్సార్ పోలీసులు.
ఇటీవల బీహార్ బక్సార్ ప్రాంత పోలీసులు ఎక్సైజ్, ప్రొహిబిషన్ చట్టం అతిక్రమించిన వ్యక్తుల్ని ఒక కారుతో సహా పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ నుంచి వస్తున్న ఒక కారును పాట్నాకు వంద కిలోమీటర్ల దూరంలో అనుమానించి పోలీసులు నిలిపారు. అందులో భారతదేశంలో తయారవు తున్న విదేశీ మద్యం ఆరు బాటిల్స్ దొరికాయి. కారులో సతీష్కుమార్, భువనేశ్వర్ యాదవ్ అనే ఇద్దరు అప్పటికే కూటుగా తాగి వెనకసీట్లో పడి వున్నారు. వారిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత కోర్టుకి తీసికెళితే జైలు శిక్ష విధించారు.
అయితే ఆ కారుతో పాటు జర్మన్ షెపర్డ్ ని పోలీసులు పట్టుకున్నారు. దాని ద్వారా తాగుబోతుల ఇద్దరి గురించి సమాచారం తెలుసుకోవడానికి విశ్వయత్నం చేశారు కానీ ఫలించలేదు. పైగా పోలీసులు ఏది చెప్పడానికి ప్రయత్నించినా అది మొహం తిప్పేసుకంటోందిట. చివరికి దానికి ఇంగ్లీషు ఆదేశాలే అర్ధ మవుతాయన్నది పాపం బీహార్ పోలీసులకు ఆలస్యంగా తెలిసింది. పైగా దానికి కార్ణ్ ఫ్లాక్స్, బిస్కెట్లు, పాల ఖర్చులు ఎక్కువయ్యాయని పోలీసులు గోడు పెడుతున్నారు.
ఇపుడు దానితో ఇంగ్లీషులో మాట్లాడే వారి కోసం వెతుకుతున్నారు. చిత్రంగా వుందిగదా? ఆ కుక్కని పెంచినవారు దానికి ఆంగ్లం అలవాటు చేయడం, అది పోయి పోయి పక్కా హిందీ, బీహారీ భాషల ప్రాం తంలో పట్టుబడటం దాని తప్పుకాదేమో! కానీ మీ కుక్కపిల్లలకు మాత్రం కనీసం తెలుగు ఆదేశాలు అర్ధమయేలా చేయండి. ఎక్కడన్నా తప్పిపోయినా చెవులో, తోకో ఆడిస్తుంది.. సింబాలిక్ గా!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/police-waiting-for-english-speakers-39-140023.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.