Publish Date:Nov 16, 2024
కడన ఎంపీ, వైఎస్ అవినాష్ రెడ్డి పీకల్లోతు చిక్కుల్లో ఇరుక్కున్నారా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టుల విషయంలో యమా సీరియస్ గా ఉన్న పోలీసులు ఆ అసభ్య పోస్టులు పెట్టిన వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఆ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో ఇండీసెంట్ పోస్టులతో చెలరేగిపోయిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. అరెస్టులు చేస్తున్నారు. తాజాగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డికి 41ఏ నోటీసులు జారీ చేశారు. గత నాలుగు రోజులుగా రాఘవరెడ్డి పరారీలో ఉండటంతో ఆయన నివాసానికి నోటీసులు అంటించారు.
అంతే కాకుండా రాఘవరెడ్డి పరారీలో ఉన్నాడని ప్రకటించి సెర్చ్ వారెంట్ జారీ చేశారు. ఇప్పుడో ఇహనో ఆయన నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించే అవకాశం ఉంది. ఇటీవల వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అతనిని విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వాటి ఆధారంగానే వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ కోసం పోలీసులు వేటాడుతున్నారు. అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఇచ్చిన కంటెంట్ నే తాను సోషల్ మీడియాలో పోస్ట్ చేశానని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన వర్రా రవీందర్ రెడ్డి విచారణలో తెలిపిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రాఘవరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వర్రా రాఘవరెడ్డిని అరెస్టు చేసి విచారిస్తే సోషల్ మీడియాలో ఇన్ డీసెంట్ల పోస్టుల వ్యవహారంలో మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని అంటున్నారు. వర్రా రవీందర్ రెడ్డి చంద్రబాబు, పవన్ కల్యాణ్ లోకేష్ లపైనే కాకుండా జగన్ సోదరి షర్మిల, తల్లి విజయమ్మపై కూడా అసభ్య పోస్టులు పెట్టిన సంగతి విదితమే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/police-issue-search-warrent-to-ys-avinashreddy-pa-raghavareddy-25-188468.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.