సొంత వైద్యం వంటబట్టదు అంటే ఇదేనా?

Publish Date:Apr 15, 2025

Advertisement

స్వరాష్ట్రంలో  పని చేయని పీకే వ్యూహాలు!

ప్రశాంత్ కిషోర్, పీకే.. పేరు చాలు. పరిచయం అవసరం లేదు.పీకే అంటే చాలు, ఆయన ఎవరో, ఆయన ఏమిటో అందరికీ అర్థమైపోతుంది.ఎన్నికల వ్యూహకర్తగా ఆయనకు అంత మంచి గుర్తింపు వుంది. అయితే అది ఆయన గతం. ప్రస్తుతం ఆయన, వేషం మార్చారు. రాజకీయ అరంగేట్రం చేశారు. సో.. ఇప్పడు పీకే పొలిటీషియన్, రాజకీయ నాయకుడు.  జన సురాజ్  పార్టీ (జేఎస్పీ) వ్యవస్థాపక అద్యక్షుడు. ఈ సంవత్సరం చివర్లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్య భూమికను పోషించేందుకు తహతహ లాడుతున్న రాజకీయ నాయకుడు. ఈ ఎనికల్లో ఎలాగైనా కింగ్, కాదంటే కనీసం కింగ్ మేకర్ కావాలని కలలుకంటున్నారు.  

అవును గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదలు, ఏపీ మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి  వరకు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మొదలు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వరకు ఎందరో నాయకులకు, ఎన్నో పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిషోర్  ఇప్పడు స్వయంగా ఎన్నికల బరిలో దిగుతున్నారు. వ్యూహాత్మకంగా పావులు  కదుపుతున్నారు.అయితే  అదేదో సామెత చెప్పినట్లు  అందరికీ వర్కౌట్ ఆయన  వ్యూహలు, సొంతానికి వచ్చేసరికి అతంగా పనిచేస్తున్నట్లు లేదని అంటున్నారు.   ఔను పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు.. సొంత వైద్యం వంటబట్టదు అని పెద్దలు ఊరికే అన్నారా? ఇప్పడు తాను స్వయంగా రాజకీయవేత్తగా మారిన పీకేకు ఆయన వ్యూహాలు ఆయన సోంత పార్టీకి ఏ మాత్రం ఉపయోగపడటం లేదు.. ఫలించడం లేదు.  

నిజానికి నాలుగేళ్ళ కిందట (2021)పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి పని చేసిన పీకే  ఇక పై  ఏ రాజకీయ పార్టీకి వ్యూహకర్తగా పని చేయనని ప్రకటించారు. అలాగే  క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేది లేదనీ అన్నారు. అంతే కాదు,  నేను రాజకీయాలకు పనికిరాను  అని తనకు తానే   సెల్ఫ్  సర్టిఫికేట్  ఇచ్చుకున్నారు. అయితే, ఆ తర్వాత కొద్ది కాలానికే  ఆ ఒట్టు తీసి గట్టున పెట్టారు. కాంగ్రెస్  పార్టీలో చేరేందుకు,  బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు  ప్రయత్నాలు సాగించారు. కాలికి బలపం కట్టుకుని దేశం అంతా తిరిగారు. శరద్ పవార్ మొదలు కేసీఆర్  వరకు ప్రముఖ నేతలు అందరినీ కలిశారు. అందరినీ కలిపారు. మరోవంక కాంగ్రెస్ పునర్జీవనానికి ఉడతా భక్తిగా   ఉచిత  సలహాలు కూడా ఇచ్చా రు. చివరకు  తాతకు దగ్గులు నేర్పినట్లు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( సిడబ్ల్యుసి) సభ్యులను కూర్చోపెట్టి పాఠాలు చెప్పారు. ఇలా దేశ రాజకీయాల్లో  తన కంటూ ఒక స్థానం సంపాదిం చుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. 

సరే ఆ ప్రయత్నాలు ఏవీ అంతగా పని చేయలేదు. మధ్యలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అప్పటి అధికార పార్టీలతో డీల్  కుదుర్చుకున్నారు. అయితే  అక్కడా కథ అడ్డం తిరిగింది. ఉభయ రాష్ట్రాల్లో ఆయన వ్యూహాలు ఉడక లేదు.ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ బండ్లు బోల్తా కొట్టాయి. అక్కడ ఏపీలో  జగన్ రెడ్డి, ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఇద్దరి కిద్దరు చిత్తుగా ఓడి పోయారు. జగన్ రెడ్డి పరిస్థితి అయితే మరీ ఘోరం, పదకొండు పరుగులకే ఔటై పోయారు. ఇక చివరి ప్రయత్నంగా స్వరాష్ట్రం బీహార్ లో సొంత జెండా ఎగరేశారు. జన సురాజ్  పార్టీని స్థాపించారు. సంవత్సరం పైగా రాష్ట్రంలో పాద యాత్ర చేస్తున్నారు. అయితే  అదేమిటో కానీ, శకునం చెప్పే బల్లి  కుడితిలో పడింది అన్నట్లుగా.. యూపీ, బెంగాల్, ఢిల్లీ, ఏపీ ఇలా ఎక్కడెక్కడో, ఎవరెవరినో గెలిపించిన  ప్రశాంత్ కిషోర్ వ్యూహం  స్వరాష్టంలో,  పని చేస్తున్నట్లు లేదని అంటున్నారు. 

ఇటీవల బీహార్ లో నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో జేఎస్పీ తొలిసారిగా ఎన్నికల బరిలో దిగింది.అయితే  నలుగు స్థానాలకు ఒంటరిగా పోటీ చేసిన జేఎస్పీకి  ఒక్క సీటు దక్కలేదు. కానీ  జేఎస్పీ ఖాతాలో పది శాతం ఓట్లు అయితే పడ్డాయి. అలా జేఎస్పీ చీల్చిన ఓట్లు ప్రతిపక్ష కూటమిని దెబ్బతీశాయి. మూడు సిట్టింగ్ స్థానాలతో పాటుగా మొత్తం నాలుగు స్థానాలలో ఆర్జేడీ సారధ్యంలోని మహా ఘటబంధన్ ఓడిపోయింది. రెండు నియోజక వర్గాల్లో అయితే  అధికార ఎన్డీఎ కూటమి అభ్యర్ధులకు వచ్చిన మెజారిటీ కంటే జేఎస్పీకి వచ్చిన ఓట్లు ఎక్కువని లెక్క తేలింది. దీంతో  పీకే అసలు రంగు బయట పడిందని బీహార్ ప్రజలు పీకే పార్టీని, బీజేపీ బీ  టీమ్ గా భావిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.

ఈ నేపధ్యంలో ఇండియా టుడే నిర్వహించిన తాజా సర్వేలో జేఎస్పీ ఓటు షేర్  ఏకంగా  పది నుంచి మూడు శాతానికి పడి పోయిది. దీంతో కింగ్ ఆర్ కింగ్ మేకర్ కావాలనే పీకే   కల కలగానే మిగిలి పోతుందని అంటున్నారు. అలాగే ఇటీవల పాట్నాలో జేఎస్పీనిర్వహించిన తొలి భారీ బహిరంగ సభకు లక్షల్లో జనం వస్తారని  భావించి ఏర్పాట్లు చేస్తే వేలల్లో కూడా జనం రాలేదు. అందుకే పీకే పట్టుమని పది నిముషాలు అయినా మాట్లాడకుండానే తట్టా బుట్టా సర్దేశారు. సో .. బీహార్ ఎన్నికల్లో పీకే పాత్ర ఏమిటన్నది ఇప్పడు ప్రశ్నార్ధకంగా మారిందని అంటున్నారు. అలాగే, ఉప ఎన్నికల్లో పోటీ చేయడం వ్యూహకర్త చేసిన వ్యూహాత్మక తప్పిదంగా భావిస్తున్నారు.

By
en-us Political News

  
2022 నవంబర్ లో అప్పటి వైసీపీ సర్కార్ రోడ్డు విస్తరణ పేరుతో మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం అనే కుగ్రామంలో ఇళ్ల ను కూల్చివేసింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ గ్రామాన్ని సందర్శిస్తానని అప్పట్లో మాట ఇచ్చారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఇంత కాలం వ్యతిరేకిస్తూ వచ్చిన లొంగిపోయిన మావోయిస్టు నేతలు ఇప్పుడు అదే వ్యవస్థ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకు తాజాగా మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల ఇక ఆయుధాలు చేపట్టబోమంటూ చేసిన ప్రకటనే సాక్ష్యంగా నిలుస్తోంది.
దానం విషయంలో మాత్రం ఆయన అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీలోకి దిగడంతో.. ఇవే కోర్టులో , అలాగే స్పీకర్ ఎదుట తిరుగులేని ఆధారాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో దానంపై అనర్హత వేటు పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మొత్తం మీద ఆ కేసులో కీలక మలుపునకు ఈ పెన్ డ్రైవ్ ఆధారం అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని దర్యాప్తు అధికారులు అంటున్నారు. ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి నివేదికను కోర్టుకు సమర్పించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో 9 మంది అధికారులతో కలిసి ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
పార్టీ పగ్గాలు చేపట్టడానికీ, ప్రధాని మంత్రి పదవిని అధిష్టించడానికి కాంగ్రెస్ లో సమర్థత ఉన్న నేత తన సతీమణి ప్రియాంక వధేరా గాంధీ మాత్రమేనంటూ రాబర్ట్ వధేరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఈ కార్యక్రమానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అలాగే వైఎస్ కుటుంబీకులంతా హాజరయ్యారు. అయితే ఈ వేడుకలకు వైఎస్ తనయ వైఎస్ షర్మిల మాత్రం హాజరు కాలేదు.
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.
రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి. సరే జనం విషయం గుర్తించి 2019లో తాము కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు.
ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.