జనసేనాని పవన్ రాజకీయ దారంతా చీకటేనా?..

Publish Date:Jul 5, 2022

Advertisement

ఇల్లేమొ దూరం..దారంతా చీకటి....రోడ్డంతా గతుకులు... 2019 ఎన్నికలకు ముందు జనసేనాని పవన్ కల్యాణ్ తరచుగా ఈ డైలాగ్ చెప్పేవారు. ఆ డైలాగ్ తన రాజకీయ ప్రస్థానం సుదీర్ఘంగా సాగాల్సి ఉందన్న అర్ధంతో చెప్పినది.  అప్పట్లో అది చాలా పాపులర్ అయ్యింది. రాజకీయాలలో ప్రశ్నించడానికి,  పిడికిలి బిగించి ప్రశ్నించేందుకు నేనున్నాను అంటూ ఒక బలమైన శక్తిగా రాజకీయ ప్రవేశం చేసిన పవన్ కల్యాణ్.. ఆ ప్రస్థానంలో గమ్యం లేని బాటసారిగా మారిపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

సినిమాల ద్వారా పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న ఆయన రాజకీయ నేతగా ప్రజాభిమానం పొందేందుకు ప్రశ్నించడం ఒక్కటే సరిపోదనీ, ఆ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలనీ, లేదా తానే స్వయంగా సమాధానం కావాలని తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. తన రాజకీయ లక్ష్యం ఏమిటి? పార్టీని ఏ దిశగా నడిపించదలచుకున్నారు అన్న విషయంలో పవన్ లో ఇప్పటికీ స్పష్టత కానరావడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

పాచి పోయిపోయిన లడ్లు అంటూ 2019 ఎన్నికల ముందు బీజేపీపై ఘాటు విమర్శలు సంధించిన పవన్ కల్యాణ్ ఎన్నికల ఫలితాల అనంతరం ఆ బీజేపీతోనే జట్టు కట్టడాన్ని ఆయన ఎలా సమర్ధించుకుంటారని ప్రశ్నిస్తున్నారు.ఏపీలో బీజేపీ మిత్రపక్షంగా పవన్ కు జరిగిన మేలు ఏమీ లేకున్నా సినిమాలలో హీరోగా ప్రశంసలందుకున్న ఆయన బీజేపీ మిత్రుడిగా మాత్రం కమేడియన్ స్థాయికి రాజకీయాలలో పరిమితమయ్యారని అంటున్నారు.

2014 ఎన్నికలలో తెలుగుదేశం, బీజేపీలకు మద్దతుగా నిలిచిన పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల సమయానికి ఒంటరి పోరుకే మద్దతు మొగ్గు చూపారు. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో ఆయన నిర్ణయం వైసీపీకి నెత్తిన పాలు పొసింది. ఆ పార్టీని అధికార పీఠంపై కూర్చోబెట్టింది. ఆ తరువాత మూడేళ్లూ పవన్ కల్యాణ్ బీజేపీతో మిత్రపక్షంగా ముందుకు సాగారు. 2024 ఎన్నికలలో ప్రభుత్వ ఓటును చీలనివ్వనని ప్రకటించి రాష్ట్రంలో ఎన్నికల పొత్తులకు తెరతీశారు. అయితే ఆ తరువాత కొద్ది రోజులకే.. ఇంత కాలం ఇతర పార్టీలను భుజాన మోశాను ఈ సారి ఆ పార్టీలు తనను భుజాన మోయాలంటూ తన రాజకీయ ఆకాంక్ష ఏమిటన్నది చాటారు.

అయితే అంతకు ముందు మూడేళ్ల పాటు బలమైన తన ఇమేజ్ ను, క్యాడర్ ను కేంద్రంలో అధికారంలో ఉన్నదన్న ఒకే ఒక కారణంతో కమలం పార్టీకి దాసోహం చేశారు. జాతీయ స్థాయి పార్టీ అయిన బీజేపీ ప్రాంతీయ పార్టీలతో మైత్రికి సుముఖత వ్యక్తం చేసేది పాము కప్పను మింగినట్ల ఆ జాతీయ పార్టీలను ఆక్రమించడానికే తప్ప వాటి అభివృద్ధికి దోహదపడేందుకు కాదన్న వాస్తవాన్ని గ్రహించడంలో పవన్ విఫలం అయ్యారు. 2109 ఎన్నికలలో కేవలం ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించిన ఆ పార్టీకి కమలం పార్టీ ఎందుకు ప్రాధాన్యత ఇస్తుందన్న విషయాన్ని గ్రహించలేకపోయారు. సరే ఎప్పుడైతే ఆయన బీజేపీ- జనసేన కూటమి సీఎం అభ్యర్థిగా తనను తాను ప్రకటించుకున్నారో అప్పుడే బీజేపీ ఆయనను దూరం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

దీంతో ఇప్పుడు గతంలో తాను చేసినది రాజకీయ తప్పిదమని బయటకు చెప్పలేక, లోపల దాచుకోలేక మింగలేక, కక్కలేక సతమతమౌతున్నారు. పవన్ రాజకీయ నిర్ణయాలు స్థిరంగా ఉండవని ఆయనపై తొలి నుంచీ ఒక ముద్ర ఉంది. ఇన్నేళ్ల తరువాత అంటే ఆయన జనసేన పార్టీని స్థాపించిన ఇంత కాలం తరువాత కూడా అది అలాగే కొనసాగుతోంది.

అందుకు తగ్గట్టే ఆయన ప్రసంగాలూ ఉంటున్నాయి. ముఖ్యమంత్రి కావడం తన లక్ష్యం కాదని చెబుతూనే జనం కోరుకుంటే అవుతాను అంటారాయన.  ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగి జనసేన అధికారం చేజిక్కించుకునేంత సీన్ లేదని గ్రహించడం వల్లనే తాజాగా పలు సందర్భాలలో ఓట్ల కోసం పుట్టిన పార్టీ జనసేన కాదు అని ఆయనే చెబుతుంటే ఎవరు మాత్రం ఆయన పార్టీకి ఓట్లు వేయాలనుకుంటారు. ప్రశ్నిస్తా, సమస్యల పరిష్కారానికి పాటు పడతా అంటే రాజకీయ పార్టీ కాకుండా ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఉండాల్సింది అని ఆయన పార్టీలో క్రియాశీలంగా తిరుగుతున్న కార్యకర్తలే ఇప్పుడు ఆయనను నిందిస్తున్నారు.

By
en-us Political News

  
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది.
ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించి గాయపరచడాన్ని ఖండిచిన ఆయన రక్త గాయమైనా రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా పోరాట పటిమ చూపారని కొనియాడిన రేవంత్ రె్డి.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులపై కేంద్రం ప్రత్యక్ష దాడికి పాల్పడిందని విమర్శించారు.
తోపులాటలో రాహుల్ గాంధీ గాయపడ్డారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ముక్కు నుంచి రక్తం కారింది. పోలీసులు ఆయనను బలవంతంగా నిలువరిస్తున్న సమయంలో ఆయన ముక్కుకు గాయమై రక్తం కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీనిపై సర్వ్రతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
మద్యం కుంభకోణంలో ఈడీ విచారణ.. ప్రధాన లబ్ధిదారుడికి చేరువ అవుతోందనీ, ఈ నేపథ్యంలోనే జగన్ పేరు ప్రచారంలోకి వచ్చిందని అంటున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ తనకు నోటీసులు పంపే అవకాశం ఉందన్న సమాచారంతోనే మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది.
ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేతగా, చంద్రబాబు ఇప్పుడు హస్తిన పర్యటనలో పార్లమెంటులో ఈ బిల్లుల ఆమోదానికి అవసరమైన మెజారిటీ కూడగట్టడం కోసం.. వివిధ పార్టీల నాయకులతో చర్చలు జరిపేందుకు ఆయన హస్తినకేగుతున్నారన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
మాస్కుల కొరతపై మాట్లాడిన కొద్ది రోజులకే విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం రహదారిపై డాక్టర్ సుధాకర్‌ను పోలీసులుఆయనను అదుపులోనికి తీసుకుని, చొక్కా లేకుండా ఉన్న ఆయన చేతులను వెనక్కి విరిచి కట్టడం, వీధిలో ఈడ్చుకెళ్లి ఆటోలో పడేయడం వంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి జాతీయ స్థాయిలో నిరసనలకు దారితీశాయి.
సదరు వివాదాస్పద ఏఈఈ స్థాయి అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్దుబాట్లు, పోస్టింగ్‌లలో ఆయనకు కీలక స్థానం దక్కింది. ప్రస్తుతం ఆయన టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఏఈఈ హోదాలోనే అత్యంత కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
చట్టపరమైన విచారణ ఎదుర్కొంటున్న నేతలకు రాజకీయ అభయం ఇస్తూ, వారిపై విచారణ అధికార తెలుగుదేశం కూటమి కక్షసాధింపుగా అభివర్ణించే ప్రయత్నం చేయడం జగన్ కు రివాజుగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రగతి ప్రకటనలో భాగంగా ప్రభుత్వం మొత్తం 10 ప్రధాన అంశాలపై ప్రత్యేక నివేదికలు సిద్ధం చేస్తున్నది. గతంలోని అంటే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రబుత్వం కొలువుదీరిన తొలి నాళ్లలో విడుదల చేసిన 7 శ్వేతపత్రాల యాక్షన్ టేకెన్ నివేదికలతో పాటు, అభివృద్ధి , సుపరిపాలన, సంక్షేమం, సాధికారత విభాగాలపై సమగ్ర నివేదికలు విడుదల చేయనుంది. అభివృద్ధి నివేదికలో వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక వసతులు, పర్యాటక రంగాల పురోగతిని పొందుపరచగా, సుపరిపాలన నివేదిక ద్వారా నూతన విధానాలు, డిజిటల్ విప్లవం, వాట్సాప్ గవర్నెన్స్ వంటి సేవల వివరాలను అందించనుంది.
అమర రాజా వంటి గ్లోబల్ టెక్నాలజీ సంస్థ వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఏపీలో కాకుండా పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో పెట్టడం ఆంధ్రప్రదేశ్ ఒక గోల్డెన్ ఆపర్చునిటీని చేజార్చుకోవడమేనని ప్రముఖ విశ్లేషకుడు సువేరా అన్నారు. తెలుగువన్ న్యూస్ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన రాజకీయం, కులం, ప్రాంతీయ విద్వేషాల కారణాలతో ఇటువంటి పారిశ్రామిక దిగ్గజం రాష్ట్రం వీడాల్సి రావడం వల్ల యువతకు రావలసిన ఉపాధి అవకాశాలు చేజారిపోయాయన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.