పవన్ కల్యాణ్ లో అస్పష్టత.. జనసేనలో గందరగోళం!

Publish Date:Jul 18, 2022

Advertisement

యుద్ధానికి వెళ్లాలా వ‌ద్దా అనే దానిలో రాజుకి రెండు ఆలోచ‌న‌లు వుండ‌కూడ‌దు. ప్ర‌జా ర‌క్ష‌ణ‌కు కంక‌ణం క‌ట్టుకున్నాన‌ని ప్ర‌గ‌ల్భాలు పలికితే సరిపోదు,   రంగంలోకి దిగాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు దిగాలి లేదా  రంగంలోకి దూకేయాలి.  గ‌ట్టుమీద కూచుని మ‌రిదీ ఎటెళితే బావుంట‌దంటావ్ అని సంబంధంలేని వాడిని అడిగితే ఎలా?  అదుగో అలా వుంది ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్య‌వ‌హారం. అధికార కాంక్ష బాగానే వున్న‌ప్ప‌టికీ, అంతే స్థాయిలో లోపల ఉన్న ఓటమి భయాన్ని బయట పడకుండా ఉత్తర కుమార ప్రగాల్బాలతో పబ్బం గడిపేసుకుందామంటే కుదరదు.   ఒక‌సారి ఒక‌ ర‌కంగా మ‌రోసారి మ‌రో ర‌కంగా ప్ర‌క‌ట‌న‌లు చేస్తే   వీరాభిమానులు కూడా మ‌రో నిర్ణ‌యం తీసునే ప్రమాదం ఉంది. రాజ‌కీయ‌ రంగంలోకి కాళ్లూ చేతులూ పెట్టేసిన త‌ర్వాత ఇంకా తెర మీదే వున్నాన‌కుంటే ఎలా జనసేనానీ..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనం కోసమే తన రాజకీయాలు అంటూ చెబుతున్న మాటలపై ఎవరికీ అపనమ్మకం లేదు. అయితే ఆ జనం కోసం ఆయన అధికారంలోకి వచ్చి పని చేయా లనుకుం టున్నారా.. లేక ప్రశ్నించే పార్టీగా అధికారానికి దూరంగా ఉండాలనుకుంటున్నారా అన్న విషయంలోనే ఆయన ప్రసంగాలు గందరగోళం సృష్టిస్తున్నాయి. అధికారం కాదు.. ప్రజలకు అండగా నిలవడమే ముఖ్యమంటూనే.. ఆయన కాబోయే ముఖ్యమంత్రిని తానేనంటూ ప్రకటనలు చేస్తున్నారు.

అదే సమయంలో అదే ప్రసంగంలో ఎన్నికలలో ఓడిపోయినా..ప్రజల పక్షానే నిలబడతానంటూ పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారు. అందుకే ఆయన   ఆయనపై ఆయన రాజకీయ ప్రస్థానంపై జనంలో పూర్తి విశ్వాసం కనిపించడం లేదు. 2014 ఎన్నికలలో ఎన్నికలకు దూరంగా ఉండి.. తెలుగుదేశం, బీజేపీలకు బయట నుంచి మద్దతు ఇచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్  ఆ తరువాత ఏపీలో తెలుగుదేశానికి అధికారాన్ని కట్టబెట్టినది తానేనంటూ క్లెయిమ్ చేసుకోవడం ప్రారంభించారు. సహజంగానే తెలుగుదేశం పార్టీ దానికి ఖండించింది.

దాంతో ఇరు పార్టీల మధ్యా దూరం పెరిగింది. ఆ తరువాత 2019 ఎన్నికలలో   తెలుగుదేశం,  బీజేపీలకు దూరం జరిగి సొంతంగా జనసేన ఎన్నికల బరిలోకి దిగింది. అయితే ఆ ఎన్నికలలో పార్టీ  ఘోర పరాజయాన్ని చవి చూసింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా పోటీ చేసిన రెండు స్థానాలలోనూ పరాజయం పాలయ్యారు. ఇందుకు ప్రధాన కారణం ఆయన ప్రసంగాలలో విజయం పట్ల విశ్వాసం కనిపించకపోవడమేనని అప్పట్లో పరిశీలకులు పలు విశ్లేషణలు చేశారు. ఇది జరిగి మూడేళ్లు అయ్యింది. అప్పటికీ, ఇప్పటికీ ఆయన ప్రసంగాలలో అదే అస్పష్టత, అదే సందిగ్ధం. అంతెందుకు.. ఆయన రాజకీయ అరంగేట్రం చేసినప్పటి కన్య్ఫూజన్ ఇప్పటికీ అలాగే ఉందని పరిశీలకులు అంటున్నారు.  

ఆయన ప్రసంగాల్లో ఆయనలోని విశ్వాస లేమి ప్రస్ఫుటంగా ప్రతిధ్వనిస్తుంటుంది. ఒక గందరగోళం విన్నవారికి కలుగుతుంది. అసలు ఆయనలోనే స్పష్టత లేదన్నది తేటతెల్లమౌతుంది.  అసలు ఆయన జనసేనకు ఓటేయమని కోరారా.. వద్దని చెప్పారా అన్న అసుమానం కలుగుతుంది. ఇటీవల ఆయన తాజాగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మండపేటలో జరిగిన రైతు భరోసా యాత్ర సభలోనూ  అదే చెప్పారు. అధికారం కోసం రాలేదని విస్పష్టంగా ప్రకటిస్తూనే.. తానే సీఎం, జనసేనదే అధికారం అన్నారు. ఈ పరస్పర విరుద్ధ ప్రకటనలే ఆయన రాజకీయ నిబద్ధతపై, సీరియస్ నెస్ పై జనంలో సందేహాలకు కారణమౌతున్నాయి.

అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదని అధినేత విస్పష్టంగా ప్రకటిస్తే జనం ఆయన పార్టీకి ఎందుకు ఓటేస్తారు. పైగా అభ్యర్థిని చూసి కాదు.. అధికారం అక్కర్లేదంటున్న తనను చూసి ఓటేయమని అడిగితే ఎందుకు వేస్తారు. కౌలు రైతులకు సహాయం చేయడం, పేద విద్యార్థులకు సహాయం చేయడం వంటి సామాజిక కార్యక్రమాలు సంపన్నులు చేసే ఛారటీలకు తేడా ఏముంది? అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.    అధికార కాంక్ష లేదంటూనే జనసేన అధికారంలోకి వస్తుందనిప్రకటిస్తారు. అధికారం కోసం రాలేదని చెప్పడం జనంలోకి ఎటువంటి ప్రతికూల సంకేతాలు పంపుతుందో..  అధికారం వస్తే ఇవి చేస్తాం అవి చేస్తాం అని అదే నోటితో ప్రకటనలు చేయడం జనసేనానికి, జనసేన పార్టీకి అంత కంటే ఎక్కువ నష్టం చేస్తుందని పరిశీలకుల భావన. అసలు ఒక రాజకీయ పార్టీ అధినేత.. గెలవకపోయినా, అధికారంలోకి రాకపోయినా ఫర్వాలేదని చెప్పాల్సిన అవసరం ఏమిటి? ఏ మూలో తనలో ఉన్న అభద్రతా భావాన్ని చాటుకోవడం తప్ప.

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అయితే, ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ హాజరుకాలేదు.  భాజపాతో పొత్తు ఉన్నప్పటికీ పవన్‌ కల్యాణ్‌.. ప్రధాని సభలో ఎందుకు పాల్గొనలేదనే దానిపై భిన్న వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో భీమవరం పర్యటనలో ఉన్న పవన్‌ కల్యాణ్‌  ప్రధాని పాల్గొనే సభకు తనకు ఆహ్వానం అందిందన్నారు. అయితే  స్థానిక ఎంపీకి ఆహ్వానం అందకపోవడం సరికాదన్న భావనతోనే ఆ కార్యక్రమానికి హాజరు కాలేదని చెప్పారు. ఈ మాటల ద్వారా బీజేపీతో దాదాపు తెగతెంపులు జరిగాయన్న సంకేతాలు ఇచ్చారు. ఇక ఓట్ల కోసం తాను కులాన్నే నమ్ముకుంటానన్న అర్ధం వచ్చేలా పవన్ మాట్లాడటం ద్వారా తనలోని రాజకీయ డొల్లతనాన్ని బయట పెట్టేసుకున్నారు. మరో సందర్భంలో అసందర్బంగా రాష్ట్రంలో పొత్తుపొడుపుల చర్చకు తెరతీశారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల నివ్వను అనడం ద్వారా తానే పొత్తులకు సిద్ధంగా ఉన్నానన్న సంకేతాన్ని ఇచ్చారు. ఆ వెంటనే పొత్తులకు జనసేన ఆప్షన్స్ అంటూ అసాధ్యాలను ఆప్షన్స్ గా పెట్టి ఆచరణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలికకే తాను పని చేస్తున్నానని చెప్పకనే చెప్పారు.  ఇన్ని పరస్పర విరుద్ధ వ్యాఖ్యలతో ఆయన జనసేన పార్టీని ఏ దిశగా తీసుకువెళుతున్నారు అన్న సందేహం పార్టీ శ్రేణుల్లోనే కలిగేలా చేస్తున్న పవన్ ఇక జనంలో కలిగిస్తున్న అయోమయానికి, ఆయనలో ఉన్న గందరగోళమే కారణమని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడిందన్న కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ తీరు పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజా రంజక పాలనను పూర్తిగా గాలికొదిలేసి కేవలం ప్రతిపక్షాలపై నిందలు వేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.
తెలంగాణ షాబాద్ లో ఆరుగురిని అత్యంత కిరాతకంగా చంపిన రాజ్ కుమార్ కు, సొంత బాబాయిపై గొడ్డలి వేటు, సొంత తల్లీ, చెల్లిని గెంటేసిన జగన్ కూ మనస్తత్వ పరంగా పోలీకలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పరిశ్రమల పేరుతో యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి, వేల ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను ఇలా కారుచౌకగా కేటాయించడంపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే, భూములు పొందిన తర్వాత గాలి జనార్ధన్ రెడ్డి అక్కడ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడంలో పూర్తిగా విఫలమయ్యారు. పరిశ్రమ పెట్టకపోగా, ఈ ప్రభుత్వ భూములను జాతీయ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి దాదాపు 350 కోట్ల రూపాయల మేర రుణాలు పొంది బ్యాంకులను సైతం మోసం చేశారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి.
ముందస్తు ఎన్నికల ప్రచారాలపైనా సీఎం స్పష్టత ఇచ్చారు. కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే ప్రశక్తే లేదని స్పష్టం చేశారు. ఎవరో ఏదో అనుకున్నారని తాము ముందస్తుకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు.
నిన్న మొన్నటి వరకూ వైసీపీకి, వివాదాస్పద యూట్యూబర్ ప్రశ్న రావణ్ కు అనుకూలంగా గళమెత్తిన జడ శ్రవణ్ కుమార్ అంత లోనే.. ఇలా యూటర్న్ తీసుకుని వైసీపీపై విరుచుకు పడటం విశేషం. తనకు వైసీపీ ఫండింగ్ చేస్తోందని వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చే క్రమంలో ఆయన వైసీపీ దోపిడీని ఎండగట్టారు. వైసీపీ తనకు ఫండింగ్ చేయడమేంటని ప్రశ్నించిన ఆయన ఆ పార్టీ నేతలు ఎంగిలి మెతుకులను కూడా వదలకుండా దోచేసుకుంటారని దుయ్యబట్టారు. జగన్ పాలనా కాలమంతా దోపిడీ రాజ్యమేలిందని విమర్శలు గుప్పించారు.
మొత్తం మీద రేవంత్ సభలో జగన్ ఫ్లెక్సీలు, బ్యానర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా తెలంగాణలో కేటీఆర్ సభలోనూ జగన్ ఫ్లెక్సీలు వెలిసన సంగతి తెలిసిందే. సొంత రాష్ట్రంలో కార్యక్రమాలు చేపట్టడంలో స్తబ్దుగా ఉంటున్న వైసీపీ శ్రేణులు తెలంగాణలో మాత్రం ఇతర పార్టీల సభలలో తమ అధినేత ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రదర్శించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది.
మాజంలో వివాదాలకు కారణమైన ఒక వ్యక్తికి వైసిపి బహిరంగంగా మద్దతు ప్రకటించడం, మరీ ముఖ్యంగా మత విద్వేషాలు ప్రజ్వరిల్లేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి.. తనను తాను రావణుడినని చెప్పుకున్న వ్యక్తిని వత్తాసుగా వైసీపీ నిలవడం కోరి ప్రజా వ్యతిరేకతను కొని తెచ్చుకోవడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఈటల కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ గళం ఎత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఆరోపణలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో ఈటల రాజేందర్ బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మాట్లాడారు. దీంతో ఈటల మళ్లీ కారెక్కేస్తారా అన్న ప్రచారం అప్పట్లో జోరందుకుంది. ఆ తరువాత సద్దుమణిగింది.
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అత్యంత సంక్లిష్టమైన మరియు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి.
ఉపా కింద నమోదైన ఈ కేసులో నిందితుడి తరఫున న్యాయపోరాటం చేసేందుకు వైసీపీ పార్టీ లీగల్ సెల్ విభాగానికి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రంగంలోకి దిగారు.
ఈ సర్జరీల తరువాత పవన్ కల్యాణ్ కనీసం నెల రోజుల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇటీవల అనంతపురం జిల్లాలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య చోటుచేసుకున్న వ్యక్తిగత విమర్శలు, ఆరోపణల పరంపరపై మధుసూదన్ రెడ్డి, ప్రజాప్రతినిధుల మధ్య కేవలం రాజకీయ పోరాటం ఉంటే ఫర్వాలేదని, కానీ ఇరువర్గాలు కులాల ప్రస్తావన తెస్తూ కుంపట్లు రాజేయడం తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.
రావణ్ అరెస్టుపై వైసీపీ, ఇతరులు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే నేరస్థులకు వైసీపీ ఇలా బాహాటంగా మద్దతు ఇవ్వడం దారుణమన్నారు. ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో, సమాజానికి ఎంతటి ముప్పుగా పరిణమించాడో ప్రజలంతా గమనించాలని కోరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.