ఆపరేషన్ ఆగదు.. యుద్ధం తప్పదు! .. కాల్పుల విరమణ కాదు.. విరామమే!

Publish Date:May 11, 2025

Advertisement

అనుకున్నదే  జరిగింది. అసలైన యుద్ధం మొదలయ్యేందుకు ముందే పాకిస్థాన్ చేతులు ఎత్తేస్తుందని, నిపుణులు చేసిన విశ్లేషణలు నిజమయ్యాయి. యుద్ధం వస్తే  పాకిస్థాన్ మూడు నాలుగు రోజులకంటే కంటే నిలబడలేదని చెప్పిన మాటలు నిజమయ్యాయి. పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత సైన్యం, భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్  ప్రకటించిన మూడు నాలుగు రోజుల్లోనే పాకిస్థాన్  చేయగల్గినంతా చేసి  శనివారం (మే10)  కాళ్ళ బేరానికి వచ్చింది. కాల్పుల విరమణ ప్రతిపాదనతో భారత్  తలుపు తట్టింది. ఆ దేశ డీజీఎంవో,మన డీజీఎంవోకు ఫోన్‌ చేశారు. మన డీజీఎంవో షరతులతో అంగీకారం తెలిపారు. 

ఇదే విషయాన్ని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సైతం మీడియా సమావేశంలో తెలిపారు. మధ్యాహ్నం 3.35 గంటలకు పాకిస్థాన్ మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ మన డీజీఎంఓకు ఫోన్ చేశారని, ఆ తర్వాత కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిందని చెప్పారు. భూమి, గగనతలం, సముద్ర మార్గంలో మిలటరీ చర్చలను నిలిపివేసేందుకు అంగీకారం కుదరిందన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చినట్టు చెప్పారు. 
అయితే.. అంతలోనే కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఒప్పందం కుదిరి నాలుగు గంటలు అయినా కాక ముందే  పాక్ మళ్ళీ కుక్క తోక వంకరని అన్నట్లు,ఉల్లంఘనలకు తెర తీసింది. దేశ సరిహద్దుల వెంబడి డ్రోన్  దాడులకు పాల్పడింది.  షరా మాములుగా మన సేనలు, పాక్  డ్రోన్లను తుక్కును కొట్టి నట్లు కొట్టి పడేశాయి అనుకోండి అది వేరే విషయం. 

కానీ, ఇక్కడ కూడా మరో మారు విశ్లేషకుల మాట నిజం అయింది. కాల్పుల విరమణ వార్త వచ్చిన తర్వాత ఏటీవీ చానల్ తెరిచినా  పాక్  కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉంటుందా.. మళ్ళీ మాములుగా ఉల్లంఘనలకు పాల్పడుతుందా  అన్న అనుమానాలే వినిపించాయి. ఆ దేశ దుర్మార్గ చరిత్ర తెలిసిన ప్రతి ఒక్కరు, పాక్  ఉల్లంఘనలకు పాల్పడుతుందని అనుమానం లేకుండా స్పష్టంగా చెప్పారు. అయితే.. కొందరు మాత్రం  అనుమనాలు వ్యక్తం చేశారు. అయితే,ఎక్కువ నిరీక్షణ అవసరం లేకుండానే  పాక్  అనుమానాలను నిజం చేసింది. టీవీలలో చర్చ జరుగతున్న సమయంలోనే ఉల్లంఘన  వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొద్ది సేపటికే, మన విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం సేథీ అవును  పాక్ ఉల్లంఘనలకు పాల్పడిందని, మీడియా సమావేశంలో చెప్పారు. 
నిజానికి అందుకు పెద్దగా ఆశ్చర్య పోవలసిన అవసరం లేదు. పాక్ ,ఒప్పందానికి కట్టుబడితే ఆశ్చర్య పోవాలే కానీ, ఉల్లంగిస్తే అందులో ఆశ్చర్యం లేదు. అదే  అనేక మార్లు రుజు వైన పాక్  నైజం.

అయితే, పాక్  విషయాన్ని పక్కన పెట్టి మన విషయానికి వస్తే..  చాంతాడంత రాగం తీసి ఏదో పాట పాడి నట్లుగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం  పూర్తి స్థాయి యుద్ధం మొదలవ్వక  ముందే ఓటమి అంచులకు చేరిన పాక్ తో  సంధి కి ఎందుకు అంగీకరించింది? పాకిస్థాన్   కాళ్ళ బేరానికి వచ్చిందంటే  కాల్పుల విరమణ కోసం ఎవరెవరి కాళ్ళో పట్టుకుంది అంటే, అర్థం చేసుకోవచ్చును. కానీ, భారత దేశం, కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించింది? ఇది ఇప్పడు అందరి ముందున్న ప్రశ్న.

 అలాగే  కాల్పుల విరమణ ఒప్పందం  పౌరోహిత్యం తమదే అంటూ జబ్బలు చర్చుకుంటున్న అమెరికా  గోలేంటి? నిన్నటి వరకు భారత్, పాక్ దేశాల మధ్య యుద్దమే వచ్చినా వేలు పెట్టేది లేదని అంటూ వచ్చిన పెద్దన్న ట్రంప్  ఇప్పుడు, ఇలా  నాలుక మడతేసి అంతా  తామే చేశామని చెప్పుకోవడం వెనక ఉన్న మతలబు ఏమిటి? ఇందులో పాక్  కు ఆర్థిక సహాయం అందించేందుకు అంగీకరించిన,  ఐఎంఎఫ్   పాత్ర ఏమిటి? అంటే.. ప్రస్తుతానికి ఎవరి వద్ద సరైన అమాధానం లేదు.  అయితే..  ట్రంప్ .. క్రెడిట్  తమ ఖాతాలో కలుపుకున్నా, మన దేశం మాత్రం ఇప్పటికే చాలా స్పష్టంగా, కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో మూడో దేశం(అమెరికా) పాత్ర లేదని కుండబద్దలు కొట్టింది. 

అలాగే.. కాల్పుల విరమణకు భారత్-పాక్ అంగీకరించిన నేపథ్యంలో పాక్‌పై భారత్ ఇటీవల తీసుకున్న పలు కఠిన నిర్ణయాల పరిస్థితి ఏమిటి? వాటికి కూడా విరమణ షరతు వర్తిస్తుందా?అనే ప్రశ్నకు, అధికారిక వర్గాలు వివరణ ఇచ్చాయి. కాల్పుల విరమణ ఒక్కటే షరతులకు లోబడి కుదుర్చుకున్న అంగీకారమని, సింధు జాలల ఒప్పందాన్ని రద్దు చేస్తూ భారత్ ఇటీవల తీసుకున్న నిర్ణయం సహా దౌత్యపరమైన చర్యలు యథాప్రకారం కొనసాగుతాయని ఆ వర్గాలు తెలిపాయి. కాల్పుల విరమణకు తొలుత భారత్‌కు అభ్యర్థన చేసినది కూడా దాయాది దేశమేనని ఆ వర్గాలు వివరించాయి.

 మిలటరీ యాక్షన్ సీజ్ చేసినప్పటికీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని విదేశాంగ శాఖ మంత్రి  జైశంకర్ మీడియాకు ఇచ్చిన బ్రీఫింగ్‌లో స్పష్టం చేశారు. కాల్పులు, మిలటరీ యాక్షన్‌పైనే ఇరుదేశాలు అవగాహనకు వచ్చాయన్నారు. ఉగ్రవాదం ఏరూపంలో ఉన్నా తిప్పికొట్టాలన్న భారత విధాన నిర్ణయం కొనసాగుతుందని చెప్పారు. సో.. కాల్పుల విరమణ ఒప్పందం అమలు అయినా కాకున్నా, ఉగ్రవాదాన్ని ఈ భూమి మీద ఎక్కడా లేకుండా చేయడమే లక్ష్యంగా మన దేశం ప్రారంభించిన ఆపరేషన్ సిదూర్  ఆగదు. యుద్ధం తప్పదు. ప్రస్తుత కాల్పుల విరమణ .. విరమణ కాదు, విరామం మాత్రమే.

By
en-us Political News

  
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
ప్రజాస్వామ్య విలువలతో కూడిన పాలనకు, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలాంటి అరమరికలూ లేకుండా మిత్రధర్మాన్ని తప్పకుండా నడపిన వాజ్ పేయి స్ఫూర్తిగా ముందుకు సాగాలన్న సంకేతాన్ని ఈ విగ్రహావిష్కరణ ద్వారా చంద్రబాబు ఇచ్చారని అంటున్నారు.
బెంగ‌ళూరు టు ఢిల్లీ అన్నట్లుగా ప్ర‌త్యేక ఎపిసోడ్లు న‌డిచాయి. రాహుల్ గాంధీ డీకేకి స్పెష‌ల్ మెసేజీలు పెట్టారు. క‌ట్ చేస్తే ఏదో అనుకుంటే ఏమీ కాలేదు అన్నట్లుగా క‌ర్ణాట‌క‌లో సీఎం మార్పు జరగలేదు. కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది.
2022 నవంబర్ లో అప్పటి వైసీపీ సర్కార్ రోడ్డు విస్తరణ పేరుతో మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం అనే కుగ్రామంలో ఇళ్ల ను కూల్చివేసింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ గ్రామాన్ని సందర్శిస్తానని అప్పట్లో మాట ఇచ్చారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఇంత కాలం వ్యతిరేకిస్తూ వచ్చిన లొంగిపోయిన మావోయిస్టు నేతలు ఇప్పుడు అదే వ్యవస్థ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకు తాజాగా మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల ఇక ఆయుధాలు చేపట్టబోమంటూ చేసిన ప్రకటనే సాక్ష్యంగా నిలుస్తోంది.
దానం విషయంలో మాత్రం ఆయన అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీలోకి దిగడంతో.. ఇవే కోర్టులో , అలాగే స్పీకర్ ఎదుట తిరుగులేని ఆధారాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో దానంపై అనర్హత వేటు పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మొత్తం మీద ఆ కేసులో కీలక మలుపునకు ఈ పెన్ డ్రైవ్ ఆధారం అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని దర్యాప్తు అధికారులు అంటున్నారు. ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి నివేదికను కోర్టుకు సమర్పించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో 9 మంది అధికారులతో కలిసి ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
పార్టీ పగ్గాలు చేపట్టడానికీ, ప్రధాని మంత్రి పదవిని అధిష్టించడానికి కాంగ్రెస్ లో సమర్థత ఉన్న నేత తన సతీమణి ప్రియాంక వధేరా గాంధీ మాత్రమేనంటూ రాబర్ట్ వధేరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఈ కార్యక్రమానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అలాగే వైఎస్ కుటుంబీకులంతా హాజరయ్యారు. అయితే ఈ వేడుకలకు వైఎస్ తనయ వైఎస్ షర్మిల మాత్రం హాజరు కాలేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.