జమిలీ.. ఎన్నికల సంస్కరణల దిశగా తొలి మజిలీ?

Publish Date:Dec 22, 2024

Advertisement

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా  జమిలి ఎన్నికలపై చర్చ జరుుగుతోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటూ కేంద్రం జమిలి ఎన్నికల బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టి జేపీసీకి పంపింది.  ఈ జమిలీ ఎన్నికల బిల్లును  బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదింప జేసుకోగలదా అన్న సంశయం బీజేపీ నేతలతో సహా సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఈ బిల్లును ఆమోదింప చేసుకోవాలంటే సభలో మూడింట రెండోంతుల మంది మద్దతు అవసరం. అయితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ కు సభలో ఆ బలం లేదు. అయితే ప్రధాని మోడీ ఏ ధైర్యంతో ముందుకు వెడుతున్నారన్న సందేహం బీజేపీయేతర పార్టీలలో బలంగా వ్యక్తం అవుతోంది.  పార్లమెంటు ఉభయ సభల్లో జమిలి ఎన్నికలకు మద్దతు ఎలా సాధించగలదన్న  అనుమానం పార్టీ కేడర్ లో,ఇతర పార్టీల్లో,ప్రజలలో వ్యక్తం అవుతోంది.  మోదీ ధైర్యం ఏమిటనేది అర్ధం కావడం లేదు. 

అది అలా ఉంచితే.. జమిలీతో పాటు పలు ఎన్నికల సంస్కరణలను మేధావులు సూచిస్తున్నారు. ప్రస్తుతం బిల్లు సభలో ప్రవేశపెట్టడానికి కావలసిన సాధారణ మేజార్టీ వచ్చింది. డిసెంబరు 12 రెండు బిల్లులను కేంద్రమంత్రివర్గం ఆమోదించింది. డిసెంబర్ 17నన్యాయశాఖ మంత్రి పార్లమెంటులో ప్రవేశ పెట్టారు. బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి సమర్పించారు. ఆ జేపీసీని  21మంది లోక్ సభ సభ్యులు, 10మంది రాజ్యసభ సభ్యులతో నియమించారు.  ఈ జేపీసీ తన నివేదికను సమర్పించడానికి 90 రోజుల గడువు విధించారు.  అవసరమైతే పొడిగిస్తారు. ఈ జేపీసీ ప్రధాన బాధ్యత  ప్రజాభిప్రాయ సేకరణ. అందరి అభిప్రాయాలను సేకరించి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. అయితే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఎలాంటి నిర్ణయాధికారం లేదు.  కేవలం అభిప్రాయాలను తెలపడానికే ఇది పరిమితం. అన్నిటికీ మించి జమిలి  బిల్లు చట్టం కావాలంటే ఐదు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంది.  రాజ్యాంగ సవరణ చేయాలంటే  పార్లమెంటు లో 2|3మేజార్టీ అనివార్యం. లోక్ సభలో 362, రాజ్యసభ లో 164 మంది జమిలికి అనుకూలంగా ఓటు వేయాలి. అయితే ఎన్డీఏకు లోక్ సభలో 293, రాజ్యసభ లో 125 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. ఏదో విధంగా ఆ మద్దతు కూడగట్టినా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కర్ జమిలి ఎన్నికల నిర్వహణకు సాంకేతికంగా  2034 వరకూ ఆగాల్సిందే.  కాగా భారత్లో స్వాతంత్ర్యం అనంతరం తొలి నాలుగు సార్వత్రిక ఎన్నికలు జమిలి ఎన్నికలో. అంటే జమిలి ఎన్నికలు దేశానికి కొత్తకాదు.    1960 దశకం తరువాత మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా తరచూ ఎన్నికలు వస్తున్నాయి. ఇదొక రాజకీయ అనివార్యంగా మారిపోయింది.

దీంతో .దేశంలో ఎక్కడో అక్కడ ఎన్నికలు జరుగుతూనే ఉన్న పరిస్థితి ఎర్పడింది.  అయితే ఇప్పుడు మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ తానేదో కొత్తగా కనిపెట్టినట్లుగా జమిలి ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చింది. కానీ బీజేపీ జమిలి నినాదంపై దేశ వ్యాప్తంగా పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. జమిలి పద్ధతిలో ఎన్నికల నిర్వహణలో పారదర్శకతపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.  ఒకేసారి లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగితే భారీగా వ్యయం తగ్గుతుంది. అలాగే ఎన్నికల కోడ్ కారణంగా అభివృద్ధి పథకాల అమలుకు అవరోధాలు చాలా వరకూ తగ్గిపోయాయి.  అలాగే జమిలి వల్ల ఖర్చు తగ్గి జీడీపీ 1.5 శాతం పెరుగుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దీని వల్ల దేశంఆర్ధికంగా దేశం బలపడుతుందని నమ్మబలుకుతోంది.  

ఇక జమిలి వల్ల రాష్ట్రాలలో,కాని కేంద్రంలో గాని మేజార్టీ లేక ప్రభుత్వాలు పడిపోతే మళ్లీ ఎన్నికలు జరుగుతాయి, అయితే అలా మధ్యంతరంగా జరిగిన ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వ పదవీ కాలం తరిగిపోతుంది.  జమిలి పద్ధతిలో దేశ వ్యాప్తంగా జరిగే ఎన్నికలతో పాటు మళ్లీ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది.  ఇక జమిలీ జరిగిన 100 రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారు.ఎవరైనా మరణిస్తే ఉప ఎన్నికలు ఎలా జరిపిస్తారనేదానిపై ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. జమిలీ ప్రతిపాదన ఎన్నికల సంస్కరణలకు తొలి మజిలీగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జమిలి పద్ధతి అమలులోకి వస్తే ఒక అభ్యర్థి ఒక స్థానం నుంచి మాత్రమే పోటీ చేయాలన్న నిబధనను అనివార్యంగా విధించాల్సి ఉంటుంది.  అలా కాకుండా ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ స్థానాల నుంచి పోటీ చేసి విజయం సాధిస్తు.. ఆ అభ్యర్థి రాజీనామాతో ఖాళీ అయ్యే స్థానానికి జరిగే ఉప ఎన్నిక వ్యయాన్ని ఆ అభ్యర్థే భరించేలా నిబంధన తీసుకురావాల్సి ఉంటుందని అంటున్నారు.  

అదే సమయంలో నేరచరితులను ఎన్నికలకు దూరంగా ఉంచే విధంగా కూడా స్పష్టమైన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.  కోర్టుల్లోకేసులు తీర్పులు వచ్చేవరకూ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదన్న విషయంపై కూడా నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.   జమిలీ ఎన్నికల అధ్యయనం చేసిన మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ జమిలితో పాటు ఎన్నికల సంస్కరణలు కూడా తీసుకురావాలని చేసిన సిఫారసును కేంద్రం పరిగణనలోనికి తీసుకోవాలి.   అన్నిటికంటే అతి ముఖ్యమైనది కేంద్ర ఎన్నికల సంఘం స్వేచ్ఛగా, స్వతంత్రంగా పని చేసే పరిస్థితి ఉండాలి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘంపై కేంద్రం నియంత్రణ పెచ్చరిల్లిందన్న విమర్శలు ఉన్నాయి. వాటిని పూర్వపక్షం చేస్తూ ఎన్నికల సంఘానికి పూర్తి స్వయంప్రతిపత్తి ఉండేలా చర్యలు తీసుకుంటే మాత్రమే జమిలి ఎన్నికలకు సార్థకత ఉంటుంది. 

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.