రుషికొండ ప్యాలెస్ వినియోగంపై సూచనలు, ప్రతిపాదనలకు ఆహ్వానం.!

Publish Date:Jul 9, 2026

Advertisement

వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చింది.. వైసీపీ ప్రభుత్వం విశాఖపట్నంలోని రుషికొండకు బోడి గుండు కొట్టించి మరీ నిర్మించని రుషికొండ ప్యాలెస్ వినియోగం విషయంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  వైసీపీ సర్కార్ సకల పర్యావరణ నిబంధనలనూ తుంగలోకి తొక్కి మరీ నిర్మించిన ఈ ప్యాలెస్ ను రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా వినియోగంలోకి తీసుకురావాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

గత కొంతకాలంగా ఎన్నో వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచిన ఈ రుషికొండ ప్యాలెస్ విషయంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం  కీలకమైన ప్రకటన చేసింది. ఈ  విలాసవంతమైన భవనాలను ఇప్పటివరకు అధికారికంగా ఎవరికీ కేటాయించలేదని స్పష్టం చేసింది.   రుషికొండ ప్యాలెస్,  అక్కడ ఉన్న ఖాళీ స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా మూడో పక్షానికి లీజుకు ఇవ్వకుండా చూడాలని కోరుతూ జనసేన కార్పొరేటర్ పీవీఎన్ఎన్ మూర్తి యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై న్యాయస్థానంలో  విచారణ సందర్భంగా  ప్రభుత్వ లీజు వ్యవహారంపై హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాది, ఈ భవనాల వినియోగానికి సంబంధించి ఆసక్తి ఉన్న వివిధ ప్రైవేట్ సంస్థల నుండి ఏపీటీడీసీ ప్రతిపాదనలను ఆహ్వానించిందని చెప్పారు.  అయితే ఆ ప్రతిపాదనలన్నింటినీ మొదట మంత్రివర్గ ఉపసంఘం క్షుణ్ణంగా సమీక్షించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. ఆ సబ్‌కమిటీ పరిశీలన పూర్తయిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని, అంతవరకు ఎలాంటి కేటాయింపులు జరగవని ప్రభుత్వం కోర్టుకు స్పష్టంగా తెలియజేసింది. 

 వైసీపీ  ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ  భవనాల విషయంలో పర్యావరణ నియమాలను, తీరప్రాంత నియంత్రణ మండలి సీఆర్‌జడ్  నిబంధనల   ఉల్లంఘన జరిగిందన్న  ఆరోపణలు మొదటి నుంచి ఉన్నాయి. ఈ అక్రమ నిర్మాణాలను సవాలు చేస్తూ..  2021లోనే తెలుగుదేశం   ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు సహా పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ కొండను తవ్వేసి నిర్మించారంటూ పెద్ద ఎత్తున ప్రజా ఆందోళనలు కూడా జరిగాయి. ఈ వివాదాల నేపథ్యంలో, కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఈ ఆస్తులు వృథా కాకుండా, పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించే ఉద్దేశంతో ఏపీటీడీసీ ఈ ఏడాది జూన్ 24న   ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం  మోడల్, ఎకో టూరిజం ప్రాజెక్టులు ,  అంతర్జాతీయ స్థాయి హాస్పిటాలిటీ వెంచర్ల వంటి సృజనాత్మక అంశాలపై నిపుణులు, సంస్థల నుంచి తగిన సూచనలు, ప్రతిపాదనలను ఆహ్వానించింది. 

Rushikonda Buildings, AP Tourism, Visakhapatnam, APTDC Proposals, AP High Court

By
en-us Political News

  
హైదరాబాద్ నగరంలోని ఫుట్‌బాల్ అభిమానులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.
ఇటీవల సీనియర్ కాపు నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా కిర్లంపూడిలో చోటుచేసుకున్న పరిణామాలు కేవలం ఒక కుటుంబంలో జరిగిన విషాదం
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, . యెమన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు, ఇరాన్, సౌదీ అరేబియా మధ్య మొదలైన కొత్త ఘర్షణ పాకిస్థాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ఇప్పటికే ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్.. తన స్వార్థపూరిత వ్యూహాల వల్ల ఇప్పుడు సమస్యల సుడిగుండంలో చిక్కుకుని బయటకు రాలేక నిండా మునిగిపోతోంది.
కర్ణాటకలో సభ్యసమాజం తలదించుకునే అత్యంత ఘోరమైన సంఘటన ఒకటి వెలుగుచూసింది.
ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా తమిళనాడు ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది.
వైఎస్సా ర్సీపీ నేత నాగార్జున యాదవ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
తెలంగాణ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన రంగారెడ్డి జిల్లా షాబాద్ వరుస హత్యల కేసులో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది
భారీ రుణమేళా ద్వారా పల్నాడు జిల్లా వ్యాప్తంగా లక్షా మూడు వేల 246 మంది లబ్ధిదారులకు 3 వేల 216 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే జిల్లా పరిధిలో ఇంత భారీ స్థాయిలో బ్యాంకింగ్ రంగాన్ని భాగస్వామ్యం చేస్తూ ఆర్థిక సాయం అందించడం ఒక రికార్డుగా నిలిచింది.
భారతీయ రైల్వే రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పడింది.
ప్రస్తుతానికి కోవిడ్ బారిన పడిన వారిలో ముగ్గురు రోగులు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతుండగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వీరే కాకుండా, కృష్ణా జిల్లాకు చెందిన ఒక మహిళకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
రైలు ఢీకొట్టిన వేగానికి స్కూల్ వ్యాన్ పూర్తిగా ముక్కలై, పట్టాల పక్కన పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు, ఒక సైక్లిస్ట్ అక్కడికక్కడే మృతి చెందారు. వ్యాన్ డ్రైవర్‌తో పాటు మరో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
క్వార్టర్ ఫైనల్ పోరులో పీవీ సింధు, జపాన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ నొజోమీ ఒకుహారాతో తలపడాల్సి ఉంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందే జపాన్ క్రీడాకారిణి ఒకుహారా గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగింది. దీంతో సింధుకు ఆటోమేటిగ్గా సెమీస్ బెర్త్‌ ఖరారు అయిపోయింది.
గూగుల్ నుండి సరికొత్త ఏఐ ఇమేజ్ ఎడిటర్ గూగుల్ పిక్స్ ఆగస్టు 18న అధికారికంగా విడుదల కాబోతోంది. అడోబ్, కాన్వాలకు పోటీగా వస్తున్న ఈ టూల్ ఫీచర్లు, ఉచిత ఆఫర్ వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.