విజయసాయి రాజకీయ సన్యాసం ప్రకటించి రెండు వారాలు గడిచిపోయింది. విజయసాయి నిష్క్రమణపై వైసీపీ మౌనం వహించింది. ఆ మౌనంలో భయమే ఎక్కువ కనిపించింది. విజయసాయి రాజీనామాపై వైసీపీకి మాత్రమే చేతనైన తీరులో విమర్శలు రాకపోవడానికి కారణం కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందన్న భయమేనని పరిశీలకులు సైతం విశ్లేషించారు. అయితే విజయసాయి రాజకీయ సన్యాసం, వైసీపీకి రాజీనామాపై ఆ పార్టీ నేతల మౌనం.. రెండు రోజుల కిందట బద్దలైంది. విజయసాయి వ్యక్తత్వం, విశ్వసనీయత లేని వ్యక్తి అంటూ జగన్ మీడియా సమావేశంలో చెప్పిన తరువాత ఇక వైసీపీ నేతలు ఒక్కరొక్కరుగా విజయసాయిపై విమర్శలతో ముందుకు వస్తున్నారు. అంత కంటే ముందు షర్మిల విజయసాయికి మద్దతుగా జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారనుకోండి అది వేరే సంగతి. ప్రస్తుతానికి వస్తే షర్మిల విమర్శలపై నోరు విప్పే ధైర్యం వైసీపీలో జగన్ సహా ఎవరికీ లేదన్నది తెలిసిందే.
ఇక మిగిలింది విజయసాయి. విజయసాయి జగన్ క్యారెక్టర్ కామెంట్స్ కు ఘాటుగా రిప్లై ఇచ్చిన తరువాత వైసీపీ నుంచి తొలి సారిగా కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నోరు విప్పారు. ఒక సామాన్య ఆడిటర్.. ప్రముఖ రాజకీయ నాయకుడిగా ఎదగడానికి, పార్టీలో ఉన్నత పదవులు పొందడానికి అవకాశం ఇచ్చిన వ్యక్తికి క్యారెక్టర్ ఉన్నట్లా, లేక ఆ పదవులన్నీ అనుభవించి, పార్టీ కష్టంలో ఉన్నప్పుడు వదిలేసి తన దారి తాను చూసుకున్న వ్యక్తికి క్యారెక్టర్, విశ్వసనీయతా ఉన్నట్లా అని ప్రశ్నించారు. పార్టీ వీడిన తరువాత పార్టీ అధినేతపైనా, పార్టీపైనా చెడుగా మాట్లాడటమే అతని స్వభావాన్ని తెలియజేస్తున్నదని నేరుగా పేరు ప్రస్తావించకుండానే విజయసాయిరెడ్డిపై విమర్శలు గుప్పించారు కేతిరెడ్డి. వైఎస్ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయాలన్న మీ ప్రయత్నం వెనుక ఎవరున్నారో తెలుసు అంటూ ఆయన చేసిన ట్వీట్ రానున్న రోజులలో మరింత మంది వైసీపీయులు విజయసాయిపై నోరు పారేసుకునేందుకు రూట్ క్లియర్ చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అదే జరిగి వైసీపీ వర్సెస్ విజయసాయిరెడ్డిగా విమర్శల పర్వం కొనసాగితే.. జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2 అయిన విజయసాయిరెడ్డి వెల్లడించే విషయాలు వైసీపీ కొంప ముంచడమే కాకుండా, జగన్ కు కూడా కంటిమీద కునుకులేకుండా చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. వైసీపీలో ఈ కొత్త రచ్చ ఎంత తొందరగా మొదలైతే అంత తొందరగా జగన్ ఆస్తుల కేసు విచారణ జోరందుకుంటుందని పరిశీలకులు అంటున్నారు. విజయసాయిరెడ్డిపై వైసీపీ నుంచి ఎంత తీవ్రంగా విమర్శలు వస్తే జగన్ రాజకీయ, న్యాయ వ్యవహారాలపై అంత తీవ్రంగా ప్రతికూల ప్రభావం ఉండటం ఖాయమంటున్నారు. ఈ పరిస్థితిని జగన్ ఎలా ఎదుర్కొంటారో చూడాల్సిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/now-situation-is-vijayasai-versus-ycp-39-192581.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.