బొత్స బెదిరింపులకు కార్పొరేటర్లు భయపడేనా ?

Publish Date:Apr 18, 2025

Advertisement

విశాఖలో మేయర్ పై అవిశ్వాస తీర్మానం పై చర్చ రేపే

ఓడలు బళ్ళు బళ్ళు ఓడలవుతాయి అంటారు ఇప్పుడు వైసీపీ పరిస్థితి అలాగే  తయారైంది.  నిన్న మొన్నటి వరకూ  నిశ్శబ్దంగా ఉన్న వైసీపీ నాయకులు తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు.  రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి.  రాజ్యసభ సభ్యత్వం నుంచి సర్పంచి వరకు వైసీపీ నాయకులు  రాజీనామాలు చేసి కూటమి పార్టీల బాట పడుతున్నారు.  ఈ తరుణంలో వైసీపీకి విశాఖ మేయర్ పీఠం అగ్నిపరీక్షగా మారింది. ఆ పార్టీకి కంటే..   ఆ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణకి విశాఖ మేయర్ పీఠాన్ని కాపాడుకోవడం కీలకంగా మారింది. .

.విశాఖ కార్పొరేషన్ లో 98 వార్డులకు గాను 58 వార్డులో వైసీపీ కార్పొరేటర్లు గెలుపొందారు.  కానీ అప్పుడు ప్రభుత్వం అధికారంలోకి ఉండడంతో ఇతర పార్టీలు ఇండిపెండెంట్ లను కూడా వైసీపీ బెదరించి తమలో కలుపుకుంది.  అయతే రాష్ట్రంలో  వైసీపీ అధికారం కోల్పోవడంతో విశాఖ మేయర్ పీఠం పై కూటమి నాయకులు కన్ను వేశారు.  దీనికి వైసీపీలోని అసంతృప్తి వర్గం పూర్తిస్థాయిలో సహకరించింది.  దీంతో నిన్న మొన్నటి వరకు వైసీపీలో ఉన్న కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు తెలుగుదేశం, జనసేన గూటికి చేరిపోయారు. మేయర్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే కావల్సిన మ్యాజిక్ ఫిగర్ 74. అయితే ఇప్పడు కరుడుగట్టిన వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లు కూడా ఫ్యాన్ పార్టీని వీడారు. తిప్పల వంశీ,  బెహరా భాస్కరరావు... ముత్తం శెట్టి ప్రియాంక లాంటి నాయకులు కూడా ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పారు

ఈ దశలో తమ పార్టీ సింబల్ పై గెలుపొందిన 58 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం చర్చకు హాజరు కాకూడదని ఆ పార్టీ నాయకులు  బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ హుకుం జారీ చేశారు. అలాగే పార్టీ విప్ ను కూడా జారీ చేస్తున్నట్టు ప్రకటించారు.  పార్టీ ఆదేశాన్ని పాటించని వారిపై అనర్హత వేటు వేస్తామని కూడా బొత్స సత్యనారాయణ తాజాగా హెచ్చరించారు.  నిజానికి విశాఖ తాజా కార్పొరేషన్ కాలపరిమితి కేవలం పది నెలలు మాత్రమే ఉంది. ఈ దశలో న్యాయం పరమైన చిక్కులు పూర్తి కావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది.  దీంతో పార్టీ మారిన ఫ్యాన్ పార్టీ నాయకులు ఎవరూ కూడా బొత్స మాటలను లెక్కచేసే అవకాశం లేదు.  అన్నిటికంటే మించి కార్పొరేటర్లగా గెలిచినప్పటికీ అధికారంలో ఉన్నప్పుడు తమను పట్టించుకోలేదన్న ఆగ్రహం చాలామంది వైసీపీ కార్పొరేటర్ లలో ఉంది.  ముఖ్యంగా ఒక కోటరీ చుట్టూ కార్పొరేషన్ వ్యవహారం సాగిందని ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లు విమర్శిస్తున్నారు. ఇక బొత్స సత్యనారాయణ విశాఖ మేయర్ విషయంలో బీసీ కార్డును ఉపయోగించుకోవాలని భావించారు. అవిశ్వాసం ద్వారా బీసీ మహిళను అగౌరవ పరుస్తున్నారని బొత్స సత్యనారాయణ తాజాగా ఆరోపించారు. దీనికి కూటమి కార్పొరేటర్ మూర్తి యాదవ్ తీవ్రంగా కౌంటర్ ఇచ్చారు. అసలు పేరుకు మేయర్ అయినప్పటికీ ఆమెను ఆ పార్టీ ఎప్పుడూ కూడా గౌరవించలేదని ఆరోపించారు. ఎంపీ విజయసాయిరెడ్డి,  వై వి సుబ్బారెడ్డి లాంటి నాయకుల పెద్దరికం మాత్రమే కనిపించిందని గుర్తు చేశారు. ఈ దశలో విశాఖ మేయర్ భవిష్యత్తుతో పాటు బొత్స సత్యనారాయణ పెద్దరికానికి ఈ అవిశ్వాస తీర్మానం అగ్నిపరీక్ష కానుంది.

By
en-us Political News

  
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.
ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం.
2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.
ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.