Publish Date:Aug 27, 2022
పిల్లలకి పాకడం రావడం ఆలస్యం ఇల్లంతా తిరిగేస్తుంటారు. వారికి అదో ఆట. ఇల్లంతా కలియ తిరగ డానికి ప్రయత్నిస్తుంటా. కానీ అంత శుభ్రంగా ఉందీ లేనిదీ తల్లిదండ్రులకు తెలుసు కాబట్టి పిల్లల్ని అలా ఇల్లంతా పాకనీయరు. ఓ క్షణం తర్వాత ఎత్తుకుంటారు. కానీ కొత్తగా నేర్చిన ఆట ఎప్పుడూ పసం దుగానే ఉంటుంది.. పిల్లలకీ అంతే. మాటలు రావు గనుక చేత్తులతో ఎత్తుకున్నవారి మొహాన్ని కొడుతూ కిందకి వదలమంటారు. తల్లిందండ్రులకు, ఇంట్లో పెద్దవారికి అదో ఆనందం. దానికి అంతే ఉండదు.
కానీ ఇలా అమితోత్సాహంతో పిల్లలు మేడ మెట్లు ఎక్కడానికీ ప్రయత్నిస్తుంటారు. ఇది ప్రమాదకరం. అందుకే వెనకాలే తిరుగుతూ మెట్ల వేపు వెళ్లకుండా జాగ్రత్తపడుతుంటారు, జాగ్రత్తపడాలి. నడక వస్తే పట్టుకోవడం మరీకష్టం. ఇంట్లో పిల్లలతో పాటు కుక్కపిల్లనీ అంతే ప్రేమగా చూసుకునేవారు చాలా మందే ఉన్నారు. అది కూడా అలా పాకుతూనో, నడకనేర్చి రెండు అడుగులు వేసే పిల్లలతోనో తిరుగు తూనే ఉంటుంది. దానికి పెద్దవాళ్ల తర్వా త ఇంట్లో హఠాత్తుగా ఈ రాజు, రాకుమారి ఎవరా అని ఆశ్చర్యం.
మెల్లగా ఇంట్లోవారు పిల్లనో, పిల్లాడినో ఎలా చూస్తున్నారన్నది కుక్కపిల్లా గమనిస్తుంది. అదీ అంతే జాగ్ర త్తలు తీసుకుంటుంది. వేగంగా వెళు తుంటే అడ్డుకోవడం, మెట్లు ఎక్కబోతే వారించడమే చేస్తుంది. పిల్ల లు కోపగించి దాన్ని కొడతారు. దానికి దెబ్బే తగలదు కానీ, అడ్డుకోవడం మాత్రం మానదు. పడతారన్న భయం తల్లిదండ్రులకు ఎలా ఉంటుందో తోడుగా తిరిగే కుక్కపిల్లకీ ఉంటుందేమో!
మీరు చూస్తున్న ఫోటోలో సీన్ అదే. ఆ పసికూన మెట్లెక్కడానికి విశ్వయత్నం చేస్తోంది. ససెమీరా అంగీ కరించని కుక్క అడ్డుకుంటోంది. పిల్లడు ఎక్కి పడితే తల్లిదండ్రులు ఓదార్చి ముద్దెడతారు. కానీ తన్ను లు మాత్రం తనకు తప్పవుకదా! అదీ కారణం కావచ్చు.. అందుకునే అడ్డుకుంటోంది! ఇది ఎక్కడదని కాదు.. ప్రతీ ప్రాంతంలో దాదాపు కుక్కలున్న ప్రతీ ఇంట్లో సీన్ ఇలానే ఉంటుంది. కుక్కలు యజమాని భక్తులు. తిండిపెట్టి పెంచుతున్నారు గనుక, దెబ్బలు తినకూడదుగదా! అందుకునే ఈ రక్షణకు పూనుకుంటుంది!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-i-dont-allow-you-39-142753.html
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్మెన్లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.