బీజేపీ-సంఘ్ పరివార్ మధ్య అగాధం.. మోహన్ భగవత్ శాంతి మంత్రం సంకేతమదేనా?

Publish Date:Dec 22, 2024

Advertisement

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ తన వ్యాఖ్యల ద్వారా సంఘ్ పరివార్, బీజేపీ మధ్య అగాధం ఇంకా పూడలేదన్న సంకేతాలు ఇస్తున్నారా? అన్న ప్రశ్నకు పరిశీలకుల నుంచి ఔనన్న సమాధానమే వస్తోంది. తాజాగా మోహన్ భగవత్ మసీదు, మందిరం వివాదాలకు ఇక ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రవచించడం  బీజేపీ,సంఘ్ పరివార్ మధ్య సంబంధాలు ఇంకా బలపడలేదనడానికి తార్కానంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇటీవలి సార్వత్రిక ఎన్నికల ముందు సంఘ్ పరివార్, బీజేపీ అగ్రనాయకత్వం మధ్య అగాధం ఉదన్న విషయం ప్రస్ఫుటమైంది. బీజేపీ, సంఘ్ పరివార్ నేతలు అప్పట్లో పరస్పరం చేసుకున్న వ్యాఖ్యలు వారి మధ్య సామరస్యం లేదని విస్పష్టంగా తేల్చేశాయి. ఇక తాజాగా   మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల సందర్భంగా సంఘ్ పరివార్, బీజేపీ నేతలు పరస్పర అవగాహనతో, సామరస్యంగా కలిసి పని చేశారన్న భావన కలిగింది.  అయితే అదేమీ వాస్తవం కాదని అకస్మాత్తుగా భగవత్ చేసిన మసీదు, మందిరం వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటూ చేసిన శాంతి ప్రకటన బీజేపీ అగ్రనాయకత్వం విధానాల పట్ల సంఘ్ పరివార్ అసంతృప్తితో ఉందన్న భావన కలిగించేలా ఉంది. 

బీజేపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో మైనార్టీలపై తమ వ్యాఖ్యల ద్వారా విషం చిమ్ముతున్నారని, ఫలితంగా దేశంలో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారనీ మోహన్ భగవత్  తన వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా హెచ్చరించినట్లయింది. భారత దేశమంటేనే పరమతసహనం. అదే కొనసాగాలి. భిన్నత్వంలో ఏకత్వం ఈ దేశం. అన్ని మతాల వారు ఎన్నో వందల సంవత్సరాలుగా కలసి మెలసి బతుకుతున్నారు. మసీదు, మందిరం వివాదాలు ఇకపై కొనసాగనివ్వరాదు అంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా చర్చ ఆరంభమైంది. శ్రీరాముడు హిందువుల ఆరాధ్యుడు. రామమందిర నిర్మాణం హిందువుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం కనుక మందిర నిర్మాణం వారి నమ్మడానికి ప్రతీక అన్నారు. అలాగని ప్రతిచోటా కొత్త వివాదాలు రెకెత్తించడం సబబుకాదని మోహన్ భగవత్ కుండబద్దలు కొట్టారు.

ప్రతి మతానికి నమ్మకాలు,  దైవం.సంస్కృతి ఉంటాయని వాటిని గౌరవించి తీరాల్సిందేననీ మోహన్ భగవత్ చెప్పారు.  దేశంలోని ప్రతిపౌరునికీ తమకు నచ్చిన దైవాన్ని ఆరాధించే హక్కు ఉందన్నారు.  మహారాష్ట్ర లోని విశ్వగురు భారత్, ఉత్తరప్రదేశ్లోని షాజహాన్ మసీదు, రాజస్తాన్ లోని అజ్మేర్ షరీఫ్ దర్గా ల వివాదాలు ప్రస్తావించి వాటి వివాదంలోకి లాగడాన్ని  తప్పుపట్టారు. ఇకపై కొత్త వివాదాలకు అవకాశాలు ఇవ్వరాదని బీజేపీకి హితవు చెప్పారు.  దేశంలో అందరూ కలసిమెలసి జీవిస్తున్నారని,అలాగే శాంతియుతంగా జీవించడమే అసలైన గుర్తింపు అన్నారు. గతంలో జరిగిన తప్పిదాలను ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకుని మెలగాలని సూచించారు. జరిగిన తప్పులు మరలా జరగకుండా తగిన జాగర్తలు తీసుకుని సర్దుకుపోవడం వల్ల ప్రపంచానికి భారతదేశం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఇతర మతాల దైవాలను అవమానించడం మన సంస్కృతి కాదన్నారు. ఏ దేశంలో నైనా మెజార్టీలూ,మైనార్టీలు ఉంటారని,   వారి మధ్య విభేదాలు రాకూడదన్నారు.  ప్రపంచ శాంతి కోసం భారత్ ప్రకటనలు,మధ్యవర్తిత్వం జరుగుతున్నా యుద్ధాలు ఆగడం లేదు.భారత్ లో మైనార్టీల అణచివేత జరుగుతోందన్న ప్రచారం ఉందనడం ద్వారా మోహన్ భగవత్ బీజేపీకి ఒక స్పష్టమైన హెచ్చరిక చేశారు.  ఇకపై మసీదు శిధిలాల్లో మందిరం  అనే వివాదాలను తెచ్చి ప్రజల మధ్య చిచ్చు పెట్టవద్దని సూచించారు.

సంఘ్ పరివార్, బీజేపీ మధ్య సంబంధాలు గత కొంతకాలంగా సరిలేవని,అందుకే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మేజార్టీ రాలేదన్న వాదనకు బలం చేకూర్చేవిగా మోహన్ భగవత్ వ్యాఖ్యలు ఉన్నాయి. ఏదిఏమైనా భగవత్  చెప్పిన విషయం అక్షర సత్యమనడంలో సందేహం లేదు. దేశంలో పరమత సహనంతో అందరూ కలసిమెలసి బ్రతకాలన్న ఆయన సూచన శిరోధార్యం.  హిందూత్వ అతివాదులు ఆయన వ్యాఖ్యలను ఔదాల్చి వివాదాలకు స్వస్థి పలికితే భారత్   ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

By
en-us Political News

  
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.