సైకిల్ సారథి లోకేషే.. ఎనీ డౌట్?

Publish Date:Jan 29, 2025

Advertisement

దివంగ‌త ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని అధినేత‌ చంద్ర‌బాబు నాయుడు దిగ్విజ‌యంగా ముందుకు న‌డిపించుకుంటూ వ‌చ్చారు. అధికారం కోల్పోయిన ప్ర‌తిసారి పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల్లో ఉత్తేజాన్నినింపుతూ.. ప‌డిలేచిన కెర‌టంలా రెట్టించిన ఉత్సాహంతో అధికారంలోకి వ‌స్తూ టీడీపీని బ‌ల‌మైన పార్టీగా నిలుపుతూ వ‌చ్చారు. ఇటీవ‌లి కాలంలో చంద్ర‌బాబు వ్యూహాల‌కుతోడు ఆయ‌న త‌న‌యుడు నారా లోకేశ్ వ్యూహాలుకూడా తోడుకావ‌టంతో పార్టీ మ‌రింత బ‌లోపేతం అయింది.  అయితే లోకేష్ ఈ స్థాయికి ఎదగడం అంత ఆషామాషీగా జరగలేదు. తండ్రి చాటు తనయుడిగా రాజకీయాలలో బుడిబుడి అడుగులు వేస్తున్న సమయంలోనే ఆ నడకను ఆపేయడానికి ప్రత్యర్థులు కుట్రలు పన్నారు. కుయుక్తులు పన్నారు. ఆయన ఆహార్యాన్నీ, ఆహారాన్ని, మేనరిజాలను ఇలా వేటినీ వదలకుండా విమర్శలు గుప్పించారు. చివరాఖరికి బాడీ షేమింగ్ కు కూడా వెనుకాడలేదు. అయితే ఉలి దెబ్బలకు శిల శిల్పంగా మారినట్లుగా ఆయన ఆ విమర్శల దాడిని తట్టుకుని ప్రజా నాయకుడిగా ఎదిగారు.  

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పనితీరుని చూడలేని కబోది నాయకుల విమర్శల నుండి ఎదిగిన పరిణితి   నారా లోకేష్.  టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఈసారి పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యతను స్వచ్ఛందంగా భుజానికి ఎత్తుకున్న నిబద్దత గల కార్యదక్షకుడు, క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం సైనికుడు నారా లోకేష్.   నారా లోకేష్ నాయకత్వ పటిమ విషయంలో కానీ, సమస్యలను దీటుగా ఎదుర్కొని పరిష్కరించగలిగిన పరిణితి విషయంలో కానీ, పార్టీకి అన్నీ తానై దిశా నిర్దేశం చేయగలిగిన సమర్థత విషయంలో కానీ ఇప్పుడు ఎవరికీ ఎటువంటి అనుమానాలూ లేవు.  సొంత పార్టీయే కాదు, ప్రత్యర్థి పార్టీలు సైతం ఇప్పుడు నారా లోకేష్ పరిణితి చెందిన నాయకుడనీ, ప్రజాభిమానం చూరగొన్న ప్రజా నాయకుడని అంగీకరిస్తున్నాయి. అలా అంచలంచెలుగా ఎదిగిన నారా లోకేష్ ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడిగానే కాదు తండ్రిని మించిన తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.  టీడీపీకి భ‌విష్య‌త్ నాయ‌కుడిగా మారారు. ప్ర‌స్తుతం పార్టీని త‌న క‌నుస‌న్న‌ల్లో న‌డుపుతూ కార్య‌క‌ర్త‌ల‌కు అండ‌గా ఉంటున్నారు. రాజ‌కీయంగా .. పాల‌నాప‌రంగా అన్ని అంశాల‌పై మంచి ప‌ట్టును సంపాదించిన లోకేశ్.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే, అన్ని అంశాల్లో త‌న స‌మ‌ర్ధ‌త‌ను నిరూపించుకుంటున్న‌ లోకేశ్‌.. ఇసుమంతైనా  గ‌ర్వం లేకుండా  ఎక్కడ నెగ్గాలో మాత్రమే కాదు.. ఎక్క‌డ త‌గ్గాలో  తెలిసిన నేతగా త‌న రాజ‌కీయ చ‌తుర‌త‌ను, పరిణితిని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. 

ప్ర‌భుత్వంలో పాల‌నాప‌రంగానూ చంద్ర‌బాబుకు త‌గ్గ త‌న‌యుడుగా లోకేశ్ అంద‌రిచేత ప్ర‌శంస‌లు పొందుతున్నారు. మంత్రిగా కొన‌సాగుతూ కూట‌మి ప్ర‌భుత్వ పాల‌న‌లో కీల‌కంగా మారిన లోకేశ్ ను డిప్యూటీ ముఖ్య‌మంత్రిగా చూడాల‌ని తెలుగుదేశం నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఆశ‌ప‌డుతున్నారు. దీంతో లోకేశ్ ను డిప్యూటీ సీఎంగా ప్ర‌మోట్ చేయాలంటూ వారు ఇటీవ‌ల పెద్ద ఎత్తున గళమెత్తారు.   ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పాల్గొన్న స‌భా వేదిక‌పైనే నేతలు లోకేశ్ కు డిప్యూటీ సీఎం విష‌యాన్ని ప్ర‌స్తావించారు. అయితే, ఈ విష‌యం కూటమి ఐక్యతపై ప్రభావం చూపుతుందన్న ఉద్దేశంతో పార్టీ అధిష్టానం అల‌ర్ట్ అయింది. లోకేశ్ కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి విష‌యంపై ఎవ‌రూ ఎలాంటి వ్యాఖ్య‌లు చేయొద్దంటూ నేత‌ల‌కు ఆదేశాలు ఇచ్చింది. దీంతో టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఆ విషయంపై మాట్లాడటం మానేశారు.  అదే సమయంలో ఈ విష‌యంపై లోకేశ్ స్పందించిన తీరు అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. ఆనందడోలికల్లో ముంచేసింది. వాస్త‌వానికి డిప్యూటీ సీఎం ప‌ద‌వి చేప‌ట్ట‌డానికి లోకేశ్ కు అన్ని అర్హ‌త‌లూ ఉన్నాయి.. కానీ, కూట‌మిలో విబేధాలు రాకూడ‌ద‌న్న ఉద్దేశంతో డిప్యూటీ సీఎం విష‌యంలో లోకేశ్ వెన‌క్కు త‌గ్గారు. మీడియాతో మాట్లాడుతూ ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించారు. డిప్యూటీ సీఎం ప‌ద‌వి కంటే తాను తెలుగుదేశం కార్య‌క‌ర్త‌గా ఉండ‌టానికే ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డ‌తానంటూ టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తిని తొల‌గించే ప్ర‌య‌త్నం చేశారు.

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డంలో లోకేశ్ పాత్ర కీల‌క‌మ‌ని చెప్ప‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ కూట‌మిని ముందుండి న‌డిపించిన‌ప్ప‌టికీ.. లోకేశ్ చేప‌ట్టిన‌ యువ‌గ‌ళం పాద‌యాత్ర జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డ‌టానికి కార‌ణ‌మైంది. జ‌గ‌న్ హ‌యాంలో నాలుగేళ్లు ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు, ప్ర‌జలు ప్ర‌భుత్వంకు వ్య‌తిరేకంగా మాట్లాడేందుకు వెన‌క‌డుగు వేశారు.  అలాంటి స‌మ‌యంలో యువ‌గ‌ళం పాద‌యాత్ర‌తో లోకేశ్ ప్ర‌జ‌ల్లోకి వెళ్లారు. ప్ర‌భుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా మొండి ప‌ట్టుద‌ల‌తో లోకేశ్ పాద‌యాత్ర‌ను కొన‌సాగించారు. ప్ర‌జ‌లు సైతం లోకేశ్ కు త‌మ స‌మ‌స్య‌ల‌ను చెప్పుకునేందుకు రోడ్డు పొడ‌వునా బారులు తీరారు. దీంతో ఒక్క‌సారిగా జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెచ్చుకుంది. యువగళం పాదయాత్రే జ‌గ‌న్ ప‌త‌నానికి బీజం పడేలా చేసింది. ఆ త‌రువాత చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ కూట‌మిని ముందుండి న‌డిపించ‌డంలో విజ‌య‌వంతం కావ‌డంతో కూట‌మి ప్ర‌భుత్వం అద్భుత విజ‌యంతో అధికారంలోకి వ‌చ్చింది.

లోకేశ్ ను అభిమానించే వారిలో టీడీపీ శ్రేణుల‌తోపాటు ఏపీలో ల‌క్ష‌లాది మంది   ఉన్నారు. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా చిన్న పిల్ల‌లు, మ‌హిళ‌లు, యువ‌కులు క‌ర‌చాల‌నం చేసేందుకు, సెల్ఫీలు దిగేందుకు పోటీ ప‌డుతున్నారు. త‌క్కువ కాలంలోనే ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన నేత‌గా లోకేశ్ ఎదిగారు. చంద్ర‌బాబు నాయుడు కొడుకుగానే కాకుండా.. త‌న సొంత స‌మ‌ర్ధ‌త‌తో రాజ‌కీయాల్లో లోకేశ్ రాణిస్తున్నారు. దీంతో ఇప్పుడు డిప్యూటీ సీఎం ప‌ద‌వి చేప‌ట్టేందుకు అవ‌కాశం రాక‌పోయినా రాబోయే కాలంలో లోకేశ్‌కు ముఖ్య‌మంత్రి అయ్యే ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉన్నాయ‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు.

By
en-us Political News

  
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.