జగనన్న పోరాటంలో పస లేదు!

Publish Date:Jul 22, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి శవరాజకీయాలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఐదేళ్లు అధకారంలో ఉండి రాష్ట్రాన్ని సర్వ విధాలా భ్రష్ఠపట్టించిన జగన్ తన హయాంలో జరిగిన హత్యల గురించి ఒక్కసారి కూడా ప్రస్తావించలేదని దుయ్యబట్టింది. ఇప్పుడు వ్యక్తిగత కక్షలలో వినుకొండలో జరిగిన ఒక హత్య ఉదంతంపై తన రాజకీయ లబ్ధి కోసం నానా యాగీ చేస్తున్నారని విమర్శించింది. వినుకొండ ఘటన ద్వారా రాజకీయ లబ్ధి కోసం జగన్ నేల విడిచి సాము చేస్తున్నారు. చివరికి సొంత పార్టీ నేతలు సైతం జగన్ తీరును తప్పుపడుతున్నారు. హస్తినలో ధర్నా ఏ ముఖం పెట్టుకు చేస్తారని అంతర్గత సంభాషణల్లో అంటున్నారు. అధికారంలో ఉన్నంత కాలం రాష్ట్ర సమస్యలను గాలికొదిలేసి, విపక్ష నేతలు, కార్యకర్తలపై కక్ష సాధింపు, వేధింపు చర్యలకే పరిమితమైన జగన్ ఇప్పడు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేయడం నవ్వు పుట్టిస్తోందని అంటున్నారు. 

కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు, జగన్ కు స్వయానా సోదరి అయిన షర్మిల సోమవారం(జులై 22)  విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సొంత బాబాయ్ హత్య కేసు దర్యాప్తు నిష్పాక్షికంగా జరగాలని ఏనాడూ డిమాండ్ చేయని జగన్ ఇప్పుడు వినుకొండలో ఒక రౌడీ హత్యను రాజకీయం చేస్తూ హస్తినలో ధర్నా చేస్తానంటున్నారని విమర్శించారు. తానేమీ వైసీపీ, తెలుగుదేశం అనుకూల మీడియా వార్తలను చూసి మాట్లాడటం లేదనీ,  క్షేత్ర స్థాయి నుంచి తమకు అందిన సమాచారం మేరకు వినుకొండలో జరిగిన హత్య వెనుక ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదని షర్మిల కుండబద్దలు కొట్టేశారు. హంతకుడు, హతుడూ ఇద్దరూ కూడా వైసీపీకి చెందిన వారేననీ, వారి మధ్య ఉన్న పాత కక్షల కారణంగానే హత్య జరిగిందని చెప్పారు. అధికారంలో ఉన్నంత కాలం ఏపీకి ప్రత్యేక హోదా కోసం హస్తినలో ధర్నాఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత రాజకీయ ఉనికి కోసం వినుకొండ హత్యను వాడుకుంటున్నారని షర్మిల జగన్ పై విమర్శలు గుప్పించారు.  

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హస్తినలో గళమెత్తని జగన్ ఇప్పుడు వినుకొండ హత్యను రాజకీయం చేయడం కోసం హస్తినలో ధర్నా చేయడానికి సిద్ధమైపోయారని ఎద్దేవా చేశారు. జగన్ పార్టీకి అసెంబ్లీలో ఆయనతో సహా కేవలం 11 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. కేవలం తన ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే జగన్ హస్తినలో ధర్నా అంటున్నారు. వాస్తవానికి అసెంబ్లీకి హాజరై వివిధ బిల్లులు, ఇతర అంశాలపై మాట్లాడాల్సిన జగన్ అసెంబ్లీకి మొహం చాటేయడానికే హస్తిన పర్యటన పెట్టుకున్నారని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలలో తన హయాంలో జరిగిన తప్పిదాలకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుందన్న భయంతోనే జగన్ అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజర్ అవ్వాలని భావిస్తున్నారని అంటున్నారు.  

By
en-us Political News

  
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.
ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం.
2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.
ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.