వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి తాజాగా మరో వివాదంలో చిక్కుక్కున్నారు. నిత్యానంద స్వామి చనిపోయినట్టు ఆయన మేనల్లుడు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఆస్తుల విషయంలో మేనమామతో వచ్చిన విభేధాల వల్ల మేనల్లుడు ఈ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. సినీ నటి రంజితతో నిత్యానంద స్వామి కి అఫైర్ ఉందని వార్తలు గుప్పుమనడంతో అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనమైంది. తమిళనాడు అరుణాచలంకు చెందిన నిత్యానంద స్వామి అమెరికాలోని ప్రత్యేక ఐలాండ్ లో కైలాస దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ దేశానికి తానే ప్రధాని అని చెప్పుకున్నారు. తన వారసురాలిగా సినీ నటి రంజిత అని ప్రచారం జరిగింది. ఆస్తుల విషయంలో నిత్యానందస్వామి మేనల్లుడికి రంజిత మధ్య విభేధాలున్నాయి. ఈ కారణంగా ఈ నెల ఏప్రిల్ ఒకటో తేదీన నిత్యానందస్వామి చనిపోయినట్టు మేనల్లుడు ప్రకటించారు. మేనల్లుడు చేసిన ప్రకటనను నిత్యానంద స్వామి శిష్యులు ఖండిస్తూ ఓ వీడియో మీడియాకు విడుదల చేశారు.
ఈ వివాదం వారం రోజులు గడవకముందే బొలివియా దేశంలో నిత్యానందస్వామి భూ దందా చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిత్యానందస్వామి అనుచరులు బొలివియా దేశంలోని గిరిజనులు ఆవాసముండే భూములపై కన్నేశారు. గిరిజన ప్రజల అమాకత్వం, పేదరికం ఆసరాగా చేసుకుని నిత్యానంద స్వామి శిష్యులు భారీ స్కెచ్ వేశారు. వందల ఎకరాల భూములను కొట్టేయాలని చూశారు. స్థానిక గిరిజన తెగలతో వందేళ్ల లీజు అగ్రిమెంట్లు చేసుకున్నారు. వెంటనే బొలివియా ప్రభుత్వం అప్రమ్తమైంది. ఈ లీజు ఒప్పందాలను రద్దు చేసింది. కైలాస దేశంలో ఉన్న 20 మందిని అరెస్ట్ చేశారు. అమెరికాలో ఐల్యాండ్ లో కైలాస ఏర్పాటు చేసుకున్న నిత్యానంద స్వామి బొలివియాలో కూడా కైలాస దేశం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nithyananda-swami-in-controversy-once-again-land-scam-in-bolivia-25-195580.html
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.