ఇవి తింటే పీడకలలు ఖాయం!

Publish Date:Aug 22, 2017

Advertisement

 

మనిషికి ఏమున్నా లేకపోయినా ఫర్వాలేదు కానీ ఆహారం, నిద్రా లేకపోతే మాత్రం బతకడం కష్టమే. అందుకే ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు అంటారు పెద్దలు. నిజమే! హాయిగా పడుకోవాలనీ, ఆ నిద్రలో ఎలాంటి పీడకలలూ రాకుండా ఉండాలని ఎవరికి మాత్రం తోచదు. కానీ కొన్ని రకాల ఆహారపదార్థాలను తింటే మాత్రం పీడకలలు వస్తాయని అంటున్నారు నిపుణులు. మరి అవి ఏంటో…

 

మద్యం:-

చాలామంది మందు కొడితే హాయిగా నిద్రపట్టేస్తుంది అనుకుంటారు. కానీ మద్యం వల్ల నిద్ర పట్టదు సరికదా! పట్టినా కూడా పీడకలలు ఖాయం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే మనం నిద్రపోయేటప్పుడు REM (rapid eye movement) అనే దశ ఉంటుంది. ఈ దశలోనే మనం కలలను కంటాము. మోతాదు మించిన మద్యం ఈ దశని చెడగొడుతుందట. ఫలితంగా పీడకలలు తప్పవంటున్నారు.

 

చాక్లెట్‌:-

పడుకునే ముందు హాయిగా ఓ చాక్లెట్‌ని ఆస్వాదించి పడుకుందామని చాలామంది అనుకుంటారు. కానీ చాక్లెట్‌లో కెఫిన్‌ అనే పదార్థం చాలా అధికంగా ఉంటుందనీ... ఆ కెఫిన్ మన నిద్రను పాడుచేస్తుందన్న విషయాన్ని మర్చిపోతారు. ఆ మాటకి వస్తే చాక్లెట్‌ మాత్రమే కాదు- కెఫిన్‌ అధికంగా ఉండే టీ, కాఫీ, కూల్‌డ్రింక్స్ లాంటి పదార్థాలన్నీ కూడా పీడకలలకు దారితీస్తాయి.

 

మషాళాలు:-

ఈ రోజుల్లో చాలామంది మంచిగా పార్టీ చేసుకుని ఓ బిర్యానీ పొట్లాన్నీ పొట్టన వేసుకుని పడుకుంటున్నారు. బిర్యానీనే కాదు వేపుళ్లు, మషాళాలు, బేకరీ పదార్థాలు లాంటివాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎందుకంటే మన జీర్ణవ్యవస్థకీ నిద్రకీ చాలా దగ్గర సంబంధం ఉంది. కష్టమైన ఆహారాన్ని జీర్ణం చేసుకునేందుకు శరీరం ఇబ్బందిపడుతుంటే, మెదడు సుఖంగా ఎలా ఉంటుంది. దాని మానాన అది పీడకలలు కంటుంది కదా!

 

ఐస్‌క్రీం:-

రోజంతా పడ్డ శ్రమకి ప్రతిఫలంగా ఓ కప్పుడు ఐస్‌క్రీంని ఆస్వాదిద్దాం అనుకుంటాం. కానీ చల్లగా కనిపించే ఐస్‌క్రీం మన బుర్రని వేడెక్కించేయగలదు. అందుకు కారణాలు లేకపోలేవు. ఐస్‌క్రీంని పాలతో తయారుచేస్తారు. వయసు పెరిగేకొద్దీ మనలో ఈ పాలపదార్థాలని జీర్ణం చేసుకునే సామర్థ్యం తగ్గిపోతుంటుంది. పైగా ఐస్‌క్రీంలో తీపి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అది మనలోని మెటబాలిజం (జీవక్రియలు) మీద ప్రభావం చూపుతుంది. ఇక చల్లటి ఐస్‌క్రీంని ఒంటికి తగినట్లు వేడిగా మార్చుకునేందుకు కూడా శరీరం ఇబ్బంది పడుతుంది. వీటన్నింటి ఫలితం – పీడకలలే!

అదండీ సంగతి! కమ్మటి కలలు కనే నిద్ర పట్టాలంటే మనం పడుకునే ముందు ఏ ఆహారం తీసుకుంటున్నామో కూడా ముఖ్యమే. ఆ ఆహారం కూడా నిద్రపోయేందుకు ఓ రెండు గంటల ముందరే తినేయాలని సూచిస్తున్నారు!

- నిర్జర.

 

By
en-us Political News

  
కాలంతో పాటు మనుషులు కూడా మారుతూ ఉంటారు. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు, కష్టాలకు తగ్గట్టు మనుషులు సర్దుబాటు చేసుకుంటూ తమను తాము మార్చుకుంటూ ముందుకు వెళతారు.
నార్సిసిస్టులు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. బయటకు మేధావులలా కనిపిస్తుంటారు. వారు తమ మాటలతో ఇతరులు తప్పు అని నిరూపిస్తుంటారు. వాటికి తగిన కారణాలను కూడా చెబుతూ ఉంటారు.
భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది.  జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం అది. కానీ నేటికాలంలో ఈ బంధం పలుచబడిపోతోంది. చాలామంది పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ గా చేసుకుంటున్నారో.. అంత త్వరగా విడిపోతున్నారు...
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది...
కొత్త అనే పదంలోనే బోలెడంత ఆశ ఉంటుంది.  ప్రతి ఒక్కరూ తమకు కొత్త అనే పదం నుండి ఎంతో గొప్ప మేలు జరుగుతుందని అనుకుంటారు.  అలా జరగాలని కూడా కోరుకుంటారు.  అందుకే రేపు అనే రోజు మీద కూడా చాలా ఆశ ఉంటుంది అందరికీ...
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపించాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది...
పెళ్లయ్యాక భార్యభర్తల మద్య గొడవలు అనేవి చాలా సహజం.  చాలా మంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంటి గొడవలు అని చెబుతారు. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలే అయినా,  ఇంటికి, కుటుంబానికి సంబంధించినవి అయినా టోటల్ గా ప్రతి భార్యభర్త జంట..
నేటి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సహా అన్ని రంగాలలో రాణిస్తున్నారు.  అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొన్ని సందర్బాలలో అబ్బాయిల కంటే ధైర్యాన్ని చూపగలుగుతున్నారు. అయినా సరే అమ్మాయిల విషయంలో సమాజం నుండి ఇంటి వరకు ప్రతి చోట ఒక చిన్నతనం కనిపిస్తుంది....
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.