నేతాజీ చనిపోలేదా? 117ఏళ్ల ఆయన డ్రైవర్ నిజాముద్దీన్ నమ్మిన నిజమేంటి?

Publish Date:Feb 7, 2017

Advertisement

 

'' నేతాజీ 1945లో విమాన దుర్ఘటనలో చనిపోలేదు! ''

ఈ మాటలు మనం ఇప్పుడు కొత్తగా వింటున్నవి కాదు! దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ పదే పదే వినిపిస్తూనే వున్నాయి. కాని, నిన్న ఒక 117ఏళ్ల పెద్దాయన వారణాసిలో చనిపోయాడు. ఆయన కూడా ఇదే అనటమే ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తోంది! ఇంతకీ ఆయనెవరో తెలుసా? నేతాజీ అనుంగు అనుచరుడు. పేరు నిజాముద్దీన్. బోస్ గురించి తన జీవితాంతం ఒకానొక పెద్ద నిజాన్ని మనసులోనే దాచుకున్న స్వాతంత్ర్య సమరయోధుడు!

 

నిజాముద్దీన్ తన సుదీర్ఘ జీవితంలో ఏనాడూ నేతాజీ మరణించాడంటే ఒప్పుకోలేదు! అంతే కాదు, మన దేశ ప్రభుత్వాలు ఎన్నిసార్లు కమిటీలు, కమీషన్లు వేసినా అన్నిటికి తనతో దాగిన నిజాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు నిజాముద్దీన్. కాని, ఆయన్ని ఏ సత్య శోధన బృందమూ పట్టించుకోలేదు. కాని, ఆయన చెప్పిన మాటలు మాత్రం బోస్ అభిమానులకి, భారతీయులందరికీ ఎంతో ఆసక్తి, ఆనందం కలిగిస్తాయి! దాదాపు నాలుగేళ్లు సుభాష్ చంద్రబోస్ తో కలిసి ఇండియన్ నేషనల్ ఆర్మీలో నిజాముద్దీన్ పని చేశాడు. అత్యంత సన్నిహితంగా ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతితో మసిలేవాడు. అయితే, 1945లో తైవాన్ లో విమానం కూలి నేతాజీ చనిపోయాడని చెబుతోన్న తేదీ తరువాత ... దాదాపు మూడు నెలలకి తాను సుభాష్ ని బర్మా బార్డర్ వద్ద కార్ లో దిగబెట్టానని నిజాముద్దీన్ చెప్పేవాడు. ఆ తరువాత ఉత్తర్ ప్రదేశ్ లో బోస్ చాలా ఏళ్లు గుమ్నామి బాబాగా సన్యాస జీవితం గడిపాడని కూడా అనేవాడు. నిజాముద్దీన్ మాటల్ని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. కాని, 2015లో బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రహస్య డాక్యుమెంట్లు బయట పెట్టింది. వాటిల్లో నేతాజీ ప్లెయిన్ క్రాష్ లో చనిపోలేదని అనుమానం వ్యక్తం అయింది. నిజాముద్దీన్ ఆ సమయంలో తన వాదన నిజమైందని వాదించాడు!

 

నిజానికి ఒకప్పుడు చాలా ఏళ్లు బ్రిటీష్ వారి సేవలో సైనికుడిగా వున్న సైఫుద్దీన్ తరువాత నిజాముద్దీన్ గా పేరు మార్చుకున్నాడు. బోస్ పిలుపుతో ఆజాద్ హింద్ ఫౌజ్ లో చేరి గూఢచారిగా పని చేశాడు. అందుకే, పేరు మార్చుకోవాల్సి వచ్చింది. అయితే, నిజాముద్దీన్ 1945లో బోస్ ను సురక్షితంగా బర్మా బార్డర్ లోదించేసి తిరిగొచ్చాడు. అప్పట్నుంచీ 2017 ఫిబ్రవరీ 6 వరకూ ఉత్తర్ ప్రదేశ్ లోనే జీవించాడు. ఆయన విశ్వాసం ప్రకారం నేతాజీ కూడా గుమ్నామీ బాబాగా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోనే శేష జీవితం గడిపాడు! ఇదంతా మనం ఎంతో కొంత నమ్మితీరాల్సిందే! ఎందుకంటే, నిజాముద్దీన్ నిస్వార్థంగా, నిజాయితీగా బోస్ వెంట నడిచిన స్వాతంత్ర్య సమర యోధుడు. పైగా జన్మతః ముస్లిమ్. ఆయనకు బోస్ ను హిందూ సాధువుగా జీవించాడని చెప్పటంలో ఎలాంటి స్వార్థం వుండే అవకాశం లేదు!

 

నిజాముద్దీన్ జీవిత కాల కోరిక నేతాజీ మరణం చుట్టూ అల్లుకున్న మిస్టరీ పొర తొలిగిపోవాలనీ! నిజం బయటకు రావాలని దురదృష్టవశాత్తూ 117ఏళ్లు జీవించిన నిజాముద్దీన్ తాను కోరిన , నమ్మిన నిజం వెలుగు చూడకుండానే కన్నుమూశాడు!

By
en-us Political News

  
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు.
ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు.
కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నీటి కేటాయింపులు, హక్కులను ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు. మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు. దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.
రెండు ఉప ఎన్నికలలో ఓటమి, తాజాగా పంచాయతీ ఎన్నికలలో పార్టీ పెర్ఫార్మెన్స్ చూడటంతో ఇక తాను రంగంలోకి దిగక తప్పదని భావించినట్లు చెబుతున్నారు.
తెలంగాణ బీజేపీలో అస‌లేం జ‌రుగుతోంది?
ఈ గ్లోబల్ సమ్మిట్ ను తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌ రెండో విజ‌య‌వంత‌మైన ఏడాది ముగింపు ఉత్స‌వంగా చెప్పాలి. అయితే రేవంత్ సర్కార్ దీనిని ఒక గ్లోబ‌ల్ ఇన్వెస్ట్ మెంట్ ఈవెంట్ గా రూపొందించి గొప్పగా నిర్వహించింది. తెలంగాణ‌ను ప్ర‌పంచ రోల్ మోడ‌ల్ గా తీర్చి దిద్దేలా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వహించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.