ఈ రోజుల్లో వాహనాల రొద ఎక్కువైంది. వయసుతో సంబంధం లేకుండా మోటార్ వాహనాలు తెగ వుపయో గిస్తున్నారు. పని వున్నా లేకపోయినా, బడికి వెళ్లే వారూ చిన్నపాటి మోటార్సైకిల్ పైనే వెళుతున్నారు. వేగానికి అతి ప్రాధాన్యతనిస్తున్నారేగాని దాని వల్ల వాతావరణ కాలుష్యానికి అంతే కారకులవుతున్నారన్న ధ్యాస మాత్రం వుండడం లేదు. చాలాకాలం క్రితం మన దేశంలో సైక్లింగ్ కీ ప్రాధాన్యత వుండేది.
కాల క్రమంలో వేగానికి పెద్ద పీట వేయడం జరిగింది. అన్ని పనులు సత్వరం కావాలంటే మోటార్ వాహ నాల ప్రయాణమే సుఖం అన్న అభిప్రాయానికి వచ్చేయడంతో వాటినే ఎక్కడికి వెళ్లాలన్న వుపయోగిం చడం అలవాటైపోయింది. ప్రస్తుతం మన దేశంలో సైక్లింగ్ కేవలం ఆరోగ్య సూత్రాల్లో ఒకటిగా మిగిలి పోయింది. ఇది వూహించని మార్పు.
మనం నెదర్లాండ్స్ ప్రభుత్వాన్ని చూసి ఎంతో నేర్చుకోవాలి. అక్కడ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేవారు సైకిల్ మీద వెళితే కిలోమీటర్కి 15 డాలర్లు ప్రభుత్వం ఇస్తోందిట! దేశంలో సైక్లింగ్కు ప్రాధాన్యతనీయా లని అక్కడ ప్రభుత్వం ఆలోచన చేసింది. అంతేకాక, పర్యావరణ పరిరక్షణకు కాసింత వారివంతు తోడ్ప డటంలో ఇదో మార్గం ఎంచుకుంది. అంటే సైక్లింగ్ ద్వారా అక్కడి వారు వారానికి మన లెక్కల్లో రూ.300 సంపాదించే అవకాశం ప్రభుత్వం కల్పించింది. అది టాక్స్ ఫ్రీ!
సైకిలువాడకం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వొత్తిడిని తగ్గిస్తుంది. నగరాల్లో వాతావరణ కాలుష్యాన్ని బాగా తగ్గిస్తుంది. ఈ కారణాలవల్లనే సైక్లింగ్ను ప్రమోట్ చేస్తున్నామని నెదర్లాండ్స్ ప్రభుత్వ మౌలిక సదుపాయాల మంత్రి వాల్దువెన్ అన్నారు. సైక్లింగ్ను ఉత్సాహపరచడం ద్వారా సంవత్సరానికి వందల యూరోలు మిగులుతాయన్నారు. ప్రభుత్వానికి కూడా ఎంతో మేలు చేసినట్లేనని ఆయన అన్నారు. ప్రభుత్వం ఈ పరమైన గట్టి నిర్ణయాలను అమలు చేయడంలో ప్రజల ఆరోగ్య సంరక్షణ పట్ల వారి వున్న ప్రత్యేక దృష్టిని తెలియజేస్తుంది.
ఇలాంటి ఆలోచనలు మన దేశంలో అమలుచేయడానికి ప్రభుత్వాలకు ఎవరుచెప్పగలుగుతారు. రోజు రోజుకూ పెరిగిపోతున్న కాలుష్యానికి ఫుల్స్టాప్ పెట్టడానికి సైక్లింగ్ విధానాన్ని మన ప్రభుత్వాలూ చేపడితే మేలు. కాలుష్య నివారణ, ప్రమాదాల నివారణకూ సైక్లింగ్ని ఉత్సాహపరచాలి. నెలలో కనీసం కొన్ని రోజులు కార్యాలయాలకు సైకిల్ మీద రావాలని గట్టి నిబంధనను అమలుచేయడానికి పూనుకోవాలి. అపుడు నెదర్లాండ్స్ వలె మన దేశంలోనూ ప్రజారోగ్యం, పర్యావరణపరిరక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ పెరుగు తుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nederlands-encouraging-cycling-39-139131.html
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.