ఆలోచనల్లో ఆకాశం.. ప్రజలతో మమేకం.. నయా చంద్రబాబు

Publish Date:Apr 8, 2025

Advertisement

నాలుగుదశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ఇప్పుడు పూర్తిగా మారిన మనిషి. విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన తరువాత నుంచీ ఆయనలో మారిన మనిషి ప్రస్షుటంగా కనిపిస్తున్నారు. సాంకేతికతను సుపరిపాలనకు కీలక ఇరుసుగా మార్చిన చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. పలువురు జాతీయ నాయకులతో ఆయనకు సన్నిహిత పరిచయాలున్నాయి. ప్రపంచ కుబేరులు, పారిశ్రామిక దిగ్గజాలతో ఆయనకు నేరుగా పరిచయాలు ఉన్నాయి.  

హైదారబాద్ అభివృద్ధి ప్రతి అడుగులోనూ చంద్రబాబు ముద్ర ఉంటుందనడంలో సందేహం లేదు. హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చిన ఘనత కచ్చిదంగా చంద్రబాబుదే. హైటెక్ సిటీ అంటే, అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ చంద్రబాబు నాయుడే గుర్తుకు వస్తారు. ఆ విషయాన్ని ఎవరూ కాదనలేరు. ఆయన ప్రత్యర్థులు సైతం ఆ విషయాన్ని ఎలాంటి సంకోచం, భేషజాలూ లేకుండా అంగీకరిస్తాయి.  రాష్ట్ర విభజన తర్వాత కూడా  తెలంగాణ పెట్టుబడులను ఆకర్షించ గలుగుతోందన్నా, అభివృద్ధిలో దూసుకుపోతున్నదన్నా చంద్రబాబు చలవే, దార్శనికతే కారణం అనడానికి ఎటువంటి సందేహం అవసరం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయనహైదరాబాద్ లోఐటీ రంగ అభివృద్ధి కోసం చేసిన కృషి, చూపిన పట్టుదల పడిన శ్రమ వల్లనే   మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాలు హైదరాబాద్ నగరానికి వచ్చాయి. చంద్రబాబు ముందు చూపు వల్లనే  ఐఎస్‌బీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు హైదరాబాద్ లో కొలువుదీరాయి.

ఈ రోజు  హైదరాబాద్ నగరం ప్రపంచ పటంలో ప్రముఖ స్థానం సంపాదించుకుంది. విశ్వనగరంగా ఎదిగింది. ఎదుగుతోంది అంటే చంద్రబాబు  విజన్ 2020 యే కారణం.  అయితే ఈ క్రమంలో ఆయన ఒక రాజకీయ నాయకుడిగా కంటే.. అభివృద్ధి దార్శనికుడిగానే వ్యవహరించారు. దాంతో రాజకీయంగా ఒకింత నష్టపోయిన సంగతి ఎవరూ కాదనలేరు. హైటెక్ సీఎం అన్నది ఆయనకు ఒక పొగడ్త, ప్రశంసగానే కాకుండా విమర్శగా కూడా మారింది. చంద్రబాబు అంటే ఎప్పుడూ ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం ఆలోచిస్తారు. అందుకోసం కార్యాచరణ రూపకల్పన చేస్తారు. అమలు చేస్తారు. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అనే అంటారు. ప్రజలతో మమేకం కారన్న అపప్రధ అయనపై ఉంది. కార్యర్తలకు, పార్టీ నేతలకు పెద్దగా సమయం ఇవ్వరనీ, ఆయన దృష్టంతా పెట్టుబడుల ఆకర్షణ, అభివృద్ధిపైనే ఉంటుందని పార్టీ శ్రేణులే చెబుతుంటాయి. ఈ క్రమంలో పార్టీకీ, ప్రభుత్వానికి మధ్య అగాధం ఏర్పడి రాజకీయంగా నష్టం జరిగిన సందర్భాలు గతంలో ఉన్నాయి.

అయితే విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన మారారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, దార్శనికత ఉన్న ఆయన ఎటువంటి సంకోచం లేకుండా ప్రజలతో మమేకం అవుతున్నారు. పేదల ఇళ్లలోకి నేరుగా వెళ్లి వాళ్లకు తానే స్వయంగా టీ పెట్టి తన స్వహస్తాలతో అంది స్తున్నారు. ఇంత కాలం ప్రజలను కలవకుండా వారి బాగు, ప్రగతి కోసమే పరితపించిన చంద్ర బాబు ఇప్పుడు వారి బాగోగులను స్వయంగా పట్టించుకోవడమే కాకుండా వారితో మమేకమౌతున్నారు. ఈ మార్పు చంద్రబాబును ప్రజలకు మరింత చేరువ చేస్తున్నదనడంలో సందేహం లేదు. ఇది తెలు గుదేశం పార్టీకి కూడా ఒక సానుకూల అంశంగా మారుతున్నది. గతంలో చంద్రబాబు ఎంత ప్రజలకు ఇంకా ఏంచేయగలం అన్న ప్రణాళికలు రూపొందిస్తూ, అధికారులతో సమీక్షలతో బిజీబిజీగా ఉంటూ జనానికి అందుబాటులోకి వచ్చే వారు కాదు. ఆ కారణంగానే ప్రభుత్వం, పార్టీ మధ్య గ్యాప్ వచ్చింది. ప్రత్యర్థులకు విమర్శించే అవకాశం ఇచ్చింది.

ఇప్పుడు బాబు పూర్తిగా మారి.. ఒకే సమయంలో ప్రగతి పథక రచనలు, ప్రజలతో మమేకమవ్వడానికి సమయం కేటాయించడం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు పార్టీ, ప్రభుత్వం మధ్య గ్యాప్ వచ్చే అవకాశాలు లేకుండా పోవడమే కాకుండా ప్రజలతో  చంద్రబాబు మమేకం కావడం వల్ల పార్టీ మరింత బలోపేతం అవుతుందని పరిశీలకులు అంటున్నారు.  

By
en-us Political News

  
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.