కృతజ్ణతా ప్రదర్శనను నిరసన ర్యాలీగా వక్రీకరించిన వైసీపీ.!
Publish Date:Jul 28, 2026
Advertisement
వైసీపీ ఫేక్ ప్రచారానికి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై విష ప్రమారం చేస్తూ ప్రజలను తప్పదొవ పట్టించేలా అసత్య ప్రచారాలకు పాల్పడుతోందని మండిపడిన లోకేష్.. తాజాగా పెనమలూరులో తల్లికి వందనం పథకాన్ని స్వాగతిస్తూ అంగన్ వాడీలు చేపట్టిన కృతజ్ణతా ర్యాలీని వైపీపీ ఎలా వక్రీకరించిందో.. వివరించారు. వివరాల్లోకి వెడితే.. ఇటీవల రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంలో భారీ సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఆ ప్రదర్ననను వైసీపీ అనుకూల సోషల్ మీడియా, మంత్రి లోకేష్ పర్యటనను నిరసిస్తూ అంగన్వాడీలు ఆందోళనకు దిగారంటూ వక్రీకరించాయి. దీనిపై మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. అసలు నిజాలను వెల్లడిస్తూ, వైకాపా ప్రచారంలోని డొల్ల తనాన్ని సాక్ష్యాధారా పెనమలూరులో అంగన్వాడీలు నిర్వహించినది నిరసన ర్యాలీ కాదనీ, అది కృతజ్ణతా ప్రదర్శన అని లోకేష్ స్పష్టం చేశారు. వైకాపా హయాంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసిందనీ, కనీసం అమ్మఒడి పథకాన్ని కూడా వారికి వర్తింపజేయకుండా తీవ్ర అన్యాయం చేసిందనీ గుర్తుచేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని, వారికి తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుందని లోకేష్ వివరించారు. ప్రభుత్వం చూపిన ఈ చొరవకు లబ్ధిదారులుగా ఉన్న అంగన్వాడీలు సంతోషం వ్యక్తం చేస్తూ, పెనమలూరు పర్యటనలో తనకు ధన్యవాదాలు తెలిపేందుకే పెద్ద ఎత్తున తరలివచ్చారని వివరంచారు. వాస్తవానికి అక్కడ జరిగింది కృతజ్ఞత సభ అని, కానీ దానిని నిరసనగా చిత్రీకరించేందుకు ప్రతిపక్షం కుట్ర పన్నిందని ఆయన విమర్శించారు. బాబాయ్ పై గొడ్డలిపోటును గుండెపోటుగా చిత్రీకరించి ప్రజలను నమ్మించిన చరిత్ర ఆ పార్టీదని విమర్శించారు. అదే తీరులో ఇప్పుడు తమకు అనుకూలంగా వచ్చిన జనసందోహాన్ని, కృతజ్ఞతా ప్రదర్శనలను కూడా నిరసనలుగా మార్చి చూపించేందుకు పాల్పడుతున్నదని విమర్శించారు. నెట్టింట వైరల్ అవుతున్న ఫేక్ చిత్రాలను, అసలైన దృశ్యాలను పక్కపక్కనే ఉంచి ఆధారాలతో సహా వాస్తవాన్ని కళ్లకు కట్టారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయినప్పటి నుంచి వైకాపా శ్రేణులు కల్పిత వార్తలు, వక్రీకరించిన వీడియోలతో ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయన్నలోకేష్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలకు వస్తున్న ఆదరణను తట్టుకోలేకనే ఇటువంటి దుష్ప్రచారాలకు ఒడిగడుతున్నారని విమర్శించారు. YSRCP Fake News, Penamaluru Anganwadi Rally, Thalliki Vandanam Scheme, AP Political News
http://www.teluguone.com/news/content/nara-lokesh-fire-on-ycp-for-fake-propaganda-39-227353.html





