కాలాతీతుడు.. కారణ జన్ముడు.. నారా చంద్రబాబునాయుడు!

Publish Date:Apr 19, 2025

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నార చంద్రబాబు నాయుడు 75 జన్మ దినం ఆదివారం (ఏప్రిల్20).  ఈ సందర్భంగా, వారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ..అందిస్తున్న అభినందన అక్షరమాల .. 
 
నారా చంద్రబాబు నాయుడు.. కాలాతీతుడు, కారణ జన్ముడు. అవును. వయసు ముందుకు వెళ్ళే కొద్దీ, భారంగా మారుతుంది. వయసు భారం పెరుగుతుంది. ముఖ్యంగా, సప్త పదులు దాటి, వృధ్యాప్యంలో అడుగు పెట్టిన తర్వాత ప్రతి అడుగూ భారంగానే పడుతుంది. సహజంగానే  అడుగులు తడబడతాయి, ఆలోచనలు మందగిస్తాయి. కదులుతున్న కాలంతో కదలలేని నిరాసక్త కృంగదీస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, జీవితం చలన రహితంగా,నిశ్చలన చిత్రంగా నిలిచిపోతుంది.  అవును. ఇది నిజం.  సర్వ సాధారణ ప్రకృతి ధర్మం. 

కానీ.. కొందరుంటారు, ఏదో ఒక పవిత్ర కార్యాన్ని నెరవేర్చేందుకు జన్మించిన కాలాతీత వ్యక్తులు, కారణ జన్ములు.  ఎక్కడో కోటికొక్కరు ఉంటారు. అలాంటి కారణ జన్ములకు వయసుతో సంబంధం ఉండదు. వయసు అడ్డురాదు. కాలంతో సంబంధం ఉండదు. కార్యమే ప్రధానంగా సాగిపోతూనే ఉంటారు. కార్యసిద్దే లక్ష్యంగా ముందుకు సాగుతుంటారు. అలాంటి కారణజన్ములను, ఆవరోధాలు అడ్డుకోలేవు. వాటినే వారు  అవకాశాలుగా మలచుకుంటారు. వివేచనతో  అవరోధాలను అధిగమిస్తూ ముందుకు  సాగుతూనే ఉంటారు.   

అదిగో అలాంటి కారణజన్ముల్లో, అలాంటి కాలాతీత వ్యక్తుల్లో  ఈరోజు (ఏప్రిల్ 20) 75వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న  తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు  ఒకరు. ఒకరు కాదు. ఒకే ఒక్కరు. అవును ఈ వయసులోనూ అలుపూ సొలుపూ లేకుండా పగలూ రాత్రీ తేడా లేకుండా ప్రజల కోసం పని చేయడం ఆయనకు తప్ప మరొకరికి సాధ్యం కాదు. అందుకే  చంద్రబాబు ఒకే ఒక్కరు. ఆయనలాంటి ఇంకొకరు ఉండరు.  

అవును  75 సంవత్సరాల వయసులో, ఒకటీ రెండు కాదు, ఏకంగా వంద మెట్లు సునాయాసంగా ఎవరు ఎక్కగలరు. వయసును జయించిన చంద్రబాబు  తప్ప. మెట్లు ఎక్కడమే కాదు నిటారు నిలబడి బాధ్యతల బరువులు మోయగల సామర్ధ్యం కూడా ఒక్క చంద్రబాబుకే సాధ్యం. ఇది చరిత్ర చెప్పిన సత్యం. చారిత్రక వాస్తఃవం. అదొక్కటే కాదు, చంద్రబాబాబు, ‘పుస్తకం’ తెరిస్తే.. ఇలాంటి రికార్డ్స్  ఇంకా ఎన్నో కనిపిస్తాయి. ఎవరి  ఆసరా అవసరం లేకుండా,(అవును,ఆయనే ఎందరికో ఆసరా కదా)  ప్రచార రథం మెట్లు చకచా ఎక్కేస్తారు. ఎక్కడా తడబడకుండా,తొట్రుపాటు లేకుండా అలా నిలబడే అనర్గళంగా, అద్భుతంగా. సుదీర్గ ప్రసంగం చేస్తారు.. చప్పట్లు కొట్టించుకుంటారు. 

చంద్రబాబు నాయుడు కారణజన్ముడు మాత్రమే కాదు. కాలాన్ని జయించిన కాలాతీతుడు. అందుకే  47 డిగ్రీల మండు టెండలో అయినా, గజగజ లాడించే తుపాను గాలుల్లో అయినా ప్రజాబలంతో పనిచేసే, ఒకే  ఒక్కడు. చంద్ర బాబు నాయుడు రోజుకు 20 గంటల చొప్పున ఏడాది పొడవునా అంటే  365 రోజులూ పని చేసే ఏకైక నాయకుడు. చంద్రబాబుకు  పని రాక్షసుడు’ అనే పేరు ఎప్పుడో  వుంది. అలాగే  పరిపాలనలో ఆయనకు ఆయనే సాటి. ప్రభుత్వ శాఖలన్నిటిపైనా  పట్టున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సుదీర్గ అనుభంలో అన్ని ప్రభుత్వ శాఖలను అవపోసన పట్టిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.ఇన్ని మాటలు ఎందుకు.. తెలుగు ప్రజలకు దేవుడిచ్చిన వరం నారా చంద్రబాబు నాయుడు. ఆయన జీవితం.. ఈ తరానికే కాదు, ముందు తరాలకు కూడా ఒక పాఠ్య పుస్తకం. అందరం చదువుకుందాం.అందరం నేర్చుకుందాం. 
మరొక్క మారు చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు..

By
en-us Political News

  
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు. తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.