జగన్ తో ముకేష్ అంబానీ భేటీ.. అజెండా ఇదేనా!

Publish Date:Feb 29, 2020

Advertisement

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఇవాళ అమరావతికి వచ్చారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన ముకేష్... సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ముకేష్ తో పాటు ఆయన కుమారుడు అనంత్ అంబానీ, రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీ కూడా జగన్ తో భేటీ అయ్యారు. ఏపీలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ముకేష్, జగన్ భేటీలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రధానంగా తిరుపతిలో రిలయన్స్ సంస్ధ నిర్మించ తలపెట్టిన 15 వేల కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ తరలిపోతుందన్న ప్రచారం మధ్య అంబానీ- జగన్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కొత్త పారిశ్రామిక విధానం అమల్లోకి రానున్న తరుణంలో వీరిద్దరి భేటీలో ఈ ప్రాజెక్టు భవిష్యత్తుతో పాటు మరికొన్ని కొత్త ప్రాజెక్టులపై చర్చ జరిగే అవకాశముంది.

మరోవైపు సుదూర తీర ప్రాంతం ఉన్న ఏపీ రిలయన్స్ పలు చోట్ల చమురు వెలికితీత చేపడుతోంది. ముఖ్యంగా కేజీ బేసిన్ లో రిలయన్స్ గ్యాస్, చమురు నిక్షేపాలను వెలికితీస్తోంది. వీటిని ఏపీకి కాకుండా గుజరాత్ తో పాటు ఇతర రాష్ట్రాలకు పైప్ లైన్ ద్వారా తరలిస్తోంది. ఇందులో ఏపీకి కూడా వాటా ఇవ్వాలని జగన్ తండ్రి వైఎస్ కూడా గతంలో పట్టుబట్టారు. ఇప్పుడు జగన్ కూడా రిలయన్స్ అధినేతను ఈ మేరకు కోరే అవకాశాలూ లేకపోలేదు.

మరోవైపు జగన్ అధికారం చేపట్టిన తర్వాత ఏపీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ పర్యటించడం ఇదే తొలిసారి. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పలుమార్లు అంబానీ అమరావతికి వచ్చి అప్పటి సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. అప్పట్లో చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలో అంబానీ జగన్ తో భేటీ ఉంటారనే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో విద్యుత్ ఉత్పాదక రంగంలోనూ రిలయన్స్ రాష్ట్రంలో చురుగ్గా పనిచేస్తోంది. రియలన్స్ పవర్ కు చెందిన పలు ధర్మల్ ప్లాంట్ల నుంచి జెన్ కో ఇప్పటికే విద్యుత్ ను తీసుకుంటోంది. వీటి విస్తరణకు కూడా అంబానీ-జగన్ భేటీలో చర్చించి ఉండొచ్చని చెబుతున్నారు.

By
en-us Political News

  
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.