మరో సారి ముద్రగడ.. జగన్ భజన

Publish Date:Apr 14, 2025

Advertisement

స్వయం ప్రకటిత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అలియాస్ ముద్రగడ పద్మనాభ రెడ్డి తన స్థాయిని, తన ప్రతిష్టనూ తనే దిగజార్చుకుంటున్నారు. కాపు ఉద్యమ నేతగా ముద్రగడకు గతంలో మంచి ప్రాధాన్యతే ఉండేది. కాపులకు రిజర్వేషన్ అంటే ఆయన చేసిన ఉదమ్యాలు, ఉత్తర కంచి సంఘటనలతో కాపు సామాజిక వర్గంలో ముద్రగడ తిరుగులేని నేతగా నిలిచారు. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల కోసం ఆయ‌న ఉద్య‌మించిన స‌మ‌యంలో ల‌క్ష‌లాదిగా యువత ఆయ‌న వెంట న‌డిచారు. అయితే అదంతా గతం. ఇప్పుడు ఆయనను కాపు సామాజికవర్గం తమ నేతగా అంగీకరించే పరిస్థితి లేదు. ఇది నిస్సందేహంగా ఆయన స్వయంకృతాపరాథమే అని చెప్పక తప్పదు.

ఎందుకంటే.. 2019 ఎన్నికలకు ముందు    కాపు  రిజర్వేష‌న్లకు సుముఖంగా ఉన్న చంద్ర‌బాబును కాదని.. ఆ ప్ర‌తిపాద‌న‌కు నో చెప్పిన జ‌గ‌న్ కు ముద్ర‌గ‌డ‌ మద్దతు ఇచ్చారు. ఇక జగన్ 2019 ఎన్నికలలో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత కాపు రిజర్వేషన్లు అయ్యే పని కాదని కుండబద్దలు కొట్టేసి, అంతకు ముందు చంద్రబాబు సర్కార్ ప్రతిపాదనలను పక్కన పెట్టేశారు. దీంతో కాపు సామాజిక వర్గంలో ముద్రగడపై వ్యతిరేకత వెల్లువెత్తింది.   

వాస్తవానికి ముద్రగడ పద్మనాభం 2014-19 మధ్యలో కాపు రిజర్వేషన్ల ఉద్యమం అంటూ గొంతెత్తడానికి కారణం చంద్రబాబు సర్కార్ ను ఇబ్బందుల్లోకి నెట్టడానికేనని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. కాపు సామాజిక వర్గాన్ని తెలుగుదేశం పార్టీకి దూరం చేయడమే లక్ష్యంగా ముద్రగడ  2104-19 మధ్య కాలంలో కాపు రిజర్వేషన్ నినాదాన్ని ఎత్తుకున్నారంటారు.   అయితే అప్పట్లో చంద్రబాబు ఈడబ్ల్యుఎస్ కోటాలో కాపులకు 5శాతం రిజర్వేషన్లు కల్పించినా ముద్రగడ దానిని స్వాగతించలేదు. కాపు సామాజిక వర్గానికి మేలు చేసే ఆ నిర్ణయాన్ని ముద్రగడ వ్యతిరేకించడానికి కారణం చంద్రబాబు పట్ల అయిష్టతేననీ, అహంకారం వినా ముద్రగడకు కాపు సామాజిక వర్గంపై అభిమానం లేదనీ, వారి ప్రయోజనాలు పట్టవనీ, అప్పట్లోనే విమర్శలు వచ్చాయి.

ఇక 2019 ఎన్నికలలో విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రిగా పదవీ పగ్టాలు చేపట్టిన తరువాత కాపు లకు 5శాతం కోటాను రద్దు చేశారు. అప్పుడు కూడా జగన్ ను విమర్శిస్తూ ముద్రగడ నోటి వెంట ఒక్కటంటే ఒక్క మాట రాలేదు. అంతే కాదు జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ ముద్రగడ నోటి వెంట కాపు రిజర్వేషన్ ఉద్యమం గురించి మరిచిపోయారు.  కాపు రిజర్వేషన్ అంశాన్ని పక్కన పెట్టేయడంతో సరిపెట్టుకోకుండా ముద్రగడ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై గుడ్డి వ్యతిరేకత పెంచుకున్నారు. కాపు సామాజిక వర్గం నుంచి తాను తప్ప మరో నాయకుడు ఉండకూడదన్న దుగ్థ, అసూయ కారణంగానే ముద్రగడ పవన్ ను వ్యతిరేకించారని కాపు సామాజికవర్గం నుంచే విమర్శలు వెల్లువెత్తాయి. ఆ కారణంగానే పవన్ పై ఇష్టారీతిగా విమర్శలు గుప్పించిన ముద్రగడ సరిగ్గా 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు.  అయితే ముద్రగడకు వైసీపీలో ఎలాంటి గౌరవం లభించలేదు. అసలు ఈ మధ్య కాలంలో ముద్రగడకు జగన్ దర్శన భాగ్యమే దొరకలేదని చెప్పొచ్చు. అయినా ముద్రగడ నోటి వెంట జగన్ కు వ్యతిరేకంగా ఒక్కటంటే ఒక్క మాట రాలేదు. 

అటువంటి ముద్రగడ ఇప్పుడు జగన్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కారణమేంటంటే.. వైసీపీ అధినేత జగన్ తాజాగా 33 మంది సభ్యులతో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీని నియమించారు. ఆ 33 మందిలో ముద్రగడ పేరు కూడా ఉంది. ఇంతకీ ఈ వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ పనేమిటి?  అంటే.. రాష్ట్ర రాజకీయపరిస్థితులపై చర్చించి.. జగన్ కు అవసరమైన సలహాలు ఇవ్వడం. ఈ కమిటీకి సజ్జల కన్వీనర్ గా ఉన్నారు.  ఆ 33 మంది సభ్యుల కమిటీలో తనను ఒకరిగా చేర్చినందుకే ముద్రగడ తన జన్మధన్యమైపోయిందన్నంతగా ఆనందపడిపోతున్నారు.  వాస్తవానికి వైసీపీలో నిర్ణయాలన్నీ జగన్ ఆయన కోటరీ మాత్రమే తీసుకుంటారన్నది అందరికీ తెలిసిందే. అందుకే వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ నామ్ కే వాస్తే అన్న విషయం ఆ పార్టీ వర్గాలే  చెబుతున్నాయి. అటువంటి నామ్ కే వాస్తే కమిటీలో ఓ సభ్యుడిగా తనను చేర్చినందుకే  బ్రహ్మానందపడిపోతున్నారు. తనకు పార్టీ రాజకీయ వ్యవహారల కమిటీలో స్థానం కల్పించినందుకు జగన్ కు కృతజ్ణతలు చెబుతూ ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు.

  జగన్ మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపడతారని, జగన్ సీఎం కావడానికి తన శక్తి మేరకు తాను పోరాడతాననీ ముద్రగడ పేర్కొన్నారు. ఇక ఇప్పుడు విషయానికి వస్తే గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇక ముద్రగడ పిఠాపురంలో పవన్ కల్యాణ్ ను ఓడించడమే తన ధ్యేయమన్నారు. కానీ జరిగిందేమిటి? 90 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి విజయం సాధించారు. అంటే జిల్లాలో ముద్రగడకు ఉన్న పలుకుబడి ఏమిటి? ఎంత అన్నది తేలిపోయిందని, కాపు సామాజిక వర్గం ముద్రగడను నమ్మడం లేదనడానికి ఇదే నిదర్శనమని అంటున్నారు.  పిఠాపురంను పక్కన పెడితే 2024 ఎన్నికల్లో ముద్రగడ సొంత నియోజకవర్గం జగ్గంపేటలో తెలుగుదేశం అభ్యర్థి 52 వేల 675 ఓట్ల ఆధిక్యతతో భారీ విజయం సాధించారు. అంత దాకా ఎందుకు 1999 నుంచి ముద్రగడ ఒక్కటంటే ఒక్క ఎన్నికలో కూడా విజయం సాధించలేదు. ముద్రగడ చివరి సారిగా  2014 ఎన్నికలలో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఘోరంగా కనీసం డిపాజిట్ కూడా రాకుండా పరాజయం పాలయ్యారు. ఇప్పుడు జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి పోరాడుతానంటూ గంభీర ప్రకటనలు చేయడం ద్వారా తన ప్రతిష్టను తానే మరింత దిగజార్చుకోవడమే కాకుండా నవ్వుల పాలౌతున్నారు. 

By
en-us Political News

  
భారతీయ జనతా పార్టీలో ఏమి జరగుతోంది? జాతీయ అధ్యక్షుని ఎన్నికలో ఎందుకు ఇంత జాప్యం జరుగుతోంది? తెలంగాణ సహా అనేక ఇతర రాష్ట్రల్లో రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక ఎందుకు ముడిపడడం లేదు? అందుకు పార్టీ నేతలు చెపుతున్న కారణాలేనా లేక ఇంకా లోతైన కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే, కమల దళంలో జరుగతున్న పరిణామాల వెనక లోతైన కారణాలే ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారంగా తెలుస్తోంది.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అంటే కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీకి ఉన్న అభిప్రాయం ఏమిటో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఒకటి రెండు సార్లు కాదు.. వందల సార్లు రాహుల్ గాంధీ ఐ హేట్ ఆర్ఎస్ఎస్ అని చాలా స్పష్టంగా చెప్పారు. ఆఫ్కోర్స్, ఆయన అవే పదాలను, అదే క్రమంలో అని ఉండక పోవచ్చును, కానీ ఎప్పుడు ఎక్కడ, ఎలాంటి సందర్భంలో ఆర్ఎస్ఎస్ ప్రస్తావన వచ్చినా.. రాహుల్ గాంధీ తన వ్యతిరేకతను, ద్వేషాన్నీ ఎప్పుడూ దాచుకోలేదు.
ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును ఏపీ సీఐడీ అరెస్టు చేసింది. ముంబై నటి జత్వానీ కేసులో ఏపీ సీఐడీ అధికారులు ఆయనను హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. బేగంపేటలోని ఆయన నివాసంలో అదుపులోనికి తీసుకుని విజయవాడకు తరలించారు. ప్రస్తుతం సస్సెన్షన్ లో ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు జగన్‌ హయాంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే.
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ విషయంలో నగదు లావాదేవీల వ్యవహారంలో ఈ నెల 27న విచారణకు రావాల్సిందిగా ఆ నోటీసులలో పేర్కొంది.
ఓ వైపు తిరుమల కొండపై భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మరో వైపు శ్రీవారి మెట్ల నడకమార్గంలో భక్తులు పొటెత్తుతున్నారు. ఇదే అదునుగా భక్తులను ఆటోవాలాలు నిలువుదోపిడీ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెడిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ(ఏపీఎస్ డబ్ల్యేఆర్ఇఐఎస్) సెక్రటరీ, ఐఏఎస్ అధికారి ప్రసన్న వెంకటేణ్ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి పురస్కారాన్ని అందుకున్నారు. 2023 సంవత్సరానికి సంబంధించి ఈ పురస్కారాన్ని ఆయన ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా అందుకున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం (ఏప్రిల్ 22)ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఒక కంపార్ట్ మెంట్ లో వేచి ఉన్నారు.
500 రూపాయల నోట్లపై కేంద్ర హోంశాఖ సంచలన ప్రకటన చేసింది. నకిలీ నోట్ల విషయంలో ఎన్ఐఏ, డీఆర్ఐ, సీబీఐ, సెబీ సహా అనేక శాఖలను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది. నకిలీ నోట్లకు ఒరిజినల్ నోట్లకు తేడా అస్సలు గుర్తించ లేకుండా ఉన్నాయనీ, అప్రమత్తంగా ఉండానీ ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ మద్యం లిక్కర్ కుంభకోణం కేసులో సోమవారం అత్యంత కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసులో, ఇప్పటికి నాలుగు సార్లు నోటీసులు అందుకుని కూడా సిట్ విచారణకు గైర్హాజరై తప్పించుకు తిరుగుతున్న రాజ్ కసిరెడ్డిని ఏపీ పోలీసులు సోమవారం (ఏప్రిల్ 21) అరెస్టు చేశారు.
పోలీసు సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారంటూ నమోదైన కేసులో వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు గుంటూరు కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసు విచారణ నిమిత్తం ఆయన్ను రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ గుంటూరు మొబైల్ కోర్టు మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో మాధవ్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది.ఏప్రిల్ 23, 24 తేదీల్లో రెండు రోజుల పాటు మాధవ్‌ను పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు మొబైల్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ రెండు రోజుల పాటు గుంటూరు పోలీసులు గోరంట్ల మాధవ్‌ను అదుపులోకి తీసుకుని, కేసు వివరాలపై లోతుగా విచారించనున్నారు.
ఏపీ గ్రూప్-1 మెయిన్స్ రాత పరీక్షకు ఏపీపీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది. మే 3 నుంచి 9 వరకు మెయిన్స్ నిర్వహించనున్నారు. ఈ పరీక్షల కోసం రాష్ట్రంలోని 4 జిల్లా కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఏపీపీఎస్సీ పేర్కొన్నాది. అన్ని పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగుతుందని తెలిపింది. వీటికి సంబంధించిన హాల్ టికెట్లను httpps://psc.ap.gov.in అధికారిక వెబ్సైట్ లో నేటి నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చని ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఏపీలో మొత్తం 81 గ్రూప్‌ -1 పోస్టుల భర్తీకి గతేడాది మార్చి 17న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డిని ఏపీ సిట్ పోలీసులు శంషాబాద్ ఎయిర్‌‌ఫోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఆయన దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం. తాను రేపు విచారణకు హాజరవుతానని వారికి ఆయన తెలిపారు. అయితే, హాజరవుతారో లేదోనని అనుమానంగా ఉందని, తమ వెంట రావాల్సిందేనని అక్కడి నుంచి పోలీసులు తీసుకెళ్లిపోయారు. మరికాసేపట్లో అతడిని విజయవాడ తరలించనున్నారు. మరోవైపు ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ గతంలో రాజ్‌ కసిరెడ్డి, హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు.
బంగారం ప్రియులకు ఇది షాకింగ్ న్యూస్. ఇక పసిడి కోనుగోలు చేయాలంటే సామాన్య ప్రజలకు మరింత కష్టతరం అవుతోంది. రోజురోజుకి గోల్డ్ రేటు అకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా బంగారం ధరకి మరోసారి రెక్కలు వచ్చాయి. 10 గ్రాముల బంగారం ధర పన్నులతో కలిసి అక్షరాల లక్ష రూపాయిలను తాకింది. దేశంలో బంగారం ధర ఈ స్థాయిని అందుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సోమవారం ఉదయం రూ.98,350 ఉన్న24 క్యారెట్ల గోల్డ్ తులం రేటు సాయంత్రం 5.30 గంటల సమయానికి రూ.1,00,016కు చేరింది. శుక్రవారం ముగింపుతో పోలిస్తే దాదాపు రూ.2వేలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు 3,393 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా- చైనాల మధ్య వాణిజ్యం విషయంలో సయోధ్య కుదిరేంతవరకు ఇదే పరిస్థితి కొనసాగొచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.