Publish Date:Jun 20, 2022
ఈ రోజుల్లో చాలామంది యువతీ యువకులు చదువుకోవడానికి వీలుగా, కాలేజీలకు దగ్గరి ప్రాంతాల్లో అద్దె ఇళ్లల్లో వుండడం పరిపాటి. కుంటుంబాలు కూడా తమ పిల్లలకు రవాణా ఇబ్బందులు లేకుండా వుండేం దుకు సాధ్యమయినంతవరకూ కాలేజీలకు, స్కూళ్లకు దగ్గరి ప్రాంతాల్లోనూ అద్దె ఇళ్లలో వుంటున్నారు. ఇది ప్రతీ పట్టణంలోనూ సాధారణంగా కనిపించే సీన్. చదువు అయి వెళ్లేటపుడో, పోనీ వేరే ప్రాంతానికి వెళ్లవలసినపుడో ఆ ఇంటి యజమానికి చెల్లించవలసిన అద్దె, కరెంటు బిల్లు ఏమన్నా వుంటే పూర్తిగా చెల్లించి మరీ వెళతారు. ఆంధ్రా తెలంగాణా విడిపోయిన తర్వాత ఆంధ్రా ప్రాంతంలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు అద్దె ఇళ్లలో వున్నాయి. స్వంత భవనాలు ఇంకా లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఇంకా కొన సాగుతోంది.
అలా వున్నదే నంద్యాల జిల్లా పాములపాడులోని ఎమ్మార్వో కార్యాలయం. దీన్ని గురించి ప్రత్యేక ప్రస్థా వన దేనికంటే .. ఈ కార్యాలయానికి కొత్త భవనం ఏర్పాటయింది. కానీ కార్యాలయం వస్తువులు, ఫైళ్లు ఫర్నీచర్ మాత్రం అక్కడికి మార్చే పరిస్థితి లేకుండా పోయింది. కారణం ఇప్పటి వరకూ అద్దెకున్న భవ నానికి ప్రభుత్వం అద్దె కట్టలేదట! మరి అద్దె కట్టకుంటే యజమాని కాగితం కదలనిస్తాడా? మరి ప్రభు త్వం ఈ సాధారణ నియమాన్ని నిర్లక్ష్యం చేయడమేమిటి?
పాములపాడులో ఎమ్మార్వో కార్యాలయం వున్న భవనానికి ఇంతవరకూ అద్దే చెల్లించలేదట. ప్రభుత్వం ఏర్పాటయిన సుమారు నాలుగేళ్ల నుంచి ఆ భవనానికి అద్దెగా ఒక్క పైసా ఇవ్వలేదని భవనం యజమాని ప్రశాంత్ ఆరోపిస్తున్నాడు. ఆయనకు రూ.3,65,868 రూపాయలు చెల్లించాలి. ఆ మొత్తం చెల్లిస్తేనే ఇక్కడ నుంచి వస్తువులు బయటికి వెళతాయని తెగేసి చెప్పేడు. అంతేకాదు భవనానికి ఏకంగా తాళం వేసేసేడు. ఈ రహస్యమేమీ తెలియని ప్రజలు ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి అక్కడ తాళం వేసి వుండడం చూసి ఖంగారు పడ్డారు. జగన్ పాలనలో ఇలాంటి కామెడీలు కూడా జరుగుతున్నాయన్నది వారికి తెలియడానికి చాలా సమయమే పట్టింది!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mro-office-locked-for-not-paying-rent-25-138031.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్కు, మీమ్స్కు కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!
తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నోటికి హద్దూ పద్దూ లేదన్నట్లుగా, జనసేనాని పవన్ కల్యాణ్, తెలుగుదేశం నేతలపై అనుచిత వ్యాఖ్యలతో దువ్వాడ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ అనుచిత వ్యాఖ్యలపై దువ్వాడ శ్రీనివాస్ పై కొత్తూరు పోలీస్ స్టేషన్లో నమోదైన ఒక కేసుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్.. పోలీసు స్టేషన్ కు చేరకుండానే మిస్సయ్యారు.
దేశంలో నిష్పాక్షికంగా ఎన్నికలు జరగాలంటే న్యాయవ్యవస్థ జోక్యం అనివార్యమని పేర్కొన్నాయి. ఈ లేఖపై ఇండియా కూటమికి చెందిన 23 పార్టీల నాయకులు సంతకాలు చేశారు.
దీంతో తిరుచిరాపల్లి నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానం నుంచి విజయ్ కు సన్నిహితుడు, సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత కూడా అయిన రాఘవ లారెన్స్ టీవీకే అభ్యర్థిగా పోటీ చేస్తారని గత కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
Publish Date:Jun 30, 2026
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఒకే రోజున విడుదలైతే.. ఆ రెండింటిలో మీరు ముందుగా ఏ సినిమా అంటే ఎవరి సినిమా చూస్తారన్న ప్రశ్నకు.. లోకేష్ చాకచక్యంగా ఇద్దరి సినిమాలనూ ఒకే రోజు చూస్తానని బదులిచ్చారు.