విదేశాల్లో చదువుకున్న వ్యక్తి వచ్చి ఒక్కడో అమ్మాయిని ప్రేమించి పెళ్లాడతాడు. ఆనక ఓ కోటీశ్వరుడి కూతురు ప్రేమలో పడి ఆమెను పెళ్లాడబోతాడు.. మొదటి భార్య ఏడాది బిడ్డతో వచ్చి రామూ.. ఎందుకు ఇంత ద్రోహం చేశావ్.. అంటూ కొంగు, పిల్లాడి తలని తడిపేస్తూ ఏడిచి భారీ డైలాగు చెబుతుంది.. తర్వాత సంగతి వేరే.. ఇది దాదాపు పాత సినిమాల్లో చాలావాటిల్లో సీన్. ఇదే సీన్ నిజ జీవితంలోనూ జరిగితే.. అమ్మో!
అవకాశం లేకపోలేదు. ఉత్తరప్రదేశ్ లో ఒక పట్టణంలో ఇదే సీన్ జరిగింది. కాబోతే సదరు హీరోగారు అంతకు ముందే నాలుగు పెళ్లిళ్లు చేసుకుని, ఏడుగురు పిల్లల తండ్రి! జరిగేది ఐదో పెళ్లి. అయితే ఈ నిత్యపెళ్లి కొడుకు 55 ఏళ్లవాడు. విదేశీయుడూ కాదు, పక్కా లోకల్! పెళ్లి పిచ్చి ఉండాలేగాని ఇలాంటి దొంగపెళ్లిళ్లు చేసుకోవడానికి ఏదో ఒక దొంగ మార్గాన్ని ఇలాంటివారు వెతుకుతూనే ఉంటారు. కాబోతే, ఇలాంటివారికి దొరికే అమ్మాయిలే అమాయకులు. అమ్మాయి తల్లిదండ్రులకు ఏమాత్రం అనుమానం రాకుండా అతగాడు వ్యవహరించే ఉంటాడు. అయినా కనీస వివరాలు సేకరించకుండా పెళ్లికి సిద్ధప డటం పెద్ద ముప్పు తప్పిం చిందని ఆనక అనుకున్నారు.
నిత్యపెళ్లి కొడుకుకి నాలుగు పెళ్లిళ్లు అయ్యాయి, ఇద్దరు విడాకులిచ్చి వెళిపోయారు. మరో ఇద్దరు రహ స్యం గానే పెళ్లి చేసుకున్నారు. రెండో భార్యకి ఏడుగురు పిల్లలు. హీరోగారు ఏం చేస్తుంటాడో ఆమెకు అంతగా తెలియదనే అనుకోవాలి. ఇతగాడు బహుశా అమ్మాయిల వేటనే వృత్తిగా చేసుకున్నాడేమో. మొత్తానికి అతనికి మరో అమ్మాయి వలలో పడింది. పెళ్లికి సిద్ధపడింది. పెళ్లిపీటలు ఎక్కారు. మరో కొద్ధిసేపట్లో తాళి కట్టాలి.
అంతలో సినిమాటిక్గా మిస్టర్ నిత్య పెళ్లికొడుకు రెండో భార్య ఏడుగురు పిల్లలతో సహా వచ్చింది. వేదిక మీద తండ్రిని చూసి పిల్లల్లో ఒకరిద్దరు నాన్నా.. అంటూ అరుస్తూ వేదిక మీదకి పరిగెట్టారు. ఈమె అయ్యో నా గతేంగాను అంటూ రుష్యేంద్రమణి స్థాయిలో కూలబడ ఏడవలేదు. అమాంతం అక్కడున్నవారికి కొత్త పెళ్లికొడుకు నా భర్తే అంటూ వాడి అసలు సంగతి చెప్పింది. తర్వాత ఏమి జరిగి ఉంటుందన్నది మీకూ అర్ధమయి ఉంటుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mother-39-143034.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.