వైసీపీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతోంది. ఆ పార్టీ అధికారం కోల్పోయిన తరువాత చాలా మంది నేతలు పార్టీకి దూరం జరగడమో, రాజీనామా చేసి బయటకు వెళ్లిపోవడమో చేశారు. ఇక వేరే మార్గం లేని పలువురు పార్టీలో ఉన్నా తామరాకు మీద నీటిబొట్టు మాదిరి పార్టీ వ్యవహారలలో ఇసుమంతైనా జోక్యం లేకుండా మౌనాన్ని ఆశ్రయించారు.
గతంలో జగన్ పై చిన్న పాటి విమర్శను కూడా సహించలేమంటూ ప్రత్యర్థులపై బూతుల వర్షం కురిపించిన నేతలు కూడా ఇప్పుడు నోటికి తాళం వేసుకున్నట్లుగా మౌనాన్ని ఆశ్రయించారు. గతంలోలా జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ పంపితే దానికి మీడియా ముందు చదివేయడానికి రెడీగా ఉన్న నాయకులు వైసీపీలో వేళ్ల మీద లెక్కించవచ్చు. అదే గతంలో అయితే ఇలాంటి వారి సంఖ్య లెక్కకు మించి ఉండేది.
సరే ప్రస్తుతానికి వస్తే రాజ్యసభలో జగన్ పార్టీ బలం రోజురోజుకూ పడిపోతోంది. ఉన్న 13 మందిలో నలుగురు ఇప్పటికే తమ రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేసేశారు. గతంలోనే ముగ్గురు ఎంపీలు రాజీనామా చేయగా, ఇటీవలే ఆ పార్టీ కీలక నేత, జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2 అయిన విజయసాయిరెడ్డి రాజీనామా చేసి పార్టీని వీడారు.
ఈ నేపథ్యంలోనే జగన్ గురువారం (ఫిబ్రవరి 6) మీడియాతో మాట్లాడుతూ పార్టీ వీడి వెళ్లిన వారికి క్యారెక్టర్ లేదంటూ విమర్శించారు. దీనిపై అనూహ్యంగా విజయసాయిరెడ్డి నుంచి స్ట్రాంగ్ రిటార్డ్ వచ్చింది. తనకు క్యారెక్టర్ ఉంది కనుకనే మీ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాను అని ట్వీట్ చేశారు. నా క్యారెక్టర్ సరే మీకు క్యారెక్టర్ ఉందా అని జగన్ ను నిలదీసినట్లుగా విజయసాయి ట్వీట్ ఉంది.
ఇక విజయసాయి ట్వీట్ చేసిన గంటల వ్యవధిలోనే వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేసిన మరో నాయకుడు మోపిదేవి వెంకటరమణ స్పందించారు. ఆయన కూడా తన క్యారెక్టర్ గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని పేర్కొన్నారు. జగన్ తో పాటు ఆయన అక్రమాస్తుల కేసులో తాను కూడా జైలుకు వెళ్లి వచ్చానని పేర్కొన్న మోపిదేవి.. నిజంగా ఒత్తిళ్లకు లొంగిపోయే విడినైతే జగన్ అక్రమాస్తుల కేసులో ఇరుక్కునే వాడినే కాదు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ ఇద్దరూ జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ నెటిజనులు జగన్ క్యారెక్టర్ గురించి మాట్లాడటం అడిగి మరీ తిట్టించుకోవడానికే అన్నట్లుగా ఉందంటూ సెటైర్లు వేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mopidevi-venkataramana-stromg-counter-to-jagan-39-192516.html
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.