బీజేపీ, వైసీపీ లవ్ స్టొరీ కంటిన్యూస్...?

Publish Date:Apr 30, 2024

Advertisement

మనసు ఒక చోట..మనువు ఒకచోట అన్నట్లుగా ఏపీ విషయంలో బీజేపీ హైకమాండ్ వైఖరి ఉంది. గత ఐదేళ్లుగా వైసీపీ, బీజేపీల రహస్య మైత్రి ఎంత దృఢంగా కొనసాగిందో తెలిసిందే. అయితే   కేంద్రంలో అధికారాన్ని కాపాడుకోవాలంటే బీజేపీకి దక్షిణాది నుంచి కూడా మద్దతు అనివార్యం అన్న పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ పార్టీ పాతమిత్రులకు ఆహ్వానం పలికింది. ముఖ్యంగా ఏపీలో ప్రజాభిమానం మెండుగా ఉన్న తెలుగుదేశం అవసరం బీజేపీకి తప్పని సరి అయ్యింది. పాతిక లోక్ సభ స్దానాలున్న ఆంధ్రప్రదేశ్ లో సొంతంగా ఒక్క స్థానంలో కూడా గెలిచే   అవకాశాలు లేని బీజేపీకి.. అక్కడ అధికార వైసీపీతో బంధం కంటే.. తెలుగుదేశంతో పొత్తు వల్లనే ఎక్కువ ప్రయోజనం, రాజకీయ లబ్ధి దొరుకుతుందని అర్ధమైంది. అందుకే  ఏపీలో తెలుగుదేశం, జనసేన కూటమితో జట్టు కట్టింది. పొత్తులో భాగంగా రాష్ట్రంలో తన వాస్తవ బలం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా  సీట్లనూ సంపాదించుకుంది. కేంద్రంలో అధికారంలో ఉంది కనుక బీజేపీ తమ జట్టులో ఉంటే జగన్ సర్కార్ ఎన్నికల అక్రమాలకు అడ్డుకట్టపడుతుందనీ, కేంద్ర ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా వ్యవహరిస్తుందనీ తెలుగుదేశం, జనసేనలు భావించి.. కొన్ని త్యాగాలు సైతం చేశాయి. అయితే.. తెలుగుదేశం, జనసేనతో పొత్తు ముడి పడినా, మనసు మాత్రం వైసీపీతోనే ఉందని వరుసగా జరుగుతున్న పరిణామాలు పదేపదే రుజువు చేస్తున్నాయి.

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి డిప్యూటేషన్ పొడగింపు విషయంలోనైతేనేమి, సీఎస్ జవహర్ రెడ్డి, ఇన్ చార్జ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిలపై కూటమి నేతలు చేసిన ఫిర్యాదులను పట్టించుకోకపోవడం,  ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరు జగన్, మోడీల రహస్య బంధం ఎంత పటిష్టంగా ఉందో అవగతం చేస్తున్నది. సాధారణంగా ఎన్నికల సమయంలో ఇన్ చార్జ్ ల స్థానంలో పూర్తి స్థాయి అధికారులను నియమించడం విధాయకం. అలాగే డెప్యూటేషన్ మీద ఉన్న అధికారులను కూడా మార్చేస్తారు. ఏమిటో మరి ఏపీ స్పెషల్. ఇక్కడ అలా జరగడం లేదు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి, ఇన్ చార్జ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిలపై కూటమి నేతలు ఫిర్యాదులు చేశారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చేసిన ఫిర్యాదును కూడా ఎన్నికల సంఘం బుట్టదాఖలు చేసినట్లు కనిపిస్తోంది. ధర్మారెడ్డి డెప్యుటేషన్ గడువు ముగుస్తున్న తరుణంలో ఆయనను టీటీడీ ఈవోగా మార్చడం ఖాయమనే అంతా భావించారు. రిటైర్మెంట్ ముందు సొంత శాఖకు పంపించేయడం ఆనవాయితీ. అయితే ధర్మారెడ్డి విషయంలో మాత్రం ఆ ఆనవాయితీని పాటించకుండా ఆయనకు పొడగింపు ఇవ్వడం జగన్, మోడీ బంధం కొనసాగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

సరే ఆనవాయితీలు అవీ పక్కన పెట్టినా..  ధర్మారెడ్డిని బదిలీ చేయాలని, ఆయన  తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉంటే ఆ ప్రభావం ఎన్నికలపై పడుతుందని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందే శ్వరి ఈసీతోపాటు కేంద్రానికీ లేఖ రాశారు. అలాగే  బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి సైతం  ధర్మారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన పలుకుబడి-అధికారాన్ని వైసీపీ విజయం కోసం వినియోగిస్తున్న ధర్మారెడ్డిని   బదిలీ చేయాలని ఈసీని కోరారు. అటు కూటమిలోని తెలుగుదేశం, జనసేనలు కూడా ధర్మారెడ్డిని తప్పించాలని కోరాయి.  కోరింది కూటమి కాబట్టి.. ఇంకేముంది ధర్మారెడ్డి బదిలీ ఖాయమనే అంతా భావించారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మాత్రం  ధర్మారెడ్డి డిప్యుటేషన్ పొడిగించాలన్న జగన్ అభ్యర్ధనను ఓకే చేసింది. ఇదే జగన్ మోడీల మధ్య ఉన్న లవ్ స్టోరీ కంటిన్యూ అవుతోందన్న అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

 ధర్మారెడ్డి డిప్యుటేషన్ పొడగింపు కూటమి భాగస్వామ్య పక్షాలకు ఇస్తున్న సంకేతాలేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  ఎన్డీఏ కూటమి ఉన్నప్పటికీ ఏపీలో జగన్ మాటే కేంద్రంలో చెల్లుతుందన్న సంకేతాలు వెళితే ప్రజలకు కూటమి పట్ల విశ్వాసం ఎలా కలుగుతుంది? అసలు కూటమిలో బీజేపీకి తెలుగుదేశం, జనసేన ఓట్లు బదిలీ అవుతాయా?  అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. కేవలం తెలుగుదేశం, జనసేన బలాన్ని వాడుకుని ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు సాధించాలన్న వ్యూహంతోనే బీజేపీ ఏపీలో తెలుగుదేశం, జనసేనతో పొత్తు పెట్టుకుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   ఎన్నికల సమయంలో జగన్‌కు అనుకూలంగా ఉండే అధికారుల మార్పు, విపక్ష నేతలకు పోలీసు వేధింపులూ లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయన్న  భావనతోనే బీజేపీని కలుపుకున్నాం అయితే ఆ పరిస్థితి కనిపించడం లేదని తెలుగుదేశం, జనసేనలు   అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.  ఎన్నికల సంఘం  జనసేన సింబల్ గ్లాసు గుర్తును ఇతరులకూ కేటాయిస్తోంది. డీజీపీ, సీఎస్‌ను ఇంతవరకూ మార్చలేదు. ధర్మారెడ్డిని మార్చమంటే, ఆయన డెప్యుటేషన్ పొడిగించారు.  బీజేపీతో జగన్ సంబంధాలు ఇంకా కొనసాగుతున్నాయని, ఆయనను మోడీ ఇప్పటికీ దత్తపుత్రుడిగానే చూస్తున్నారని చెప్పడానికి ఇంత కంటే నిదర్శనాలేం కావాలని తెలుగుదేశం, జనసేన శ్రేణులు అంటున్నాయి.  

ఈ పరిస్థితిలో తెలుగుదేశం, జనసేన ఓట్లు బీజేపికీ బదిలీ అయ్యే అవకాశాలు కనిపించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీ ఆపద్ధర్మ ప్రభుత్వం ఏపీలో ఎన్నికల నిబంధనలు సరిగా అమలయ్యేలా దృష్టి సారించాలనీ, అలా కాకుండా ప్రభుత్వం వేరు, పార్టీ వేరు అంటూ నంగనాచి కబుర్లు చెబితే ఫలితం ఉండదనీ అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలలో రెండు దశల పోలింగ్ పూర్తయిన తరువాత ఉత్తరాదిలో బీజేపీ భారీగా నష్టపోతోందన్న అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ విషయంలో జగన్ పార్టీకి వత్తాసుగా వ్యవహరిస్తే ఇక్కడ కూడా బీజేపీ తీవ్రంగా నష్టపోక తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కేవలం అధికారుల అండ, పోలీసుల దండతో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదనీ, జనం డిసైడైపోతే డబ్బు అధికారం ఏవీ కాపాడలేవన్న సంగతి.. బీహార్, కర్నాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసిన తరువాతైనా బీజేపీ అర్థం చేసుకోకపోతే తగు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నారు. 

By
en-us Political News

  
రండవాణేలోని కల్మాడీ హౌస్‌లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్‌ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు. తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.