హర్మూజ్ జలసంధి వద్ద ఎల్ పీజీ ట్యాంకర్ పై క్షిపణి దాడి.. భారత నావికుల భద్రతపై ఆందోళన.!
Publish Date:Jul 24, 2026
Advertisement
హర్మూజ్ జలసంధి వద్ద ఎల్ పీజీ ట్యాంకర్ పై క్షిపణి దాడి.. భారత నావికుల భద్రతపై ఆందోళన.! విదేశీ వార్తా సంస్థలు విడుదల చేసిన ఆడియో రికార్డింగ్ల ప్రకారం.. క్షిపణి దాడి జరగడానికి కొద్దిసేపటి ముందే అమెరికా మిలిటరీ ఆపరేటర్ సదరు నౌకకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ జలాల వైపు ప్రయాణాన్ని కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, నేరుగా నౌక ఇంజిన్ రూమ్ను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తామని హెచ్చరించారు. ఆ హెచ్చరికల అనంతరం నౌకపై క్షిపణులతో దాడి జరిగింది. దాడి అనంతరం అత్యవసర సహాయం కావాలి ఆ నౌక నుంచి ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. కాగా భారత ప్రభుత్వం ఇటీవలే.. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల్లోనూ భారతీయ సీఫేరర్లను, నావిక సిబ్బందిని నియమించవద్దని అన్ని అంతర్జాతీయ నౌకాయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. Strait of Hormuz tension, LPG Tanker Disha attack, Indian sailors in Iran
హర్మూజ్ జలసంధి వద్ద ఒక ఎల్పీజీ ట్యాంకర్ పై జరిగిన క్షపణి దాడిలో ఆ నౌకలో ఉన్న ఇండియన్ నావికుల భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది. మొజాంబిక్ దేశ పతాకంతో సముద్రంలో పయనిస్తున్న దిశ ఎల్పీజీ ట్యాంకర్ లో 28 మంది ఇండియన్ నావికులు విధులు నిర్వర్తిస్తున్నారు. విశ్వస నీయంగా అందిన సమాచారం మేరకు ఈ క్షిపణి దాడి నుంచి నౌకలోని 28 మంది భారత సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ మేరకు ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది. దాడి సమాచారం అందిన తక్షణమే.. ఇండియన్ ఎంబసీ.. ఇరాన్ అధికార యంత్రాంగంతో సంప్రదింపులు జరుపుతూ, నౌకలో వారి భద్రతను ఎప్పటికప్పుడు తెలుసు కుంటున్నది.
http://www.teluguone.com/news/content/missile-attack-on-lpg-tanker-near-strait-of-hormuz-36-227036.html





