మారాల్సింది మన ఆలోచనే....

Publish Date:May 12, 2018

Advertisement

ఏదైనా మన మంచికే జరిగింది అనుకోవాలి అంటుంటారు మన పెద్దవాళ్ళు. అందుకోసం ఓ ఉదాహరణ కూడా చెబుతుంటారు. తేలు కుడితే పాము కుట్టలేదని సంతోషించమంటారు. పాము కరిస్తే ప్రాణం పోలేదని సంతోషించమంటారు. వినటానికి బాగానే వున్నా, నిజంగా ఆ సూత్రాన్ని జీవితంలో అన్వయించుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మనసు మాట వినదు. దాంతో నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని మథన పడిపోతుంటాం. ఒకసారి మా అన్నయ్య ఇలానే పరిస్థితులు బాలేవు. అన్నీ నాకెదురు తిరుగుతున్నాయి. బాడ్ టైం అనగానే  మా పెద్దనాన్నగారు తప్పు. నీ ఆలోచనా విధానం మార్చుకుని ఆ పరిస్థితులని చూడు. అప్పుడు నువ్వా మాట అనవు అంటూ ఓ కథ చెప్పారు. ఇప్పటికీ పరిస్థితులు బాలేవు అనిపించగానే మా అందరికి ఆ కథే గుర్తుకొస్తుంది. ఈ రోజు మనం ఆ కథనే చెప్పుకోబోతున్నాం. 

కథ అనగానే అనగనగా అని మొదలు పెట్టాలి కదా! అనగనగా ఓసారి ఓ గురువుగారు, శిష్యుడు దేశసంచారం చేస్తూ చేస్తూ చివరికి ఓ రోజున వారి స్వంత ఊరికి చేరారు. వారి ఆశ్రమం చేరగానే అమ్మయ్య అనుకున్నారు. ఎంతో ప్రయాణం తర్వాత ఆశ్రమానికి వచ్చారేమో హాయిగా విశ్రాంతి తీసుకోవాలి అనుకున్నారు. తినటానికి ఏమన్నా దొరుకుతాయేమోనని చూస్తే రాత్రి అవటం మూలాన ఏమీ దొరకలేదు. దాంతో ఖాళీ కడుపుతో పడుకోవలసి వస్తుంది. అప్పుడు గురువుగారు "ప్రభూ నీ దయ అపూర్వం" అంటారు. శిష్యుడు అశ్చర్యంగా గురువుగారి వైపు చూస్తాడు. ఇదేంటి తినటానికి ఏమీ దొరక్కపోయినా "నీ దయ అపూర్వం" అని దేవుణ్ణి పొగుడుతున్నాడు ఈయన అని. కానీ బయటకి ఏమీ అనడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాకా కనీసం తినటానికి ఓ పండో, ఫలమో కూడా దొరకపోయినా బాగా అలసిపోయారేమో నిద్రపోవటానికి సిద్ధపడ్డారు గురుశిష్యులిద్దరూ. ఇంతలో ఓ పెద్ద గాలిదుమారం మొదలయ్యింది. వారి పాక పైకప్పు కాస్తా ఎగిరిపోయింది. అది చూసిన గురువు గారు "ప్రభూ నీ దయ అపూర్వం" అంటాడు. ఇంతలో జోరున వాన కూడా మొదలవుతుంది. పైకప్పు లేదేమో ఇద్దరూ బాగా తడిసిపోతారు. అప్పుడు మళ్ళీ గురువుగారు "ప్రభూ నీ దయ అపూర్వం" అంటారు. అది చూసిన శిష్యుడికి బాగా కోపం వచ్చేస్తుంది.

ఓ పక్క తినటానికి తిండి లేదు, విశ్రాంతిగా పడుకుందామంటే గాలి దుమారం, జోరున వాన. అయినా గురువుగారు "ప్రభూ నీ దయ అపూర్వం"అంటుంటే శిష్యుడికి చాలా కోపం వచ్చేస్తుంది. మనల్ని ఇన్ని ఇబ్బందులు పెడుతుంటే దేవుడి దయ అపూర్వం అంటారేంటి అని ప్రశ్నిస్తాడు గురువుగారిని. అప్పుడు గురువుగారు ఇలా చెబుతారు. మనం మన ప్రయాణంలో ఏవేవో తిన్నాం. ఈ పూటకి ఖాళీ కడుపుతో ఉపవాసం వుంటే మన ఆరోగ్యానికి మంచిదని భావించే ఆ పరమాత్మ మనకి తినటానికి ఏమీ దొరకకుండా చేశాడు. అలసిపోయిన మన శరీరాలు సేదతీరాలనే గాలి మనకి తగిలేలా గుడిసె పైకప్పుని తొలగించాడు. మట్టికొట్టుకుపోయిన మన శరీరాలకి చక్కటి  స్నానం అందించాలని ఇంతటి వర్షాన్ని ఇచ్చాడు. మన పై ఇంత దయ చూపిస్తుంటే ఆయనకి కృతజ్ఞత చెప్పకుండా ఎలా వుంటాం అంటారు గురువుగారు. అలా అంటూ ఆ వానలో ఆనందంతో గెంతుతూ నాట్యం చేస్తుంటాడు. 

ఈ రోజు మనం చెప్పుకున్న కథలో ఒకే పరిస్థితికి ఇద్దరి వ్యక్తుల ప్రతిస్పందన ఎలా వుందో చూశాం. ఒకరు ఆనందంగా వున్నారు. మరొకరు భాధపడ్డారు. ఒకటే పరిస్థితులు ఒకరికి అనందాన్ని, మరొకరికి దుఖాన్ని ఎలా అందించాయి? "దృకృథం"లోని తేడాయే వారి వారి ఆనందానికి, బాధకి కారణం ఎదురయ్యే పరిస్థితులని మనం ఏ విధంగా చూస్తామన్న చిన్న విషయం పై ఆధారపడే అవి మనకి ఆనందాన్ని కానీ, దుఖాన్ని కానీ అందిస్తాయని తెలుసుకుంటే, మారాల్సింది పరిస్థితులు కాదు మన ఆలోచన అని అర్థమవుతుంది మనకి...ఏమంటారు?

-రమ ఇరగవరపు

By
en-us Political News

  
ప్రేమ ఒక అందమైన భావన, కానీ చాలా మందికి ఇది పదే పదే బాధ కలిగిస్తూ ఉంటుంది. ప్రేమ మొదట్లో అద్బుతంగా ఉంటుంది..
వేసవి కాలం వచ్చిందంటే చాలు..  ప్రతి ఇంట్లో చల్లదనం కోసం ఫ్యాన్లతో పాటు కూలర్ల వాడకం  పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ, కూలర్లు  తప్పనిసరి అవుతాయి.  రోజంతా కూలర్లు పనిచేస్తూనే ఉంటాయి...
వేసవి కాలం వచ్చిందంచే సాధారణ టేబుల్ ఫ్యాన్ లు,  సీలింగ్ ఫ్యాన్ లు సరిపోవు.  వీటి నుండి వచ్చే గాలి వేసవి వేడిని కంట్రోల్ చేయలేవు. పైగా వేసవి వేడి గాలిని తిప్పి, తిప్పి గది మొత్తం వేడిగా మార్చేస్తాయి...
పెళ్లి... ఎన్నో రొమాంటిక్ ఆలోచనలను గుర్తుకు తెచ్చే ఒక అందమైన పదం. బయటకు వెళ్లడం, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడం..
ఈ కాలంలో మందు బిళ్లలు మింగకుండా ఒక్కరు కూడా ఉండటం లేదు.  పాపం చిన్న పిల్లలు సైతం  టాబ్లెట్లు మింగాల్సిన పరిస్థితి వస్తోంది.  చాలా మాత్రల మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. కొన్ని మాత్రలకు ఇది ఉండదు..
వేసవిలో దాదాపు ప్రతి ఇంట్లోనూ పెరుగు తినడం సర్వసాధారణం. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, జీర్ణక్రియకు కూడా...
ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో బాగా రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత ఖర్చు పెడితే....
మానవ శరీరానికి సంక్రమించే జబ్బులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హీమోఫిలియా జబ్బు కూడా ఒకటి. చాలా మందికి హీమోఫిలియా అనే జబ్బు..
పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితాన్ని మరొక దశలోకి తీసుకుని వెళుతుంది. ఎన్నో ఆశలతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెడతారు అమ్మాయిలు. కానీ చాలామంది అమ్మాయిలు చెప్పే మాట.. అత్తగారు సరిగా చూసుకోవడం లేదని, అత్తగారు సరిగా మాట్లాడటం లేదని. ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల సంబంధం ఎప్పుడూ...
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు.  అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు...
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు...
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి...
ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర.  ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.