Publish Date:Jan 31, 2025
కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ వరుసగా మూడో సారి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ప్రవేశపెట్టనున్న తొలి పూర్తి స్థాయి బడ్జెట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. అన్ని వర్గాలలో ఈ బడ్జెట్ పై విపరీతమైన ఆశలు ఉన్నాయి. అన్ని వర్గాల ఆకాంక్షలనూ నెరవేర్చేలా బడ్జెట్ ఉండబోతోందన్న అంచనాలూ ఉన్నాయి.
లోక్ సభలో బీజేపీకి స్వయంగా పూర్తి మెజారిటీ లేని పరిస్థితుల్లో ప్రభుత్వ మనుగడ ప్రధానంగా తెలుగుదేశం, జేడీయూ వంటి పార్టీల మద్దతుపైనే ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, బీహార్ లకు కేటాయింపుల్లో సింహభాగం దక్కే అవకాశాలున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో గతంలోలా మోడీ సర్కార్ పై ప్రజలలో సంపూర్ణ విశ్వాసం కొరవడటానికి కారణాలను అన్వేషించిన బీజేపీ అగ్రనాయకత్వం ఈ సారి బడుగు, బలహీన, మధ్య తరగతిపై వరాల జల్లు కురిపించేలా బడ్జెట్ ఉంటుందన్న అంచానాలూ ఉన్నాయి.
శనివారం (ఫిబ్రవరి 1) ఉదయం 11గంటలకు కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. దేశవ్యాప్తంగా అన్ని వర్గాలూ అంటే బడుగు,బలహీన మధ్యతరగతి, పారిశ్రామికవర్గాల నుంచి వేతన జీవుల వరకూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో తమకు ప్రయోజనం కలిగించే ప్రకటనలు ఉంటాయని ఆశిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిర్మలమ్మ పద్దులో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు పలు అంశాల్లో ఊరట లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే వ్యవసాయదారులు, మహిళలు, పేదవర్గాలు, యువతపై ప్రత్యేక దృష్టి పెట్టి మరీ బడ్జెట్ ను రూపొందించిననట్లు తెలుస్తోంది. ఆర్థిక వృద్ధిరేటు నాలుగేళ్ల కనిష్ట స్థాయికి పతనమైన పరిస్థితుల్లో దానిని పెంచడం, అలాగే అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్.. ఇతర దేశాలపై భారీగా సుంకాలు విధిస్తామన్న హెచ్చరికల నేపథ్యంలో నిర్మలమ్మ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పై దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆసక్తి కనిపిస్తోంది.
ఇక బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడిన మాటలు అలాగే ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసగం బట్టి చూస్తే ఈ సారి బడ్జెట్ లో మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట లభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఆదాయపన్ను విధానంలో భారీ సంస్కరణలకు ఈ బడ్జెట్ తెరతీస్తుందని అంటున్నారు. అలాగే పన్ను శ్లాబుల విషయంలో కూడా వేతన జీవులకు మంచి వెసులుబాటు ఉండే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇక విత్తమంత్రి నిర్మలాసీతారామన్ పద్దుపై తెలుగు రాష్ట్రాలూ ఆసక్తిగా ఆశగా ఎదురు చూస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పోలవరం, అమరావతిలకు మరిన్ని నిధులను కేంద్రం కేటాయిస్తోందని ఆశిస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/middle-class-hopes-on-union-budget-25-192158.html
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.