సంతోషంగా ఉండేందుకు ఓ బౌద్ధ భిక్షువు చిట్కాలు...!

Publish Date:May 29, 2017

Advertisement

 

ఫ్రాన్స్‌కు చెందిన మాథ్యూ రికార్‌ (Matthieu Ricard) అందరిలాగే బుద్ధిగా చదువుకునేవాడు. ‘మాలిక్యులర్‌ జెనెటిక్స్‌’లో పీహెచ్‌డీ సైతం సాధించాడు. కానీ విజ్ఞానశాస్త్రం లోతులు చూస్తున్న కొద్దీ, తన మనసులో ఏముందో కూడా తెలుసుకోవాలనిపించింది మాథ్యూకి.

 

అందుకోసం ఫ్రెంచ్‌ తత్వవేత్తలు రాసిన పుస్తకాలన్నింటినీ చదవడం మొదలుపెట్టాడు. చివరికి భారతదేశమే తనలోని ఆధ్మాత్మిక జిజ్ఞాసకు దారిచూపగలదని నిశ్చయించుకున్నాడు. అలా ఇండియాకు చేరుకున్న మాథ్యూ బౌద్ధమతాన్ని పుచ్చుకొని నేపాల్‌లో స్థిరపడిపోయాడు.

 

మాథ్యూ గురించి విన్న కొందరు పరిశోధకులు మెదడు మీద ధ్యానం కలిగించే ప్రభావాన్ని అంచనా వేసేందుకు, అతన్ని ఎంచుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా 12 సంవత్సరాల పాటు దఫదఫాలుగా ఆయనని పరిశీలించి చూశారు. మాథ్యూ మెదడుకి 256 సెన్సర్లు అమర్చి, ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన మెదడు ఎలా పనిచేస్తోందో గ్రహించే ప్రయత్నం చేశారు.

 

మాథ్యూ ధ్యానం చేస్తున్నప్పుడు, అతని మెదడులో ఏర్పడుతున్న తరంగాల స్థాయిని చూసి పరిశోధకులే ఆశ్చర్యపోయారు. ఆ స్థాయిలో ఇదివరకు ఎప్పుడూ తరంగాలు నమోదవలేదని తేల్చారు. ఎంతో ప్రశాంతంగా ఉంటే తప్ప మెదడులో అలాంటి చర్య సాధ్యం కాదని గ్రహించారు.

 

ఈ పరిశోధన బయటకు రావడంతో మీడియా అంతా ఆయనని "happiest person in the world" అంటూ ఆకాశానికి ఎత్తేసింది. కానీ తనకు అలాంటి బిరుదులేవీ వద్దని, తనని మించిన ఆధ్యాత్మికవేత్తలు ఎందరో ఉన్నారని మాథ్యూ చెబుతూ ఉంటారు.

 

ఇంతకీ మాథ్యూ మనసు ఇంత సంతోషంగా ఉండటానికి కారణం ఏమిటి అని అడిగితే... ఆయన చెప్పే సమాధానాలు వినండి. బహుశా అవి మనకు కూడా ఉపయోగపడతాయేమో!

 

- ఎప్పుడూ ‘నేను, నేను, నేను’ అంటూ నీ గురించే ఆలోచిస్తూ ఉంటే ప్రపంచం మొత్తం నీకు శత్రువులాగానే కనిపిస్తుంది. దాంతో మనశ్శాంతి కరువవుతుంది. జాలి, కరుణ, పరోపకారం లాంటి భావనలు చోటు చేసుకున్నప్పుడు మనసు, శరీరం రెండూ ఆరోగ్యంగా ఉంటాయి.


- ఎంతసేపూ సుఖాన్ని అందించే అనుభవాల కోసం వెంపర్లాడుతూ ఉంటే... సంతోషం ఎప్పటికీ దక్కదు. అలాంటి వెంపర్లాటతో అలసట తప్ప మేరమీ మిగలదు.

 

- సంతోషం ఒక మానసిక స్థితి. జీవితంలోని ఒడిదొడుకులను ఎదుర్కొనేందుకు కావల్సిన శక్తిని అది అందిస్తుంది.


- సహనం చాలా ముఖ్యం. ఓర్పు ఫలం ఎప్పుడూ తియ్యగా ఉంటుంది. ఓర్పుతో ఉన్నప్పుడు, అద్భతమైన వ్యక్తిత్వం ఏర్పడేందుకు అవసరమయ్యే సుగుణాలన్నీ మనలో ఏర్పడతాయి.

 

- జీవితం నిరాశాజనకంగా ఉందని ఎప్పుడూ డీలా పడిపోవద్దు. అలాంటి సమయంలో కాస్త ఓర్పుగా ఉంటే అనుకోని మార్పులు సంభవిస్తాయి.


- రోజుకి కనీసం 10-15 నిమిషాల పాటు మనసుని సంతోషకరమైన ఆలోచనలతో నిలిపి ఉంచే ప్రయత్నం చేస్తే జీవితమే మారిపోవడాన్ని గమనించవచ్చు.

 

- జీవితంలో ఎలాగైతే కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటూ మన మెదడుకి శిక్షణ ఇస్తూ ఉంటామో... అలాగే జాలి, పరోపకారం, కరుణ లాంటి మంచి లక్షణాలను కూడా మెదడుకి అలవాటు చేయడం సాధ్యమే!

 

- ఒకేసారి గంటల తరబడి ధ్యానంలో మునిగిపోవాల్సిన అవసరం లేదు. క్రమం తప్పకుండా కొద్ది నిమిషాల సేపైనా చేసే ధ్యానం తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది. క్రమం తప్పకుండా నడిచేవాడు ఒలింపిక్స్‌కి వెళ్లి పతకం సాధించలేకపోవచ్చు.... కానీ అలసట లేకుండా సుదీర్ఘ ప్రయాణం చేసే నైపుణ్యాన్ని సాధిస్తాడు కదా!

- నిర్జర.

By
en-us Political News

  
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి బిజీ బిజీ జీవితాలలో మనస్ఫూర్తిగా,  సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అందరూ ఉద్యోగాలు చేస్తారు,  వ్యాపారాలు చేస్తారు, సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు....
ప్రపంచంలో అన్ని రకాల మనుషులు  ఉంటారు.  మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే...
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది...
మంచి, చెడు ప్రతి మనిషిలోనూ తప్పకుండా ఉండే గుణాలు.  మనుషులు కొన్ని విషయాల్లో మంచిగా, మరికొన్ని విషయాల్లో చెడ్డగా ఉంటారు. పూర్తీగా మంచితనం ఉన్న మనుషులు, పూర్తీగా చెడ్డగా ఉన్న మనుషులు ఎక్కడా ఉండరు...
అపరాజిత లేదా శంఖు పుష్పాలు నీలం ,  తెలుపు రంగులో ఉంటాయి.  ఈ పువ్వులు  చాలా అందంగా ఉంటాయి. శంఖు పుష్పం మొక్కను దేవతా మొక్కగా పరిగణిస్తుంటారు.  ఈ పువ్వులు  సంతోషం, శ్రేయస్సు,  సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వేసవిలో...
వేసవి వచ్చేసింది, తీవ్రమైన ఎండ , మండే ఎండలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ ఎండల ఇబ్బందికి తోడు వేసవిలో కరెంట్ కోత కూడా దారుణంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది.
గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన,  భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు యేసు క్రీస్తు శిలువపై మరణించిన సంఘటనను స్మరించుకుంటారు...
పిల్లలను సరిగ్గా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా పిల్లల జీవితాన్ని నాశనం చేయగలదు. సరైన పెంపకం పిల్లలను విజయ శిఖరాలకు చేరుస్తుంది అనడంలో  ఎలాంటి సందేహం లేదు...
నేటి డిజిటల్ ప్రపంచంలో, పిల్లలకు, ముఖ్యంగా టీనేజర్లకు చదువుకునేటప్పుడు ఏకాగ్రత పెట్టడం చాలా కష్టంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, గేమ్‌లు, సోషల్ మీడియా,  మరెన్నో విషయాలు వారి చదువుకు చాలా..
వేసవికాలం అలా రాగానే.. అందరికీ చల్లదనం కావాలని అనిపిస్తుంది.  పడుకోవడానికి గది చల్లగా ఉండాలి.. దుకోసం కూలర్లు, ఏసీలు రెఢీ చేసుకుంటారు. అలాగే చల్లగా నీరు తాగాలని అనిపిస్తుంది.  నేటికాలంలో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ లు ఉండటం సహజమే అయినా ఫ్రిజ్ లో ఉంచిన నీరు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతుంటారు...
జైనమత 24వ తీర్థంకరుడు మహావీరుడు ఆధ్యాత్మికత ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నాడు. యువరాజు వర్ధమానుడు  తన సాధన,  ఆధ్యాత్మిక మార్గం ద్వారా  మహావీరుడిగా  పరివర్తన చెందాడు.  అయితే ఇలా పరివర్తన చెందడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది..
భార్యాభర్తల బంధం చాలా ప్రత్యేకమైనది. నేటికాలంలో భార్యాభర్తల బంధం పెళుసుగా మారిందని చెప్పవచ్చు.  బార్యాభర్తలు గొడవ పడటం అనేది చాలా కామన్ గా మారింది.  అయితే కొన్నిసార్లు గొడవలు కాస్తా బంధాన్ని విచ్చిన్నం చేసే..
వేసవి వచ్చేసింది.. ఈ మండే ఎండల వల్ల ప్రతిఒక్కరూ చాలా ఇబ్బంది పడతారు, వేసవికాలం చాలా ఆరోగ్యపరంగా చాలా   ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన కాలం...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.