Publish Date:Apr 14, 2026
తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు. తృణమూల్ కాంగ్రెస్ ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తోందని విరుచుకుపడ్డారు. మమతా బెనర్జీ వారి పట్ల సవతితల్లి ప్రేమను చూపుతోందన్నారు. మైనారిటీల సంక్షేమాన్ని విస్మరించి, వారిని కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితం చేశారన్నారు.
ముర్షీదాబాద్ జిల్లాలో సోమవారం (ఏప్రిల్ 13) నిర్వహించిన భారీ ఎన్నికల బహిరంగ సభలో ఒవైసీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
రాష్ట్రంలోని హల్దియా, ఖరగ్పుర్ వంటి ప్రాంతాల అభివృద్ధిని ప్రస్తావించిన అసదుద్దీన్ ఒవైసీ.. ముర్షీదాబాద్ వంటి జిల్లాలో కనీసం ఒక్కటంటే.. ఒక్క ప్రత్యేక ఆర్థిక మండలి కూడా కూడా ఎందుకు ఏర్పాటు కాలేదని విమర్శించారు.
బిజెపి బూచి చూపి.. ముస్లింలలో భయాందోళనలు సృష్టించి ఎన్నికలలో లబ్ధి పొందాలని తృణమూల్ ప్రయత్నిస్తోందన్నారు. రఘునాథ్ గంజ్ నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ముర్షీదాబాద్ రూపురేఖలు మారుస్తామని ఆయన ఓటర్లకు హామీ ఇచ్చారు. జిల్లాలో పరిశ్రమల స్థాపన కోసం ఎంఐఎం పోరాడుతుందన్న ఆయన, ముర్షీదాబాద్లో పారిశ్రామికాభివృద్ధి కోసం ఎంఐఎం అభ్యర్థిని గెలిపిం చాలని కోరారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో మైనారిటీల ఓట్లు కీలకం కావడంతో అసదుద్దీన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రధానంగా ముస్లిం మైనారిటీలు అధికంగా ఉన్న ముర్షీదాబాద్ జిల్లాలో అసదుద్దీన్ వ్యాఖ్యలు ఎన్నికలలో ఏ మూరకు ప్రభావితం చేస్తాయన్న విషయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అసదుద్దీన్ వ్యాఖ్యలు బీజేపీకి మేలు చేసేవిగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mamata-votebank-politics-with-muslims-39-217314.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది