Publish Date:Oct 25, 2024
బీఆర్ఎస్ పార్టీకి పేరుతో పెద్ద చిక్కే వచ్చిపడింది. టీఆర్ఎస్ గా ప్రస్థానం మొదలు పెట్టిన ఆ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సుదీర్ఘ పోరాటం చేసింది. ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ రాజకీయాలకు అతీతంగా తెలంగాణకు అనుకూలంగా అందరి మద్దతూ పొందింది. సరే తెరాస ఉద్యమాల కారణంగానో.. అప్పటికి కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజకీయ అనివార్యత వల్లో తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. తెలంగాణ సాధించిన పార్టీగా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టారు.
తెలంగాణ ఇచ్చిన పార్టీగా చెప్పుకున్న కాంగ్రెస్ కంటే.. కోట్లాడి తెలంగాణ సాధించాను అన్న కేసీఆర్ మాటనే ప్రజలు విశ్వసించారు. సరే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత వరుసగా రెండు సార్లు తెరాసకే పట్టం కట్టారు. ఉద్యమ పార్టీగా జనం తెరాసను గుండెల్లో పెట్టుకున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది కాలానికే తెరాస అధినేత కేసీఆర్.. తెరాస ఉద్యమ కార్యాచరణ ముగిసిందనీ, ఇక తమ పార్టీ ఫక్తు రాజకీయ పార్టీ అని ప్రకటించారు. అక్కడ నుంచి ఇతర పార్టీల నేతలకు పార్టీ తలుపులు బార్లా తెరిచేసి ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించారు.
సరే రెండో మారు అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న తీవ్ర ఆకాంక్షతో పార్టీ పేరును మార్చేశారు. అంటే టీఆర్ఎస్ గా ఆవిర్భవించిన పార్టీ పేరు బీఆర్ఎస్ గా మారింది. ఆ సందర్భంగా ఆయన చేసిన హడావుడీ, హంగామా అంతా ఇంతా కాదు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో బీఆర్ఎస్ ను విస్తరించారు. మహారాష్ట్రపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఔరంగాబాద్, నాందేడ్ లలో భారీ బహిరంగ సభలు నిర్వహించడమే కాకుండా, ఆ రాష్ట్రంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా చేపట్టారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాలలో కలిపి దాదాపు 20 లక్షల మంది బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. ఆ హడావుడి, ఆర్భాటం చూసి మహారాష్ట్ర రాజకీయాలలో బీఆర్ఎస్ అత్యంత కీలకం కాబోతున్నదని అంతా ఊహించారు.
అయితే 2023 డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ పరాజయం పాలు కావడంతో పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులైపోయింది. ఆ తరువాత జరిగిన పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణలో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా బీఆర్ఎస్ గెలవలేదు. ఈ ఓటములతో కేసీఆర్ దాదాపుగా అజ్ణాతవాసంలోకి వెళ్లిపోయారు. దీంతో రాష్ట్రంలో పార్టీ పూర్తిగా బలహీనపడింది. ఆ పార్టీ నుంచి పలువురు నేతలు జంప్ అయిపోయారు. పార్టీలో ఉన్న నేతలకు కనీసం కేసీఆర్ దర్శన భాగ్యం కూడా కలగని పరిస్థితి ఉంది. దీంతో ఇప్పుడు మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. త్వరలో మహారాష్ట్ర ఎన్నికలు జరగనున్నాయి. కేసీఆర్ నుంచి ఉలుకూ పలుకూ లేకపోవడంతో మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు తమ రాష్ట్రంలో బీఆర్ఎస్ పేరును ఎమ్ఆర్ఎస్ గా మార్చుకోవాలని నిర్ణయానికి వచ్చేశారు. మహారాష్ట్ర రాజ్య సమితిగా భారత రాష్ట్ర సమితి పేరు మార్పునకు వారు నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర పరివర్తన్ ఫ్రంట్, రైతు సంఘాల మద్దతుతో మహారాష్ట్ర ఎన్నికలలో కనీసం80 స్థానాలలో ఎమ్ఆర్ఎస్ అభ్యర్థులను నిలబెట్టాలని భావిస్తున్నారు. సో.. కత్తీ పోయి కర్రా వచ్చే ఢాంఢాంఢాం అన్నట్లు టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ వచ్చే.. బీఆర్ఎస్ పోడి ఎమ్ఆర్ఎస్ వచ్చే అనుకోవాల్సి ఉంటుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/maharashtra-brs-decided-to-change-party-name-25-187368.html
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
మ్మెల్సీ రామసుబ్బారెడ్డి తన సతీమణి ఇందిరమ్మతో కలిసి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఈ దశలో వైపీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు ఎమ్మెల్సీ దంపతులను, పలువురు కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.
విజయ్ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు స్పందించలేదు. తన భార్యపై గానీ, కోర్టులో ఉన్న విడాకుల ప్రక్రియపై గానీ విజయ్ పన్నెత్తు మాట మాట్లాడలేదు. వ్యక్తిగత విషయాలకూ, రాజకీయాలకూ సంబంధం లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో తమకు ఉన్న మిత్రబంధం కేవలం కేంద్ర స్థాయికి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని, తెలంగాణలో ఆ పొత్తును పొడిగించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
వైసీపీ అధినేత జగన్ మాత్రం బాధితుల వేదనను, కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా, అక్రమాలకు పాల్పడిన నిందితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తూ, ఓదార్చడం వింతగా విడ్డూరంగా ఉందన్నారు. అక్రమాలకు పాల్పడండి అండగా ఉంటానంటూ జగన్ నిందితులకు భరోసా ఇస్తున్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు.
దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న సీనియర్ నేత చలసానికి సొంత పార్టీ నుంచే ఈ స్థాయి ఒత్తిడి రావడం వెనుక కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మాక్స్ చట్టం కింద స్వతంత్రంగా నడుస్తున్న ఈ డెయిరీలో ప్రభుత్వ జోక్యానికి తావు లేకపోయినా. . చలసానిపై ఈ స్థాయిలో రాజీనామాకు ఒత్తడి రావడం పట్ల పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్రాజ్లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.
పరామర్శల పేరిట పోలీసుల ఆంక్షలను ఉల్లంఘిస్తూ, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా సాగుతున్న ఆయన పర్యటనల తీరు నేపథ్యంలో జగన్ భద్రత అంశం మరోసారి చర్చకు వచ్చింది. అంతటితో ఆగకుండా, జగన్కు రక్షణ తగ్గించారంటూ వైసీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వడంతో జగన్ భద్రత అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.