Publish Date:May 18, 2023
నదీ నదాలూ,
అడవులు, కొండలు,
ఎడారులా మన కడ్డంకి?
పదండి ముందుకు!
అన్నట్లుగా లోకేష్ పాదయాత్ర సాగుతోంది. ప్రభుత్వ అవరోధాలనే కాదు, గయాలను కూడా లేక్క చేయకుండా.. రాష్ట్రంలో రాక్షస పాలన అంతమే లక్ష్యంగా లోకేష్ ముందడుగు వేస్తున్నారు. ఈ క్రమంలోనే గత 50 రోజులుగా భుజం నొప్పి తీవ్రంగా వేధిస్తున్నా.. క్షణం కూడా విశ్రమించకుండా పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ముఖంలో బాధ, అలసట కూడా కనిపించనీయకుండా ప్రజలతో మమేకమౌతూ, కొరిన వారందరితో సెల్ఫీలు దిగుతూ, వారు చెబుతున్న సమస్యలను సావధానంగా వింటూ విరామం లేకుండా నడుస్తూనే ఉన్నారు. భుజం నొప్పి నుంచి ఉపశమనం కోసం ఫిజియో థెరపీ చేయించుకున్నా, వైద్యులు సూచనలు పాటించినా ఫలితం లేకపోయింది. దీంతో వైద్యుల సూచన మేరకు ఆయన ఈ రోజు నంద్యాలలోని మాగ్న ఎంఆర్ఐ సెంటర్ లో స్కానింగ్ చేయించుకున్నారు.
లోకేష్ పాదయాత్ర అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో ప్రవేశించిన సమయంలో భారీగా జనం తరలి రావడంతో జరిగిన తొక్కిసలాటలో ఆయన భుజానికి గాయమైంది. అప్పటి నుంచీ ఈ 50 రోజులుగా లోకేష్ భుజం నొప్పితోనూ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఫిజియో థెరపీ, నొప్పి ఉపశమనం కోసం వైద్యుల సూచనలూ పాటిస్తూ వస్తున్నారు. అయితే నొప్పి తగ్గక పోవడంతో వైద్యులు ఎంఆర్ఐ స్కానింగ్ అవసరమని చెప్పడంతో ఈ రోజు నంద్యాలలో ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకున్నారు. నారా లోకేష్ పాదయాత్ర ఈ రోజు 103వ రోజుకు చేరుకుంది. లోకేష్ పాదయాత్ర సందర్భంగా నంద్యాల జనసంద్రంగా మారింది. భుజం నొప్పి తీవ్రంగా ఉన్నా ఆయన సంకల్పం సడలలేదు. భుజానికి ఎంఆర్ఐ స్కానింగ్ కారణంగా ఈ రోజు పాదయాత్రలో రైతులతో ముఖాముఖీ కార్యక్రమాన్ని మధ్యాహ్నం రెండు గంటలకు చేపట్టాలని లోకేష్ నిర్ణయించారు.
ఆ తరువాత నంద్యాల యాతం ఫంక్షన్ హాలు వద్ద తన పాదయాత్ర 1300 కిలోమీటర్లకు చేరుకున్న సందర్భంగా మైలురాయిని ఆవిష్కరిస్తారు. అక్కడ నుంచి ఆయన కానాల జాతీయ రహదారి విస్తరణ బాధితులతో సమావేశమౌతారు. సాయంత్రానికి హెచ్ఎస్ కొట్టాల చేరుకుని అక్కడ స్థానికులతో సమావేశమౌతారు. అనంతరం ఎం చిన్న కొట్టాలలో కూడా స్థానికులతో భేటీ అవుతారు. అక్కడ నుంచి జూలపల్లి చేరుకుని వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వారితే భేటీ అవుతారు. అక్కడ నుంచి పసరుపాడు మీదుగా తెల్లాపురి చేరుకుంటారు.
తెల్లాపురి నుంచి రాయపాడు చేరుకుని అక్కడ స్థానికులతో సమావేశమౌతారు. రాత్రికి రాయపాడు శివారు విడిది కేంద్రంలో బస చేస్తారు. ఉదయం స్కానింగ్ కారణంగా పాదయాత్ర ఆలస్యం కావడంతో ఆమేర ఆయన షెడ్యూల్ లో మార్పు చేసుకుని రాత్రి పదిన్నర వరకూ పాదయాత్రను కొనసాగించాలని నిర్ణయించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/lokesh-undergoes-mri-scan-39-155510.html
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.